logo

చంద్రబాబు పర్యటన ఏర్పాట్ల పరిశీలన

ఈనెల 30 నుంచి డిసెంబరు 2 వరకు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తెదేపా అధినేత చంద్రబాబు బస్సుయాత్ర చేపట్టనున్నారు.

Published : 26 Nov 2022 04:23 IST

నిడదవోలులో గణేష్‌చౌక్‌ కూడలిలో చర్చించుకుంటున్న తెదేపా నాయకులు

నిడదవోలు, న్యూస్‌టుడే: ఈనెల 30 నుంచి డిసెంబరు 2 వరకు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తెదేపా అధినేత చంద్రబాబు బస్సుయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి పార్టీ నాయకులు నిడదవోలు గణేష్‌చౌక్‌కూడలితో పాటు, రూట్‌మ్యాప్‌ను పరిశీలించారు. డిసెంబర్‌ 1న కొవ్వూరు బహిరంగ సభలో మాట్లాడతారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
2 ఉదయం రోడ్డు షోగా నిడదవోలు చేరుకుని, బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం తాడేపల్లిగూడెం చేరుకుంటారు. ఏర్పాట్లను నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త బూరుగుపల్లి శేషారావు, మాజీ మంత్రులు పీతల సుజాత, కేఎస్‌ జవహర్‌, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, పార్టీ నిడదవోలు పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని