లేనిభూమి కుదువపెట్టి.. రూ.కోట్లు కొల్లగొట్టి
వారంతా ఖరీదైన నర్సరీ భూములున్న ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడి ఓ సర్వే నంబరును విభజించారు. కొత్త నంబర్లతో నకిలీ పత్రాలు సృష్టించి లేనిభూములు ఉన్నట్లు చూపించారు. అనంతరం దళారులతో జతకట్టి, నీకింత నాకింత.. అని వాటాలు పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈనాడు- రాజమహేంద్రవరం, న్యూస్టుడే- కడియం
వారంతా ఖరీదైన నర్సరీ భూములున్న ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడి ఓ సర్వే నంబరును విభజించారు. కొత్త నంబర్లతో నకిలీ పత్రాలు సృష్టించి లేనిభూములు ఉన్నట్లు చూపించారు. అనంతరం దళారులతో జతకట్టి, నీకింత నాకింత.. అని వాటాలు పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. నర్సరీ సాగుదారులమంటూ ఓ బ్యాంకు బ్రాంచిని ఆశ్రయించి రూ. 9 కోట్ల రుణం తీసుకుని పంచుకున్నారు. తర్వాత రుణం చెల్లించకపోవడంతో ప్రస్తుతం అది అసలు, వడ్డీతో కలిపి సుమారు రూ.17 కోట్లుకు చేరింది. ఇదీ తాజాగా కడియంలో వెలుగుచూసిన మోసం.
పక్కా ప్రణాళికతో..
మాయగాళ్లు సర్వే నంబరు 233/11 ఆధారంగా నకిలీ పత్రాలు తయారుచేసి బ్యాంకును బురిడీ కొట్టించారు. కడియం మండలం కడియపులంక పరిధిలోని ఈ సర్వే నంబరులో 0.92 సెంట్ల భూమి మాత్రమే రెవెన్యూ దస్త్రాల్లో ఉంది. ఈ సర్వే నంబరును 233/11-2 సబ్డివిజన్గా విభజించారు. అందులో అయిదుగురికి 21.32 ఎకరాల భూమి ఉన్నట్లు నకిలీ దస్త్రాలు సృష్టించారు. ఇదే సర్వే నంబరును 233/11-3 సబ్డివిజన్గా విభజించి ముగ్గురికి పారీకత్తులు (ఒకే కుటుంబంలో వాటాలు) చేసినట్లు చూపారు. దీనికి సంబందించిన డాక్యుమెంట్లను ఎ, బి, సి షెడ్యూళ్లుగా కడియం సబ్రిజిస్త్రార్ కార్యాలయంలో 2015లో రిజిష్టర్ చేయించినట్లు తెలిసింది. కడియం పరిధిలోనే 201/6సి సర్వేనంబరులో 2.10 ఎకరాలు, 233/2-1ఎ సర్వే నంబరులో 5 ఎకరాలు, వీరవరం పరిధిలో 159/1 సర్వే నంబరులో 50 సెంట్లు ఉన్నట్లు పత్రాలు సృష్టించారు. ఈ పత్రాలు ఇప్పటికే కడియం తహసీల్దారు కార్యాలయానికి చేరాయి. వాటిని పూర్తిగా పరిశీలించిన అధికారులు నకిలీవని తేల్చారు. అదనపు సర్వే నంబర్లు సృష్టించి మాయచేసినట్లు గుర్తించారు. కొన్ని సర్వే నంబర్లతో రుణ తహసీల్దార్ల సంతకాలు తేడాగా ఉండటం, డిజిటన్ సైన్ను కాపీ చేసి జత చేయడం లాంటివి బయటపడ్డాయని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. తొమ్మిది మందిలో ఒకరివి మినహా మిగిలినవారి పత్రాలు సరిగా లేవని తేల్చారు. ఈ రుణ మాయ వెనుక రెవెన్యూ, రిజిస్ట్రార్శాఖల ఉద్యోగులతోపాటు.. లేఖర్లు, బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంత భారీ కుంభకోణం బయటకు పొక్కినా కీలకశాఖల అధికారులెవ్వరూ నోరుమెదపడం లేదు.
సీఐడీకు అప్పగించే యోచనలో..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని గోదాముల్లో సరకు నిల్వల పేరుతో బ్యాంకులను మోసంచేసి రూ.వందల కోట్లు రుణాలు పొందిన కేసులకు ఇప్పటికీ అతీగతీలేదు. రూ.కోట్లలో డిపాజిట్లు వసూలుచేసి బోర్డు తిప్పేసిన సంస్థల కేసులదీ అదే పరిస్థితి. ఈ కేసులు ఇప్పుడు సీఐడీ విచారణలో ఉన్నాయి. తాజా ఈ కేసునూ సీఐడీకి అప్పగించాలనే యోచనలో బ్యాంకు ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. తహసీల్దారు ఇచ్చే నివేదిక ఆధారంగా బ్యాంకు సిబ్బంది సీఐడీని ఆశ్రయించనున్నట్లు సమాచారం. దీనిపై కడియం తహసీల్దార్ ఎం.సుజాత మాట్లాడుతూ.. బ్యాంకు అధికారులు అందజేసిన వివరాల ప్రకారం చూస్తే రెవెన్యూ దస్త్రాల్లో ఆ వ్యక్తులకు ఆ సర్వే నంబర్లలో భూములు లేవన్నారు. దీనిపై లోతుగా పరిశీలించి సంబంధిత బ్యాంకు అధికారులకు వివరాలు అందజేస్తామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలన అంతమొందిద్దాం
[ 24-04-2024]
జగన్ పరిపాలనను అంతమొందిద్దాం.. పిడికిలి బిగించి మరీ కూటమిని గెలిపించుకుందామని జనసేన అధినేత పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ప్రసంగించారు. -
జగన్ మాటిస్తే.. నీటి మూటే!
[ 24-04-2024]
సీఎం చెప్పిన మాట ప్రకారం సంక్రాంతి వెళ్లిపోయింది.. ఉగాది దాటేసింది. ఇవేవీ ప్రభుత్వానికి గుర్తులేకపోయినా ఎన్నికల నగారా మోగుతుందనే విషయం జ్ఞప్తికి వచ్చింది. ఖజానాలో కాసులు లేకున్నా రైతులకు తుపాను పరిహారం అంటూ హడావుడిగా మార్చి 6న బటన్ నొక్కారు. -
తలూపినా తలోదారే!
[ 24-04-2024]
రాజమహేంద్రవరం నగరంలో అధికార పార్టీ నేతల్లో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా వీరిమధ్య పొరపొచ్చాలు సమసిపోవడం లేదు. -
రోగుల భద్రత మరిచావా పాలకా!
[ 24-04-2024]
ఒకప్పుడు నిత్యం ప్రయాణికులతో కళకళలాడే గోదావరి రైల్వేస్టేషన్ పలు సమస్యలతో కునారిల్లుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పాలు, కూరగాయలు తీసుకొచ్చే చిరు వ్యాపారులు.. చదువుల నిమిత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు.. ఉద్యోగులు ఇక్కడి నుంచే పాసింజర్లలో రాకపోకలు సాగించేవారు. -
అనపర్తి.. వీడిన అనిశ్చితి
[ 24-04-2024]
అనపర్తి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి స్థానంపై కొన్నిరోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడింది. కూటమి పెద్దల నిర్ణయంతో సుమారు 27 రోజుల తర్వాత అనిశ్చితికి తెరపడింది. -
మామ బడాయి మాటలు..
[ 24-04-2024]
నాడు-నేడు మొదటి విడత పనుల్లో మండలంలోని వాదాలకుంట మొదటి విడత పనులే ఇంకా..ఉన్నత పాఠø‹లలో ఆరు అదనపు గదులు మంజూరయ్యాయి. నిధులు కొరత కారణంగా వాటిని తగ్గించి నాలుగుకు తగ్గించారు -
బటన్ నొక్కి జగన్ ఎంత డబ్బు వెనకేశారు?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాటు బటన్ నొక్కి పేదలకు డబ్బులు పంపిణీ చేశానని చెబుతున్నారని, అదే బటన్ నొక్కి ఆయన ఇంకెంత వెనకేసుకున్నారని వంగవీటి రాధా ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు -
రూ.2.58 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం
[ 24-04-2024]
ఎన్నికల తనిఖీల్లో భాగంగా కడియం పోలీసులు రూ.2.58 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
హోంమంత్రి ర్యాలీలో గాయపడిన దళితుడు ఇకలేరు
[ 24-04-2024]
హోంమంత్రి తానేటి వనిత నామినేషన్ ర్యాలీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ పడిపోయి గాయపడిన దళితుడు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన పల్లపు అబ్బులు (73) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. -
మే 26 వరకు కాకినాడ- విశాఖ రైలు రద్దు
[ 24-04-2024]
కాకినాడ పోర్టు- విశాఖపట్నం(17267), విశాఖపట్నం-కాకినాడ పోర్టు(17267) రైళ్లను ఈ నెల 29 నుంచి మే 26 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
వైకాపా గొప్పలు.. రైతుకు తిప్పలు
[ 24-04-2024]
మాది రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొంటున్న వైకాపా పాలనలో కర్షకులు అనుభవిస్తున్న అవస్థలకు ఈ చిత్రమే నిదర్శనం. కట్టిస్తామన్న గోదాములు నిర్మించక, కనీసం కళ్లాలకూ స్థలాలు చూపకపోవడంతో రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. -
జగన్ను కుర్చీ దింపాలి
[ 24-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా అర్బన్ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ఆభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు.