logo

పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్‌

పేదలకు ఒక్కపూటైనా ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో తెదేపా హయాంలో అన్న క్యాంటీన్‌ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు.

Published : 02 Oct 2022 04:20 IST

అమలాపురం అన్నక్యాంటీన్‌లో ప్రజలకు వడ్డిస్తున్న

బండారు సత్యనారాయణమూర్తి, తెదేపా నాయకులు

అమలాపురం పట్టణం న్యూస్‌టుడే : పేదలకు ఒక్కపూటైనా ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో తెదేపా హయాంలో అన్న క్యాంటీన్‌ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. అమలాపురంలోని ముమ్మడివరం గేట్‌ సమీపంలో పార్టీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు గంటి హరీష్‌మాథుర్‌ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను సత్యనారాయణమూర్తి శనివారం ప్రారంభించి మాట్లాడారు. తన తండ్రి బాలయోగిని స్మరించుకుంటూ అన్న క్యాంటీన్‌ ప్రారంభించినట్లు హరీష్‌ మాథుర్‌ తెలిపారు. భారీగా తరలి వచ్చిన ప్రజలకు సత్యనారాయణమూర్తి, హరీష్, తెదేపా నాయకులు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ ఉపసభాపతి రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, బండారు సత్యానందరావు, తెదేపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, నాయకులు ఆదిరెడ్డి వాసు, మెట్ల రమణబాబు, పెచ్చెట్టి చంద్రమౌళి, పెచ్చెట్టి విజయలక్ష్మి, బొర్రా ఈశ్వరరావు, కౌన్సిలర్లు బొర్రా వెంకటేశ్వరరావు, చిక్కాల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని