logo

బడ్డీ కొట్టులోకి దూసుకెళ్లిన కారు

అంబాజీపేట మండలం కె.పెదపూడి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి.  స్థానికంగా నిర్వహిస్తున్న  బడ్డీకొట్టు హోటల్‌లోకి కారు దూసుకెళ్లింది.

Published : 03 Oct 2022 05:47 IST

కె.పెదపూడిలో అదుపుతప్పిన కారు

అంబాజీపేట: అంబాజీపేట మండలం కె.పెదపూడి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి.  స్థానికంగా నిర్వహిస్తున్న  బడ్డీకొట్టు హోటల్‌లోకి కారు దూసుకెళ్లింది. యానాంకు చెందిన కారు కె.పెదపూడి నుంచి అంబాజీపేట వైపు వస్తున్న సమయంలో అంబాజీపేట - అమలాపురం ప్రధాన రహదారిపై వెళ్తున్న ఓ మోటార్‌సైకిలిస్టును కారు ఢీ కొంది. ఆ పక్కనే ఉన్న నార్గని స్వామికి చెందిన బడ్డీ చిన్న హోటల్‌లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో కె.పెదపూడి గ్రామానికి చెందిన తిరుమనాథం నాయుడు ద్విచక్రవాహనం ధ్వంసమయ్యింది. అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. అమలాపురంలోని ఓ ఆసుపత్రికి అతడ్ని చికిత్స నిమిత్తం తరలించారు. బడ్డీకొట్టులో ఉన్న నార్గని స్వామి భార్య వెంకటలక్ష్మి, అతని కుమార్తె గౌరీలకు గాయాలయ్యాయి. ఒక్కసారిగా కారు వేగంగా రావడంతో బడ్డీకొట్టుకు ఉన్న చెక్క అడ్డంగా ఉండటంతో పెనుప్రమాదం నుంచి వీరు బయటపడ్డారని ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో బడ్డీకొట్టు హోటల్‌లో ఉన్న సామగ్రి పూర్తిగా ధ్వంసమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని