9 పోయే 6 వచ్చే..
నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకంలో జిల్లా అంతా ఒకతీరు.. కొమరగిరి లేఔట్ది మరో తీరు. కాకినాడ నగర నియోజకవర్గానికి సంబంధించి యు.కొత్తపల్లి మండలం కొమరగిరి లే-ఔట్లో 16,601 మందికి పట్టాలిచ్చారు. ఇప్పటికి ఇక్కడ 0.5 శాతం గృహాలు కూడా పూర్తి చేయలేకపోయారు
నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకంలో జిల్లా అంతా ఒకతీరు.. కొమరగిరి లేఔట్ది మరో తీరు. కాకినాడ నగర నియోజకవర్గానికి సంబంధించి యు.కొత్తపల్లి మండలం కొమరగిరి లే-ఔట్లో 16,601 మందికి పట్టాలిచ్చారు. ఇప్పటికి ఇక్కడ 0.5 శాతం గృహాలు కూడా పూర్తి చేయలేకపోయారు. కేవలం రూ.1.80 లక్షల యూనిట్ విలువతో ఇళ్లు కట్టుకోలేమని చాలామంది చేతులెత్తేశారు. తరువాత అధికారులు నెల్లూరుకు చెందిన జేఎన్ఆర్ కనస్ట్రక్షన్స్ సంస్థను తీసుకువచ్చారు. రూ.3లక్షలతో 44 గజాల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చేలా లబ్ధిదారులతో ఒప్పందం చేయిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ కింద రూ.1.80 లక్షలు, డ్వాక్రా సభ్యులైన లబ్ధిదారులకు బ్యాంకు నుంచి రూ.35వేలు రుణం ఇప్పిస్తున్నారు. మిగతా రూ.80వేలు లబ్ధిదారులు భరించేలా ఒప్పిస్తున్నారు. ఇలా రూ.3 లక్షలకే 44 గజాల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చేలా లబ్ధిదారులతో ఒప్పందం చేయిస్తున్నారు. ఇప్పటికి 7,400 మంది ముందుకు వచ్చారు.
-న్యూస్టుడే, కాకినాడ (బాలాజీచెరువు)
ఇదీ ఆకృతులపరిస్థితి
నవరత్నాలు-పేదలందరికి ఇళ్లు పథకంలో గృహ నిర్మాణాల డిజైన్లు అధికారికగా రూపొందించారు. కొమరగిరి లే-ఔట్లో ఒక్కో లబ్ధిదారునికి 51 గజాల స్థలాన్ని ఇచ్చారు. దీనిలో 44 గజాల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి. దీని ప్రకారం తొమ్మిది పిల్లర్లతో నిర్మాణం చేసి, శ్లాబు వేయాలి. పది అడుగులతో లోతుతో తొమ్మిది స్తంభాలు వేసేందుకు గోతులు తవ్వాలి. పునాదికి ముందు ప్లింత్ బీమ్ వేయాలి. వీటికి ఫైల్ క్యాప్లు బిగించాలి. అనంతరం పునాది పూర్తి చేసి, 9 పిల్లర్లను పైకి వేసి, వాటిపై శ్లాబ్ వేయాలి. కానీ జేఎన్ఆర్ సంస్థ చేపట్టిన నిర్మాణాలకు ఆరు పిల్లర్లపైనే శ్లాబు వేయనున్నారు. ప్లింత్బీమ్ వరకు మాత్రమే తొమ్మిది పిల్లర్లు తీసుకువస్తున్నారు. ఫైల్ క్యాప్ వేయడంలేదు. ఇలా చేస్తే భవిష్యత్తులో మరో అంతస్తు నిర్మించలేరని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఈ లే-ఔట్ సముద్ర తీరానికి అతి సమీపంలో ఉంది. ఇక్కడన్నీ తేలికపాటి నేలలు. ఇన్ని ప్రతికూలతల మధ్య పటిష్ఠంగా గృహ నిర్మాణాలు చేపట్టకపోతే ఎంత వరకు సురక్షితమనే అనుమానాలు వెంటాడుతున్నాయి.
పటిష్ఠంగా చేపట్టేలా పర్యవేక్షణ
కొమరగిరి లే-ఔట్లో జేఎన్ఆర్ సంస్థతో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు నాణ్యతా ప్రమాణాలతో జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. జేఎన్ఆర్ సంస్థ ద్వారా చేపట్టిన నిర్మాణాలకు 12/9 అంగుళాల పరిమాణంతో పది అడుగుల లోతు నుంచి పిల్లర్లు వేయిస్తున్నాం. ఆరు పిల్లర్లపైనే శ్లాబు వస్తుంది. దీంతో ఏవిధమైన ఇబ్బంది ఉండదు. భవిష్యత్తులో పైన రెండో అంతస్తు నిర్మాణానికి అవకాశం ఉండదు. నివాసయోగ్యంగానే గృహాలను నిర్మిస్తున్నారు. దీనిపై సందేహాలొద్దు. జేఎన్ఆర్ సంస్థతో గృహ నిర్మాణ సంస్థ ఎటువంటి ఒప్పందం చేసుకోలేదు. లబ్ధిదారులతోనే ఈ సంస్థ ఒప్పందం చేసుకుని, నిర్మాణం చేయించుకుంటున్నారు.
- బి.సుధాకర పట్నాయక్, కాకినాడ జిల్లా గృహనిర్మాణ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్ కల్యాణ్ ఐదేళ్ల సంపాదన రూ.114 కోట్లు.. అప్పులు రూ.64 కోట్లు
[ 23-04-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. -
నామినేషన్ వేసిన పవన్.. అఖండ విజయం ఎన్డీయేదేనని ధీమా
[ 23-04-2024]
ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం అసెంబ్లీ స్థానానికి జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. -
సీఎం వచ్చారని తెచ్చారు.. వెళ్లారని వదిలేశారు
[ 23-04-2024]
ఈ నెల 18న ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జిల్లాలో బస్సు యాత్రం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైకాపా నేతలు, అధికారులు నానా హడావుడి చేశారు. -
అభివృద్ధి మాది.. విధ్వంసం జగన్ది..
[ 23-04-2024]
కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీప కూడలిలో సోమవారం సాయంత్రం ప్రజాగళం బహిరంగ సభలో తెదేపా అధినేత ప్రసంగించారు. -
సత్యదేవుడి సేవల్లోనూ వైకాపా వేలు
[ 23-04-2024]
సంప్రదాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. వైదిక కార్యక్రమాల నిర్వహణలో ఇష్టానుసారం వ్యవహరించారు. వివాదాస్పదమై... -
పదిలో వెనుకబడిపోయాం..
[ 23-04-2024]
వసతుల లేమి, బోధనా సిబ్బంది కొరత, ఇతర అసౌకర్యాల నడుమ విద్యార్థులు అవస్థలు పడుతుండటంతో ఈ ఏడాది పదోతరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా వెనుకబడి పోయింది. -
చంద్రబాబును కలిసిన నల్లమిల్లి
[ 23-04-2024]
ప్రజాగళం బహిరంగ సభకు జగ్గంపేట వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
నామినేషన్ల సందడి
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం సందడిగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
రాజీ పడదగిన కేసులు జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలి
[ 23-04-2024]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజీ పడదగిన కేసుల జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలని తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి పేర్కొన్నారు. -
ఫలితాలను ఏం మాయ చేశావ్
[ 23-04-2024]
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతున్నామన్న వైకాపా సర్కారు మాటలు బూటకమని తేలిపోయింది. సోమవారం వెలువడిన పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అరకొర ఫలితాలే సాధించాయి. -
నిరుద్యోగ సమస్య తీర్చేవారికే మద్దతు
[ 23-04-2024]
రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే: ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు ద్వారా తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. -
కొంత మోదం.. కొంత ఖేదం
[ 23-04-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరానికి 18,786 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 17,262 మంది ఉత్తీర్ణులయ్యారు. -
జిల్లాలో 24 నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో సోమవారం మొత్తం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి నాలుగు, జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. -
కాంగ్రెస్కు సానుకూల పవనాలు: రఘువీరారెడ్డి
[ 23-04-2024]
రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజవర్గం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి