logo

డ్రైవర్‌ చాకచక్యం.. తప్పిన ప్రమాదం

రాజోలు డిపో ఆర్టీసీ బస్సు శుక్రవారం రాజమహేంద్రవరం వైపు వెళ్తుండగా... కడియం మండలం పొట్టిలంక జాతీయ రహదారిపై ఒక్కసారిగా బ్రేకులు విఫలం కావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

Published : 26 Nov 2022 04:23 IST

నిలిచిన బస్సు వద్ద ప్రయాణికులు

కడియం: రాజోలు డిపో ఆర్టీసీ బస్సు శుక్రవారం రాజమహేంద్రవరం వైపు వెళ్తుండగా... కడియం మండలం పొట్టిలంక జాతీయ రహదారిపై ఒక్కసారిగా బ్రేకులు విఫలం కావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్‌ రమేశ్‌ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును చాకచక్యంగా రహదారి పక్కకు తీసుకువచ్చి నిలపడంతో ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 45 మంది ఊపిరి పీల్చుకుని డ్రైవర్‌ను అభినందించారు. కాలంచెల్లిన బస్సులను ప్రజా రవాణాకు ఉపయోగిస్తున్నారని వారంతా ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. అదే దారిలో వేరే బస్సు రావడంతో దాంట్లో ఎక్కేందుకు పరుగులు తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని