గూడు చుట్టూ చిక్కుముళ్లు
వాలియాతోడి నాగలక్ష్మికి 2020లో బొమ్మూరు టిడ్కో గృహ సముదాయంలో ఇల్లు(ఫ్లాట్) మంజూరు చేశారు. బి-13లో ఫ్లాట్ కేటాయించారు. ఆ ఇంటికి వెళ్లగా నోటీసు బోర్డు అతికించి ఉంది.
బొమ్మూరులో టిడ్కో గృహాలు
వాలియాతోడి నాగలక్ష్మికి 2020లో బొమ్మూరు టిడ్కో గృహ సముదాయంలో ఇల్లు(ఫ్లాట్) మంజూరు చేశారు. బి-13లో ఫ్లాట్ కేటాయించారు. ఆ ఇంటికి వెళ్లగా నోటీసు బోర్డు అతికించి ఉంది. అదే ఇంటిని 2019కు ముందు వేరే వాళ్లకు కేటాయించారు. తర్వాత వైకాపా అధికారంలోకి వచ్చాక వివిధ కారణాలతో తొలి లబ్ధిదారుల జాబితా నుంచి ఆ పేరు తొలగించారు. దీంతో ఆ ఇల్లు నాదేనని జాబితాలో తొలగించిన ఆమె కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఆ ఇంటిని నాగలక్ష్మికి కేటాయించారు. కోర్టు నోటీసు ఇంటికి అతికించడంతో తాళం వేసి ఉంది. ప్రస్తుతం ఇల్లు లబ్ధిదారు నాగలక్ష్మి మాత్రం రెండేళ్లుగా కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు.
న్యూస్టుడే, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ
టిడ్కో ఇళ్లకు సంబందించి చిక్కుముడులు ఇంకా వీడటం లేదు. పేదలకు ఇళ్ల పేరుతో బొమ్మూరు, తొర్రేడులో టిడ్కో గృహ సముదాయాలు నిర్మించారు. మొదటి ఫేజ్లో 3,424 మంది లబ్ధిదారులను గుర్తించారు. వారిలో ఇప్పటి వరకు 2,567 మందికి మాత్రమే పట్టా రిజిస్ట్రేషన్లు జరిగాయి. మిగిలిన 857 మంది విషయంలో ఇంకా ఆటంకాలు ఎదురవుతున్నాయి. వీరిలో 175 మందిని గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. రెండోసారి చేపట్టిన పరిశీలనలో వివిధ కారణాలతో వారిని పక్కన పెట్టారు. ఆ జాబితాలో కొత్త వారికి అవకాశం కల్పించారు. వీటికి కేటాయించిన ఇళ్లు గతంలో మరొకరికి ఇవ్వడంతో వాటిని స్వాధీనం చేసుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలోని లబ్ధిదారులు కొందరు కోర్టును ఆశ్రయించగా , మరికొందరు పేర్లు తొలగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత, కొత్త లబ్ధిదారులు ఇద్దరూ కలెక్టర్, నగరపాలక సంస్థ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రెండో ఫేజ్లో బొమ్మూరు, నామవరం, హుకుంపేట, సింహాచల్నగర్, వడ్డెర కాలనీలో 6,304 మందికి ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. వీటిలోని లబ్ధిదారుల జాబితాలో చిక్కులు ఏర్పడుతున్నాయి.
అదే పరిస్థితి..
మొదటి ఫేజ్లో రిజిస్ట్రేషన్ పూర్తి కాని 857 మందిలో జాబితా నుంచి తొలగించిన 175 మందిని మినహాయిస్తే మిగిలిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. రిజిస్ట్రేషన్ పూర్తి కాని వారిలో మృత్యు చెందిన వారు ఉన్నారు. వారితో పాటు మరికొందరికి రుణాలు మంజూరు కావడం లేదు. సిబిల్ స్కోర్ తక్కువగా ఉండటంతో కొన్ని బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నాయి. లబ్ధిదారులు గతంలో సెల్ఫోన్లు, టీవీలు, వాషింగ్మెషిన్లు కొనుగోలుకు చిన్నమొత్తాల్లో రుణం తీసుకున్నారు. వాటిని సరిగా చెల్లించని వారికి సిబిల్ స్కోరు ఆటంకంగా మారుతోంది. మరికొంత మందికి విద్యుత్తు బిల్లు నిబంధనల కంటే ఎక్కువ రావడంతో వారిని పక్కన పెట్టిన పరిస్థితులు ఉన్నాయి.
పరిశీలించి చర్యలు..
జాబితా పరిశీలనలో భాగంగా అనర్హులను పక్కన పెట్టి వారి స్థానంలో కొత్త వారికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అర్హులైన వారికి ఇళ్లను కేటాయిస్తాం. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఇబ్బందులు అధిగమించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. కోర్టులో ఉన్న విషయాలు తీర్పును బట్టి పరిష్కరిస్తాం.
మాలిక్, మున్సిపల్ మేనేజరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోసపు దీవెన.. సొమ్మురాక వేదన
[ 25-04-2024]
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తామని... దాని కోసం విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. -
ప్రతి గొంతూ జేజేలు
[ 25-04-2024]
నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి. జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి. -
నియమావళికి సెలవిచ్చి.. మంత్రి హామీకి విలువిచ్చి..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు హడావుడిగా జిల్లావ్యాప్తంగా అనేక పనులకు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు శంకుస్థాపనలు చేశారు. వీటిలో కొన్ని పనులు నేటికీ ప్రారంభించనేలేదు. -
జగన్.. మాపై ఎందుకింత కక్ష?
[ 25-04-2024]
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. -
సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
[ 25-04-2024]
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. -
కొవ్వూరు వైకాపాలో రగడ
[ 25-04-2024]
కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. -
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారంతో ముగియనుంది. పోటీచేసే అభ్యర్థుల నుంచి చివరిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్
[ 25-04-2024]
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం
[ 25-04-2024]
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్ వాపోయారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
[ 25-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ ఓ పౌరుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో జై భారత్ -
నన్నయలో ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కమిటీ సభ్యుల పర్యటన
[ 25-04-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా పథకానికి సంబంధించిన పనులను కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. -
భీమేశ్వరుని గర్భాలయం మూసివేత
[ 25-04-2024]
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం