ఇవే మా సమస్యలు.. మీపైనే ఆశలు..
ఆశతో మీకు అందిస్తున్నాం. పరిష్కారం చూపండని పలువురు కలెక్టరేట్ స్పందనలో సోమవారం అధికారులకు గోడు
అర్జీల్లో ఆవేదన రాశాం. ఆశతో మీకు అందిస్తున్నాం. పరిష్కారం చూపండని పలువురు కలెక్టరేట్ స్పందనలో సోమవారం అధికారులకు గోడు వినిపించారు. వారిని పలకరిస్తే ఆవేదన తెలిపారిలా..
న్యూస్టుడే, అమలాపురం(అల్లవరం)
పన్నెండేళ్లు దాటితేనే పింఛనంటున్నారు..
మాది కొత్తపేట మండలం అవిడి. నా కొడుకు సాయిగణేష్ బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు. వైద్యులు తాత్కాలిక వైకల్యం 100 శాతం అని ఇచ్చారు. ఏడేళ్ల నా కొడుక్కి 12 ఏళ్లు వస్తేకానీ దివ్యాంగ పింఛను రాదంటున్నారు. కూలి చేసుకునే మేం వాడి మందులకు డబ్బుల్లేక యాతన పడుతున్నాం. పింఛను మంజూరుచేస్తే ఆసరాగా ఉంటుంది. కలెక్టర్ ఆదుకోవాలి.
విన్నా సత్య
కనికరం చూపడం లేదు..
ఐ.పోలవరం మండలం మురముళ్లకు చెందిన నాకు చిన్నప్పట్నుంచి కుడికన్ను కనిపించదు. డిగ్రీ చదువుతున్నా. సదరమ్లో 50శాతం వైకల్యమని ఇచ్చారు. దరఖాస్తు చేసినా దివ్యాంగ పింఛను ఇవ్వడం లేదు. కింది స్థాయి అధికారులు కనికరించడం లేదు. కలెక్టరు దయచూపాలి.
దూనబోయిన వీరవేణి
వితంతు పింఛను ఆపేశారు..
మాది అంబాజీపేట మండలం. నా భర్త చనిపోవడంతో 20 ఏళ్లుగా వితంతు పింఛను ఇస్తున్నారు. నా కొడుకు చిరుద్యోగం చేస్తున్నాడని.. రెండేళ్లనుంచి పింఛను ఆపేశారు. పింఛనుపైనే ఆధారపడి జీవిస్తున్నా.. అధికారులు న్యాయం చేయాలి.
పిల్లా వెంకటరమణ
నివాసస్థలం ఇప్పించండి
మాది మామిడికుదురు మండలం పాశర్లపూడి బాడవ. అద్దె భరించలేక ఇంటి స్థలానికి సచివాలయంలో దరఖాస్తు చేసినా తిరస్కరిస్తున్నారు. స్పందనలో అర్జీ ఇచ్చాం. కలెక్టరు స్పందించి గూడు కల్పించాలి.
చల్లా సత్య వెంకటలక్ష్మి
అర్జీలపై క్షేత్రస్థాయి పరిశీలన
అమలాపురం(అల్లవరం), పట్టణం: స్పందనలో వస్తున్న అర్జీలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారమార్గం చూపాలని కలెక్టర్ హిమాన్షుశుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జేసీ ధ్యానచంద్రతో కలిసి అర్జీలు స్వీకరించారు. 189 మంది అర్జీలిచ్చినట్లు ఆధికారులు తెలిపారు.
* తన కార్యాయలంలో ఎస్పీ సుధీర్కుమార్రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. 38 మంది అర్జీలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
నిరాశ్రయులమయ్యాం..
అమలాపురం మండలం భట్నవిల్లిలో 2013లో జాతీయ రహదారి-216 విస్తరణలో 25 మంది నివాసాలు కోల్పోయాం. పూర్తిస్థాయి నష్టపరిహారం ఇవ్వలేదు. అందజేయలేదు. రోడ్డు పక్కన పాకలు వేసుకుని ఉంటున్నాం. ఉన్నతాధికారులు స్పందించి పరిహారం ఇప్పిస్తే మరోచోట ఇళ్లు కట్టుకుంటాం.
భట్నవిల్లి గ్రామస్థులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ యాత్రన.. జనం యాతన
[ 19-04-2024]
విద్యుత్తు కట్.. అంతర్జాలం బంద్.. దుకాణాల మూత.. సామాన్యుల వాహనాలకు తోడు అంబులెన్సులు సైతం నిలిపివేత.. గంటలపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. -
ఎన్నికల వేళ యువతా.. అప్రమత్తం
[ 19-04-2024]
ఎన్నికల వేళ యవత మరిన్ని జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలిచారని బైక్ ర్యాలీల్లో పాల్గొనడం, ప్రత్యర్థులతో ఘర్షణకు దిగడం వంటివి ఎంతమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. -
అసలేం జరుగుతోంది..?
[ 19-04-2024]
ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్ పెట్టి తెప్పించేస్తారు. -
జిల్లాకు రానున్న ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారు. వీరికి అనుసంధానంగా లైజనింగ్, ఇతర సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
తొలిరోజు ఏడు నామినేషన్ల దాఖలు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకాగా తొలిరోజు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. -
పాదయాత్ర అబద్ధాలతో దండయాత్ర
[ 19-04-2024]
పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను. -
తొలిరోజు నామినేషన్ల సందడి
[ 19-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు. -
పేపరుమిల్లు కార్మికుల ఆందోళన
[ 19-04-2024]
సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్ గురువారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్మిల్లుకు చేరుకున్న సమయంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 రోజులుగా వేతన ఒప్పందం కోరుతూ సమ్మె చేస్తున్నా పేపర్మిల్లు యాజమాన్యం స్పందించడం లేదని నినాదాలు చేశారు. -
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది సమస్యాత్మక కేంద్రాలే. పోలింగ్ ముగిసే వరకు అధికారుల దృష్టంతా వాటిపైనే ఉంటుంది. -
అద్దె చెల్లించక అగచాట్లు
[ 19-04-2024]
వైకాపా పాలనలోని గత అయిదేళ్లలో అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు కేవలం నోటి మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు
[ 19-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన నుంచి గండేపల్లి మండలంలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆ పార్టీ నాయకుల అండదండలతో కొన్ని లే ఔట్లను ఏర్పాటు చేసి అక్రమంగా మెరక చేశారు. -
‘ఆత్మ’సాక్షి లేదా.. అన్నదాతంటే పడదా..!
[ 19-04-2024]
సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!