రబీ రైతులకు... 2,65,081 ఎకరాలకు సాగు నీరు
కోనసీమ వ్యాప్తంగా 2,65,081 ఎకరాల ఆయకట్టు రబీ సాగుకు ఈ నెల 30న కాలువలకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి నీటి విడుదలకు జిల్లా సాగునీటి పారుదల సలహామండలి సమావేశంలో నిర్ణయించారు.
జిల్లా సాగునీటి పారుదల సలహా మండలి సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ హిమాన్షు శుక్లా
అమలాపురం(అల్లవరం), న్యూస్టుడే: కోనసీమ వ్యాప్తంగా 2,65,081 ఎకరాల ఆయకట్టు రబీ సాగుకు ఈ నెల 30న కాలువలకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి నీటి విడుదలకు జిల్లా సాగునీటి పారుదల సలహామండలి సమావేశంలో నిర్ణయించారు. అమలాపురంలోని కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన సమావేశంలో సాగు, తాగునీటి అవసరాల నిమిత్తం పలు అంశాలపై ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి డెల్టా సిస్టం పరిధిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా నికర ఆయకట్టు 8,96,507 ఎకరాలు ఉండగా.. దీనిలో కోనసీమవ్యాప్తంగా నిర్దేశిత ఆయకట్టుకు కాలువల ద్వారా సాగునీరందించే చర్యలపై చర్చ జరిగింది. పేరవరం, వసంతవాడ, ఉచ్చిలి ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి విడుదలకు నిధుల మంజూరు తదితరాలపై చర్చించారు.
సమృద్ధిగా నీటి నిల్వలు..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 8,96,507 ఎకరాల ఆయకట్టుకు 87 టీఎంసీ, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజల తాగునీటి అవసరాలకు 7.220 టీఎంసీల నీరు అవసరమని గుర్తించామని జడ్పీ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. దీనిలో గోదావరి నుంచి ఇన్ఫ్లో 45.270, సీలేరు నుంచి 40.235, పోలవరం ప్రాజెక్టులో నిల్వఉన్న 16 టీఎంసీలతో కలిపి మొత్తం 101.505 టీఎంసీలు ప్రస్తుతం అందుబాటులో ఉందన్నారు. ఈ ఏడాది ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదన్నారు.
అలంకారప్రాయంగా చింతలమోరి ఎత్తిపోతలు..
మలికిపురం మండలం శంకరగుప్తంలో నిర్మించిన చింతలమోరి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సుమారు రూ.30 కోట్ల అంచనాలు రూపొందించి.. రూ.18 కోట్ల మేర ఖర్చుచేశారని, ఆ నిధులెందుకూ పనికిరాకుండా పోయాయని ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అన్నారు. పథకం ప్రారంభ దశలో చింతలమోరి గ్రామం వద్దనుంచి సాగునీరు పంపింగ్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేయగా శంకరగుప్తం డ్రెయిన్ల నుంచి నీరు పంపింగ్ చేయడం వల్ల ఉప్పునీరు వస్తోందని, దాంతో ఈ ప్రాంతంలో పొలాలు, పంట భూములు పాడైపోతున్నాయన్నారు. కలెక్టర్ స్పందిస్తూ అధికారులు రెండురోజుల్లో పథకాన్ని పరిశీలించి నివేదిక అందించాలన్నారు. ః పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రతి ఎకరాకూ సాగు నీరందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పంట కాలువలు డ్రెయిన్ల కన్నా అధ్వానంగా ఉన్నాయని, ఆ నీటినే శుద్ధిచేసి ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్నారన్నారు. లస్కర్లకు కొన్నాళ్లుగా వేతనాలు ఇవ్వడం లేదన్నారు.
అసంపూర్తిగా నిర్వహణ పనులు..
పంట కాలువలు, డ్రెయిన్లలో నిర్వహిస్తున్న పనులు అసంపూర్తిగా, గత ఖరీఫ్ నుంచి ఇప్పటివరకు కొనసాగుతూనే ఉన్నాయని ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు అన్నారు. సాధారణ నిర్వహణ పనులుకూడా పూర్తిచేయడం లేదన్నారు. ఖరీఫ్లో కోనసీమవ్యాప్తంగా 44 వేల ఎకరాల్లో రైతులు పంట విరామం ప్రకటించారని, రబీలో ఆ పరిస్థితి రాకుండా చూడాలన్నారు.
గ్రామాలవారీ పర్యవేక్షణ
సాగునీటి సరఫరాను గ్రామాల వారీ కమిటీలు పర్యవేక్షిస్తాయని కలెక్టర్ హిమాన్షుశుక్లా తెలిపారు. ఉచ్చిలి ఎత్తిపోతలు శిథిలస్థితికి చేరిందని, మరమ్మతులకు రూ.13.50 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించినట్లు అధికారులు తెలిపారు. వసంతవాడ పథకం ద్వారా 2 వేల ఎకరాలకు నీరందిస్తున్నామన్నారు. పేరవరం పథకం మరమ్మతులకు రూ.20 లక్షలు మంజూరుకు తీర్మానించారు. 63 నిర్వహణ పనులు పూర్తి చేస్తామన్నారు. సీఎస్ఆర్ నిధుల పనులు నామినేషన్ పద్ధతిలో చేయాలన్నారు. లస్కర్ల వేతనాల వివరాలివ్వాలని ఆదేశించారు. ఆర్డీవోలు వసంతరాయుడు, సింధు సుబ్రహ్మణ్యం, ఎస్ఈ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరి దేవుడా.. వీళ్లు మారరా..?
[ 28-03-2024]
రెండు చేతులు ఎత్తి భక్తితో మొక్కాల్సిన దేవుడిపైనా ఎందుకో కక్ష.. దైవ సన్నిధిలో భక్తితో మెలగాలన్న కనీస విజ్ఞత మరచి భక్తుల ఎదుటే బూతు పురాణం.. అర్చకులపై దాడి.. గడచిన అయిదేళ్లలో వరస సంఘటనలు ప్రభుత్వ వైఫల్యాన్ని, శాంతిభద్రతల పర్యవేక్షణ -
ఎన్నికలొస్తున్నాయి ఆపేయండి.. రూ.కోట్లు పెట్టాం కుదరదు!
[ 28-03-2024]
ఎన్నికలకు ఇంకా 47 రోజులే సమయం ఉంది. అయిదేళ్లుగా చేపట్టిన ఇసుక తవ్వకాల వల్ల ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాం.. ఇకనైనా తవ్వకాలు నిలిపి.. సహకరించండి.. -
అనపర్తి బరిలో విశ్రాంత సైనికుడు
[ 28-03-2024]
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అనపర్తి నియోజకవర్గం తెదేపా, భాజపా, జనసేన కూటమి అభ్యర్థిగా విశ్రాంత జవాన్ ములగపూడి శివకృష్ణంరాజు పేరును అధిష్ఠానం బుధవారం రాత్రి ప్రకటించింది. -
కలెక్టర్ చెప్పినా ఖాతరు లేదు!
[ 28-03-2024]
రూ.వేలకు వేలు పెట్టుబడులు పెట్టాం.. చుక్క నీరు లేదు.. చావే శరణ్యం.. కష్టకాలంలో ఉన్నాం ఆదుకోండి మహా ప్రభో అంటూ కార్యాలయాల చుట్టూ తిరిగాం.. అధికారులకు వేదన వినిపించాం.. -
2,400 ఇళ్ల రద్దు
[ 28-03-2024]
జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో మంజూరు చేసిన గృహాల్లో 2,403 రద్దు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు పునాదులు పడని ఇళ్లను జాబితా నుంచి తొలగించారు. -
సి-విజిల్ ఫిర్యాదులపై సత్వర చర్యలు
[ 28-03-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి సీ-విజల్ యాప్కు వచ్చే ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతికాశుక్లా తెలిపారు. -
‘జగన్ను ఇంటికి పంపడమే కూటమి లక్ష్యం’
[ 28-03-2024]
అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన జగన్ను ఇంటికి పంపడమే తెదేపా, జనసేన, భాజపా కూటమి లక్ష్యమని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. -
కొంటారా.. కొర్రీలు వేస్తారా..?
[ 28-03-2024]
గత రెండేళ్లుగా రబీలో బొండాలు (ఎంటీయూ 3626) రకం ధాన్యం కొనుగోలుపై అయోమయం నెలకొంటోంది. ఈ రకం సాగు చేయొద్దని.. చేస్తే ధాన్యం కొనుగోలు చేయమని రెండేళ్ల కిందట వ్యవసాయ, పౌరసరఫరా శాఖల అధికారులు రైతులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. -
వాత్సల్యం చూపలేదు..!
[ 28-03-2024]
కె.గంగవరం మండలం కుడుపూరుకు చెందిన వీధి జీవన్బాబు తల్లిదండ్రులను కోల్పోయి తాతయ్య మందపల్లి వెంకట్రావు వద్ద పెరుగుతున్నాడు. ప్రస్తుతం దంగేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. -
ఎన్నికల ఏర్పాట్లపై నియోజకవర్గాల వారీగా నివేదికలు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణకు సంబంధించి నియోజకవర్గాల వారీగా నివేదికలు పంపించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. -
జగనన్నకాలనీలో యువకుడిని బలిగొన్న విద్యుత్తు తీగలు
[ 28-03-2024]
జగనన్నకాలనీలో చేతికందే ఎత్తులో ఉన్న అధిక సామర్థ్యపు విద్యుత్తు తీగ తగిలి పెయింటింగ్ పనులు చేసే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. -
నల్లమిల్లికి టికెట్ కేటాయించలేదని నిరసన
[ 28-03-2024]
అనపర్తి నియోజకవర్గానికి బుధవారం రాత్రి భాజపా అభ్యర్థి పేరు ప్రకటించిన వెంటనే తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. -
వైకాపా ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్ బ్యాచ్తో సంబంధం
[ 28-03-2024]
రాజమహేంద్రవరంలో అధికార వైకాపాకి చెందిన ఓ ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్ బ్యాచ్తో కూడా సంబంధాలు ఉన్నాయని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నగర ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. -
‘వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారు’
[ 28-03-2024]
వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారని సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైకాపా సీనియర్ నాయకుడు అల్లు విజయ్ కుమార్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా