ఇకపై తరగతిగది ఆధారిత మూల్యాంకనం
ఒకటి నుంచి ఎనిమిది తరగతులు చదువుతున్న వారికి ఇప్పటి వరకూ జరుగుతున్న నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక(ఎఫ్ఏ, ఎస్ఏ) పరీక్షలు రద్దు కానున్నాయి.
న్యూస్టుడే, పామర్రు, మండపేట
తరగతి గదిలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు
ఒకటి నుంచి ఎనిమిది తరగతులు చదువుతున్న వారికి ఇప్పటి వరకూ జరుగుతున్న నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక(ఎఫ్ఏ, ఎస్ఏ) పరీక్షలు రద్దు కానున్నాయి. ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతి గది ఆధారిత మూల్యాంకనం (క్లాస్రూమ్ బేస్డ్ అసెస్మెంటు-సీఆర్బీఏ) జరపాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించి అందుకు అనుగుణంగా సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 9, 10 తరగతులకు పాత పద్ధతిలోనే పరీక్షలుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నవంబరు 2 నుంచి 5వ తేదీ వరకూ ఈ మూల్యాంకనం జరుగుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఇదీ లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అభ్యసన లోపాలు గుర్తించడం, పక్కా బోధనతో వారిలోని సామర్థ్యాలను వెలికితీయడం ప్రధాన లక్ష్యం. ఉత్తమ విద్యా ప్రమాణాలను పెంచడానికి కూడా ఇది దోహదం చేస్తుంది.
అమలు ఇలా..
రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో సీఆర్బీఏ జరుగుతుంది. ఈ పరీక్షల్లోని ప్రశ్నలకు జవాబులు ఓఎంఆర్ విధానంలో పత్రం పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి విద్యాసంవత్సరానికి మూడు సార్లు సీబీఏ పరీక్షలు పెడతారు. పరీక్షా పత్రం రూపకల్పన, మూల్యాంకనం కోసం ఇఐ(ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్)తో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. 1 నుంచి 8వ తరగతి వరకూ ద్విభాషా పద్ధతిలో ప్రశ్నలిస్తారు. విద్యార్థులందరి వ్యక్తిగత ప్రగతిని ఇఐ సంస్థవారు తెలియచేస్తారు. వాటిని అనుసరించి తరగతి గదిలో ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటారు.
ఎఫ్ఏ, ఎస్ఏ స్థానంలోనే..
ఈ సీఆర్బీఏ పరీక్ష ఇప్పటి వరకూ జరుగుతున్న కొన్ని ఎఫ్ఏ, ఎస్ఏల స్థానంలోనే ఉంటాయి. 1-8 వారికి ఎఫ్ఏ 1,3 ఎస్ఏ.2కు బదులు మూడు పరీక్షలుంటాయి. ఎఫ్ఏ.2,4లు ఎస్ఏ.1లు పాత విధానంలోనే జరుపుతారు. 9,10 తరగతి వారికి ఎఫ్ఏలు నాలుగు, ఎస్ఏలు 2 యధావిథిగా జరుగుతాయి.
ప్రశ్నలు ఈ విధంగా ఇస్తారు..
ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు..బహుళైచ్ఛికం, ఖాళీలు పూరింపుము, చాలా చిన్న జవాబులు రాసే ప్రశ్నలు, చిన్న జవాబులు రాసే ప్రశ్నలుగా ఉంటాయి. ప్రశ్నలన్నీ కూడా విద్యార్థిని సమగ్రంగా అంచనా వేసే విధంగా ఎంయూఏ(మెకానికల్, అండర్స్టాండింగ్, అప్లికేషన్) విధానంలో ఉంటాయి. ఎంవోఆర్ పత్రాల్లో జవాబులు నింపి పంపాల్సిన అవసరం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనపర్తి బరిలో విశ్రాంత సైనికుడు
[ 28-03-2024]
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అనపర్తి నియోజకవర్గం తెదేపా, భాజపా, జనసేన కూటమి అభ్యర్థిగా విశ్రాంత జవాన్ ములగపూడి శివకృష్ణంరాజు పేరును అధిష్ఠానం బుధవారం రాత్రి ప్రకటించింది. -
ఓరి దేవుడా.. వీళ్లు మారరా..?
[ 28-03-2024]
రెండు చేతులు ఎత్తి భక్తితో మొక్కాల్సిన దేవుడిపైనా ఎందుకో కక్ష.. దైవ సన్నిధిలో భక్తితో మెలగాలన్న కనీస విజ్ఞత మరచి భక్తుల ఎదుటే బూతు పురాణం.. అర్చకులపై దాడి.. గడచిన అయిదేళ్లలో వరస సంఘటనలు ప్రభుత్వ వైఫల్యాన్ని, శాంతిభద్రతల పర్యవేక్షణ -
ఎన్నికలొస్తున్నాయి ఆపేయండి.. రూ.కోట్లు పెట్టాం కుదరదు!
[ 28-03-2024]
ఎన్నికలకు ఇంకా 47 రోజులే సమయం ఉంది. అయిదేళ్లుగా చేపట్టిన ఇసుక తవ్వకాల వల్ల ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాం.. ఇకనైనా తవ్వకాలు నిలిపి.. సహకరించండి.. -
కలెక్టర్ చెప్పినా ఖాతరు లేదు!
[ 28-03-2024]
రూ.వేలకు వేలు పెట్టుబడులు పెట్టాం.. చుక్క నీరు లేదు.. చావే శరణ్యం.. కష్టకాలంలో ఉన్నాం ఆదుకోండి మహా ప్రభో అంటూ కార్యాలయాల చుట్టూ తిరిగాం.. అధికారులకు వేదన వినిపించాం.. -
2,400 ఇళ్ల రద్దు
[ 28-03-2024]
జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో మంజూరు చేసిన గృహాల్లో 2,403 రద్దు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు పునాదులు పడని ఇళ్లను జాబితా నుంచి తొలగించారు. -
సి-విజిల్ ఫిర్యాదులపై సత్వర చర్యలు
[ 28-03-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి సీ-విజల్ యాప్కు వచ్చే ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతికాశుక్లా తెలిపారు. -
‘జగన్ను ఇంటికి పంపడమే కూటమి లక్ష్యం’
[ 28-03-2024]
అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన జగన్ను ఇంటికి పంపడమే తెదేపా, జనసేన, భాజపా కూటమి లక్ష్యమని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. -
కొంటారా.. కొర్రీలు వేస్తారా..?
[ 28-03-2024]
గత రెండేళ్లుగా రబీలో బొండాలు (ఎంటీయూ 3626) రకం ధాన్యం కొనుగోలుపై అయోమయం నెలకొంటోంది. ఈ రకం సాగు చేయొద్దని.. చేస్తే ధాన్యం కొనుగోలు చేయమని రెండేళ్ల కిందట వ్యవసాయ, పౌరసరఫరా శాఖల అధికారులు రైతులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. -
వాత్సల్యం చూపలేదు..!
[ 28-03-2024]
కె.గంగవరం మండలం కుడుపూరుకు చెందిన వీధి జీవన్బాబు తల్లిదండ్రులను కోల్పోయి తాతయ్య మందపల్లి వెంకట్రావు వద్ద పెరుగుతున్నాడు. ప్రస్తుతం దంగేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. -
ఎన్నికల ఏర్పాట్లపై నియోజకవర్గాల వారీగా నివేదికలు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణకు సంబంధించి నియోజకవర్గాల వారీగా నివేదికలు పంపించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. -
జగనన్నకాలనీలో యువకుడిని బలిగొన్న విద్యుత్తు తీగలు
[ 28-03-2024]
జగనన్నకాలనీలో చేతికందే ఎత్తులో ఉన్న అధిక సామర్థ్యపు విద్యుత్తు తీగ తగిలి పెయింటింగ్ పనులు చేసే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. -
నల్లమిల్లికి టికెట్ కేటాయించలేదని నిరసన
[ 28-03-2024]
అనపర్తి నియోజకవర్గానికి బుధవారం రాత్రి భాజపా అభ్యర్థి పేరు ప్రకటించిన వెంటనే తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. -
వైకాపా ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్ బ్యాచ్తో సంబంధం
[ 28-03-2024]
రాజమహేంద్రవరంలో అధికార వైకాపాకి చెందిన ఓ ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్ బ్యాచ్తో కూడా సంబంధాలు ఉన్నాయని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నగర ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. -
‘వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారు’
[ 28-03-2024]
వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారని సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైకాపా సీనియర్ నాయకుడు అల్లు విజయ్ కుమార్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్