logo

క్రికెట్‌ కోచ్‌గా అంబాజీపేట కుర్రోడు

ఆంధ్రప్రదేశ్‌ క్రికెట్‌ జట్టు ఫీల్డింగ్‌ శిక్షకుడిగా అంబాజీపేటకు చెందిన నిమ్మకాయల శ్రీనివాస్‌ అర్హత సాధించారు. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ సీఈవో ఎం.వీ.శివారెడ్డి నుంచి మంగళవారం ఉత్తర్వులు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.

Updated : 05 Oct 2022 06:55 IST

శ్రీనివాస్‌

అంబాజీపేట, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ క్రికెట్‌ జట్టు ఫీల్డింగ్‌ శిక్షకుడిగా అంబాజీపేటకు చెందిన నిమ్మకాయల శ్రీనివాస్‌ అర్హత సాధించారు. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ సీఈవో ఎం.వీ.శివారెడ్డి నుంచి మంగళవారం ఉత్తర్వులు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 11 నుంచి 22 వరకు చెన్నై, ఇండోర్‌లలో జరిగే సయ్యద్‌ ముస్తాఖా అలీ టి.20 పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు శ్రీనివాస్‌ ఫీల్డింగ్‌ శిక్షకుడిగా వ్యవహరిస్తారు. ఈ టోర్నీలో అన్ని రాష్ట్రాలకు చెందిన క్రికెట్‌ జట్లు పాల్గొంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు