logo

వైకాపా నాయకులపై తెదేపా ఫిర్యాదు

నాయీబ్రాహ్మణులను వైకాపా ప్రజాప్రతినిధులు ఇష్టం వచ్చినట్లు దూషించడం దుర్మార్గమని, వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మాజీ ఎమ్మెల్యే ఆనందరావు పేర్కొన్నారు.

Published : 29 Nov 2022 04:46 IST

ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు ఇస్తున్న నాయకులు

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: నాయీబ్రాహ్మణులను వైకాపా ప్రజాప్రతినిధులు ఇష్టం వచ్చినట్లు దూషించడం దుర్మార్గమని, వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మాజీ ఎమ్మెల్యే ఆనందరావు పేర్కొన్నారు. మాజీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, నాయీ బ్రాహ్మణులను దూషించిన మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌లపై చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆనందరావు మాట్లాడుతూ వైకాపా దుర్మార్గ పాలనలో దూషించడం, కూలగొట్టడం తప్ప, అభివృద్ధి చేయడం చేతకాదని విమర్శించారు. పెచ్చెట్టి విజయలక్ష్మి, దెందుకూరి సత్యనారాయణరాజు, తిక్కిరెడ్డి నేతాజీ, అల్లాడ స్వామినాయుడు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని