logo

గోవింద నామస్మరణతో భక్తజనం పులకింత

వాడపల్లి పుణ్యక్షేత్రం శనివారం భక్తజనంతో కిక్కిరిసింది. స్వామికి ప్రీతిపాత్రమైన రోజు, దసరా శరన్నవరాత్రులు సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పరిసరాలన్నీ గోవిందనామ స్మరణతో ప్రతిధ్వనించాయి.

Published : 02 Oct 2022 04:20 IST

విశేష పుష్పాలంకరణలో స్వామివారు

వాడపల్లి(ఆత్రేయపురం), న్యూస్‌టుడే: వాడపల్లి పుణ్యక్షేత్రం శనివారం భక్తజనంతో కిక్కిరిసింది. స్వామికి ప్రీతిపాత్రమైన రోజు, దసరా శరన్నవరాత్రులు సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పరిసరాలన్నీ గోవిందనామ స్మరణతో ప్రతిధ్వనించాయి. 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా. 15వేల మంది అన్నప్రసాదాలు స్వీకరించారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్లు తదితరాల అమ్మకాల ద్వారా రూ.17.50లక్షలు ఆదాయం వచ్చింది. భక్తులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపారు. దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని