పర్యాటకం.. ప్రగతి.. తీరం
అటవీశాఖ ఆధ్వర్యంలో తీర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధిచేసేందుకు అడుగులు పడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా అందుకు అవకాశాలున్న ప్రాంతాలకోసం అధికారులు కొంతకాలంగా అన్వేషణ సాగిస్తున్నారు.
ఓడలరేవు తీరంలో అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యాటకంగా అభివృద్ధి చేయనున్న సముద్ర తీర ప్రాంతం
న్యూస్టుడే, అమలాపురం(అల్లవరం): అటవీశాఖ ఆధ్వర్యంలో తీర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధిచేసేందుకు అడుగులు పడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా అందుకు అవకాశాలున్న ప్రాంతాలకోసం అధికారులు కొంతకాలంగా అన్వేషణ సాగిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాల ప్రగతికి నిర్ణయించి కార్యాచరణ ప్రారంభించారు.
అటవీశాఖ ఆధ్వర్యంలో సౌకర్యాలు
అటవీశాఖ ఆధ్వర్యంలో తీర ప్రాంతాలను పర్యాటక పరంగా అభివృద్ధిచేసి మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా తీర ప్రాంతాల్లో అల్లవరం మండలం ఓడలరేవు పరిధిలో ఉన్న సముద్ర తీరం, కాట్రేనికోన మండలం కందికుప్ప లైట్హౌస్ వద్ద 10 హెక్టార్ల విస్తీర్ణంలో కమ్యూనిటీ బేసిడ్ ఎకో టూరిజం పేరుతో అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు రూ.కోటితో అంచనాలు సిద్ధం అవుతున్నాయి.
జిల్లాలో 94 కి.మీ.పరిధిలో సాగర సంగమం
అనగానే ప్రతి ఒక్కరి మది పులకిస్తుంది. సముద్ర అలలపై తేలియాడుతూ ఇసుక తిన్నెలపై సేదదీరేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతారు. కోనసీమవ్యాప్తంగా సుమారు 94 కి.మీ. పొడవైన తీర ప్రాంతం ఉంది. జిల్లా నలుమూలల నుంచి సందర్శకులు కాలాలతో సంబంధం లేకుండా ఇక్కడికి వస్తుంటారు. దాంతో సముద్ర తీరం వెంట సందర్శకుల తాకిడి ఉన్న ప్రదేశాలను పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు.
అభివృద్ధికి ప్రాంతాల గుర్తింపు
కోనసీమ ప్రాంతం పొడవునా సముద్ర తీరానికి వచ్చే సందర్శకులకు ఎక్కడా కనీస వసతులు కనిపించని పరిస్థితి. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రైవేటు రంగాల భాగస్వామ్యంతో తీర ప్రాంతాల్లో అనువైన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు అధికారుల బృందం రెండు సంవత్సరాల క్రితం కోనసీమవ్యాప్తంగా పర్యటించి కొన్ని ప్రాంతాలను గుర్తించి రూ.5 కోట్లతో అభివృద్ధి చేసేందుకు అంచనాలుసైతం రూపొందించింది. కానీ అవి కార్యరూపం దాల్చలేదు.
పూర్తిస్థాయి మౌలిక వసతులు..
ఓడలరేవు సముద్ర తీరంలో రూ.30లక్షలు, కందికుప్ప లైట్హౌస్ వద్ద రూ.60 లక్షలతో సందర్శకులు సేదదీరేందుకు కావాల్సిన వసతులు కల్పించనున్నారు. ఓడలరేవు సముద్ర తీరం వెంట ఉన్న అటవీశాఖకు చెందిన భూమిలో బెంచీలు, మరుగుదొడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా గదులు, క్యాంటీన్, చెట్ల పెంపకం, చిన్నారులకు ఆట బొమ్మలతో ఉద్యానం, మడ అడవుల సందర్శనకు ఏర్పాట్లు, పూరి పాకలు వంటివి ఏర్పాటు చేయనున్నారు. సౌర విద్యుత్తు ద్వారా వీటికి అదనపు హంగులు సమకూర్చనున్నారు.
* కందికుప్ప లైట్హౌస్ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడ అటవీశాఖ అతిథి గృహం, లైట్హౌస్, మర్రి చెట్లున్న 10 హెక్టార్ల విస్తీర్ణాన్ని తీర్చిదిద్దనున్నారు.
కాట్రేనికోన మండలం కందికుప్ప లైట్ హౌస్
స్థానికంగా ఉపాధి అవకాశాలు..
ఇప్పటికే ఈ రెండు ప్రాంతాలకు సందర్శకులు వస్తుండడంతో స్థానికులకు ఉపాధి లభిస్తోంది. ఇప్పుడు ఈ రెండు ప్రాంతాలు పర్యాటకపరంగా మరింత ఆకర్షణీయంగా మారితే సందర్శకులు అధికంగా వస్తారు. దాంతో స్థానికులకూ ఉపాధి అవకాశాలేర్పడతాయి.
అవకాశాలను పరిశీలిస్తున్నాం
- ఎం.వి.ప్రసాదరావు, జిల్లా అటవీశాఖ అధికారి
ఎకో టూరిజం పేరుతో ఎంపిక చేసిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో ఓడలరేవు, కందికుప్ప ప్రాంతాలను ఎంపిక చేసి రూ.కోటితో అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యాటకులకు కావాల్సిన వసతులు కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. వస్తు సామగ్రి సమకూర్చేందుకు అంచనాలు రూపొందించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోసపు దీవెన.. సొమ్మురాక వేదన
[ 25-04-2024]
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తామని... దాని కోసం విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. -
ప్రతి గొంతూ జేజేలు
[ 25-04-2024]
నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి. జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి. -
నియమావళికి సెలవిచ్చి.. మంత్రి హామీకి విలువిచ్చి..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు హడావుడిగా జిల్లావ్యాప్తంగా అనేక పనులకు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు శంకుస్థాపనలు చేశారు. వీటిలో కొన్ని పనులు నేటికీ ప్రారంభించనేలేదు. -
జగన్.. మాపై ఎందుకింత కక్ష?
[ 25-04-2024]
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. -
సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
[ 25-04-2024]
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. -
కొవ్వూరు వైకాపాలో రగడ
[ 25-04-2024]
కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. -
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారంతో ముగియనుంది. పోటీచేసే అభ్యర్థుల నుంచి చివరిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్
[ 25-04-2024]
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం
[ 25-04-2024]
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్ వాపోయారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
[ 25-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ ఓ పౌరుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో జై భారత్ -
నన్నయలో ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కమిటీ సభ్యుల పర్యటన
[ 25-04-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా పథకానికి సంబంధించిన పనులను కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. -
భీమేశ్వరుని గర్భాలయం మూసివేత
[ 25-04-2024]
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు.