ప్రాణం తీసిన ఆటవిడుపు
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం ముగ్గురు యువకులు నిర్లక్ష్యంగా కారు నడుపుతూ బీభత్సం సృష్టించారు. స్వీయ చిత్రాలు తీసుకుంటూ నడపడంతో కారు జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా తండ్రి, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి.
వీరబాబు (పాత చిత్రం)
తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం ముగ్గురు యువకులు నిర్లక్ష్యంగా కారు నడుపుతూ బీభత్సం సృష్టించారు. స్వీయ చిత్రాలు తీసుకుంటూ నడపడంతో కారు జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా తండ్రి, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. తణుకు పట్టణానికి చెందిన కోడి గుడ్లు ఎగుమతి చేసే ట్రేడర్ సబీర్ హుస్సేన్కు చెందిన కారులో అతని కుమారుడు సయ్యన్ హుస్సేన్, స్నేహితులు వడ్డి సాయిపవన్ ఫణేంద్ర (తాడేపల్లిగూడెం), ఆముదాలపల్లి శశికిరణ్ (వేల్పూరు) చరవాణుల్లో స్వీయ చిత్రాలు తీసుకుంటూ కారు నడుపుతున్నారు. సొసైటీ రోడ్డులో శశి స్కూల్ సమీ పాన అదుపు తప్పిన కారు జనాలపైకి దూసుకెళ్లి, వైఎస్సార్ పార్కు గోడను ఢీ కొని ఆగింది ఈ ప్రమాదంలో కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన నంబూరి వీరబాబు (65), హౌసింగ్ బోర్డు కాలనీలో అపార్ట్మెంట్ వద్ద వాచ్మ్యాన్గా పని చేస్తున్న శీల శ్రీను, ఆయన కుమార్తె శీల నాగసత్యదుర్గాభవానిలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108లో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. వీరబాబు చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్రీను, భవానీలు చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో సయ్యన్ హుస్సేన్ కారు నడుపుతున్నాడని స్థానికులు చెప్పారు.
పూజలు చేయడానికి వచ్చి.. పలివెల గ్రామానికి చెందిన వీరబాబు కుటుంబ సభ్యులు, కొంత మంది బంధువులతో కలసి ఆదివారం ఉదయం వీరభద్రస్వామికి పూజలు నిర్వహించడానికి తణుకు వచ్చారు. ఈ క్రమంలో భాగంగా పానకాల కావిడిని మోయడానికి పట్టణానికి చెందిన శీల శ్రీనును పురమాయించుకున్నారు. అతను పానకాల కావిడితో నడుస్తుండగా... ఆయన కుమార్తె నాగసత్యదుర్గాభవాని తండ్రిని అనుసరిస్తున్నారు. ఈ సమయంలో వేగంగా వెనుక నుంచి కారు వీరిపైకి దూసుకొచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. సయ్యన్ హుస్సేన్ అక్కడ నుంచి పరారు కాగా సాయిపవన్ ఫణీంద్ర, శశికిరణ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా కూటమిని గెలిపించాలి
[ 17-04-2024]
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెదేపా కూటమిని గెలిపించాలని సీనియర్ నాయకుడు పెండ్యాల అచ్చిబాబు కోరారు. -
ఎన్నికల వేళ వైకాపాలో కుదుపు
[ 17-04-2024]
రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో 1996 డిసెంబర్ 29న దళితులకు శిరోముండనం చేసిన ఘటన రాష్ట్రమంతా నాడు కుదిపేసింది. కుంగిపోయిన బాధితులు ఇళ్లలోనే ప్రాణభయంతో మగ్గిపోయారు. -
ఏడు రోజులన్నారు.. ఏడిపిస్తున్నారు
[ 17-04-2024]
సీపీఎస్.. ఈ విధానం రద్దుకు రాష్ట్రంలో ఉద్యోగులు తెలపని నిరసన లేదు.. చేయని ఆందోళన లేదు. -
ఉదయం నుంచి ఉత్కంఠ
[ 17-04-2024]
వెెంకటాయపాలెం శిరోముండనం కేసు తీర్పు మంగళవారం వచ్చిన నేపథ్యంలో ఆ గ్రామంలో ఉదయం నుంచే ఉత్కంఠ నెలకొంది. తీర్పు ఏవిధంగా ఉంటుందన్న అంశంపై వారం రోజులుగా ఇక్కడ చర్చ నడుస్తోంది. -
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 17-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 18 నుంచి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
ప్రజల చేతుల్లోనే రామరాజ్యం
[ 17-04-2024]
ఓటు అనే వజ్రా యుధంతోనే రామ రాజ్యం సాధ్యమవుతుంది. అయిదేళ్ల భవితకు పట్టం కడుతుంది. పాలకులు సంక్షేమ సారథులు కావాలంటే ఎన్నికల వేళ ఓటర్లంతా రామబాణం సంధించాలి. -
అడ్డగోలు ప్రచారం.. ట్యాబ్లే నిదర్శనం
[ 17-04-2024]
ఎన్నికలు ముంచుకొస్తున్నా వైకాపా అడ్డదారి ప్రచారానికి మాత్రం అడ్డుకట్ట పడడంలేదు. విద్యార్థులనూ ఈ వ్యవహారంలో వినియోగించుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నా.. విద్యాశాఖ, ఎన్నికల సంఘం పరిస్థితిని చక్కదిద్దే చొరవ చూపడంలేదు. -
నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు వీరే..
[ 17-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఒక లోక్సభ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
మరో 28,853 మందికి ఓటు హక్కు
[ 17-04-2024]
జిల్లాలోని కాకినాడ పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలకు ఈ నెల 18 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. -
ఏళ్లు గడిచినా సమస్యలు పట్టవా..?
[ 17-04-2024]
కొవ్వూరు పట్టణ పరిధిలో క్రిస్టియన్పేటగా పిలిచే 3, 4 వార్డులను పలు సమస్యలు వేధిస్తున్నాయి. మురుగు వ్యవస్థ ఇబ్బందికరంగా మారుతోంది. -
కూటమి ఐక్యత అన్ని నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉండాలి: నాగబాబు
[ 17-04-2024]
పిఠాపురంలో జనసేన, తెదేపా, భాజపా కూటమి శ్రేణుల ఐక్యత ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు అన్నారు. -
ఏళ్లు గడుస్తున్నా.. పరిహారం అందలేదు
[ 17-04-2024]
పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు తమ భూములు తీసుకొని ఏళ్లు గడుస్తున్న నేటికి పరిహారం అందించలేదని తమకు న్యాయం జరిగేలా చూడాలని గిరిజనేతర రైతులు కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. -
‘పార్టీ పదవి కంటే ఐకమత్యమే ముఖ్యం’
[ 17-04-2024]
వైకాపా నాయకుడు తోట రామకృష్ణపై అదే పార్టీ నాయకులు ఇటీవల దాడి చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కాపుసంఘం అధ్యక్షుడు చిలిమలి వెంకటరాయుడు తెలిపారు. -
ముఖ్యమంత్రి సభకు బస్సులు... ప్రయాణికుల పడిగాపులు
[ 17-04-2024]
సమయానుకూలంగా బస్సులు రాక.. కొన్ని మార్గాల్లో పూర్తిస్థాయిలో సర్వీసులు అందుబాటులో లేక.. సకాలంలో గమ్యస్థానాలకు చేరలేక ఆర్టీసీ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్