ఇల్లండి... మావల్ల కాదండి
నవరత్నాల్లో భాగంగా మంజూరైన గృహ నిర్మాణాల్లో పురోగతి కనిపించడం లేదు.
న్యూస్టుడే, అమలాపురం(అల్లవరం), మండపేట
మండపేట: వేములపల్లి జగనన్న లేఔట్లో నిర్మాణాలు
నవరత్నాల్లో భాగంగా మంజూరైన గృహ నిర్మాణాల్లో పురోగతి కనిపించడం లేదు. బిల్లులు మంజూరు చేస్తామన్నా.. లబ్ధిదారులు పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రావడం లేదని అధికారులే చెబుతుండడం గమనార్హం. ప్రధానంగా వర్షాలు నిర్మాణాలకు ఆటంకం కలిగించాయని పేర్కొంటున్నారు. మరోవైపు నిర్మాణ సామగ్రి కొరత, ఆర్థిక ఇబ్బందులు, లేఔట్లలో మౌలిక వసతులు అరకొరగా ఉండడంతో పనులు చేయలేకపోతున్నామని నిర్మాణదారులు వాపోతున్నారు.
ప్రగతి మందగమనం..
నిర్మాణాలు ప్రారంభించకపోతే ఇళ్ల స్థలాలు రద్దవుతాయని అధికారులు చెప్పడంతో చాలామంది పనులు ప్రారంభించారు. ఆదిలో నిర్మాణాలు బాగానే సాగినా.. ఆ తర్వాత పురోగతి మందగించింది. ఎడతెరపిలేని వర్షాలు, కాలనీల్లో మౌలిక వసతుల లేమి, సామగ్రి తరలించుకునేందుకు ఇబ్బందులు ఎదురవడం తదితర కారణాలతో కొన్నిచోట్ల పనులు నిలిచిపోయాయి. గత నెల వరకు వర్షాల కారణంగా అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, అమలాపురం తదితర మండలాల్లో జగనన్న లేఔట్లు ముంపునకు గురయ్యాయి. దీంతో నెలపాటు లబ్ధిదారులు, అధికారులు వీటిలో అడుగుపెట్టలేకపోయారు. ఈ క్రమంలో నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, ఇసుక కొరత ఏర్పడటం, ప్రభుత్వం ఇచ్చే యూనిట్ విలువ చాలకపోవడంతో లబ్ధిదారులకు గృహ నిర్మాణం భారంగా మారింది.
జిల్లా లక్ష్యం 6,203..
డా.బీఆర్ అంబేడ్కర్ కోననసీమ జిల్లావ్యాప్తంగా డిసెంబరు నాటికి 6,203 ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించాలని లక్ష్యం నిర్ణయించారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 50 శాతం అంటే 3,246 గృహాలు పూర్తి చేశారు. మిగిలిన వారికి అవగాహన కల్పించి, సౌకర్యాలు సమకూర్చి పనులు చేయించాల్సిఉంది. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయడం సాధ్యమయ్యేనా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
చాలని ప్రభుత్వ రుణం
ప్రభుత్వమిచ్చే సాయం తక్కువగా ఉండటం నిర్మాణదారులను ఇబ్బంది పెడుతోంది. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులతో కలిపి ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షల చొప్పున అందజేస్తోంది. కూలీలతోపాటు సామగ్రి ధరలు పెరిగిన నేపథ్యంలో ఆ నగదుతో ఇంటి నిర్మాణం చేపట్టడం కష్టంగా మారింది. మొదట్లో నాయకులు, అధికారులు ప్రభ్వుత్వం మూడు ఆప్షన్లు ఇస్తోందని.. ఒకటి.. లబ్ధిదారులు నిర్మించుకుంటే రుణం ఇవ్వడం, రెండు.. నిర్మాణ సామగ్రి కోరితే రాయితీ ధరలకు అందించడం, మూడు.. కోరితే ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని ప్రకటనలు చేశారు. తీరా లబ్ధిదారులే నిర్మాణాలు చేపట్టాలని, లేదంటే ఇళ్ల స్థలాలు రద్దవుతాయని అధికారులు చెప్పడంతో చాలామంది నిర్మాణాలకు ముందుకు వచ్చారు. మూడో ఆప్షన్ కింద ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి ఇవ్వాలని ఎక్కువ శాతం మంది కోరుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే సాయానికి తోడు నిర్మాణాలకు బ్యాంకుల నుంచి రుణాలందిస్తామని వైఎస్ఆర్ క్రాంతిపథం అధికారులు, సిబ్బంది డ్వాక్రా మహిళలను ప్రోత్సహిస్తున్నారు.
అంధకారంగా ఉంటోంది
మాది మండపేటలోని తర్వాణిపేట. ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నా. వేములపల్లి లేఔట్లో స్థలం ఇచ్చారు. ఇంటి అద్దెలు పెరగడంతో సొంతంగా ఇల్లు నిర్మించుకున్నాం. వీధి దీపాల్లేక రాత్రి సమయంలో అంధకారంగా ఉంటోంది. ఇంకా ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. సమీపంలోని స్తంభం నుంచి రూ.15 వేలు ఖర్చుచేసి తీగల ద్వారా ఇంటికి విద్యుత్తు సరఫరా చేసుకున్నాం. స్తంభాలు వేసినా.. తీగలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయలేదు.
వెంకటేశ్వర్లు, వేములపల్లి
లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాం
జిల్లావ్యాప్తంగా డిసెంబరు నాటికి ఆరు వేల గృహప్రవేశాలు జరిగేలా చర్యలు చేపట్టాం. ఇప్పటివరకు 52శాతం పూర్తయ్యాయి. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. నిత్యం క్షేత్రస్థాయిలో అధికారులు లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు. నిర్మాణ బిల్లులు ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నాం. నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేసేలా అవగాహన కల్పిస్తున్నాం.
వై.శ్రీనివాస్, గృహనిర్మాణశాఖ పర్యవేక్షక ఇంజినీర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం వచ్చారని తెచ్చారు.. వెళ్లారని వదిలేశారు
[ 23-04-2024]
ఈ నెల 18న ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జిల్లాలో బస్సు యాత్రం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైకాపా నేతలు, అధికారులు నానా హడావుడి చేశారు. -
అభివృద్ధి మాది.. విధ్వంసం జగన్ది..
[ 23-04-2024]
కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీప కూడలిలో సోమవారం సాయంత్రం ప్రజాగళం బహిరంగ సభలో తెదేపా అధినేత ప్రసంగించారు. -
సత్యదేవుడి సేవల్లోనూ వైకాపా వేలు
[ 23-04-2024]
సంప్రదాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. వైదిక కార్యక్రమాల నిర్వహణలో ఇష్టానుసారం వ్యవహరించారు. వివాదాస్పదమై... -
పదిలో వెనుకబడిపోయాం..
[ 23-04-2024]
వసతుల లేమి, బోధనా సిబ్బంది కొరత, ఇతర అసౌకర్యాల నడుమ విద్యార్థులు అవస్థలు పడుతుండటంతో ఈ ఏడాది పదోతరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా వెనుకబడి పోయింది. -
చంద్రబాబును కలిసిన నల్లమిల్లి
[ 23-04-2024]
ప్రజాగళం బహిరంగ సభకు జగ్గంపేట వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
నామినేషన్ల సందడి
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం సందడిగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
రాజీ పడదగిన కేసులు జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలి
[ 23-04-2024]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజీ పడదగిన కేసుల జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలని తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి పేర్కొన్నారు. -
ఫలితాలను ఏం మాయ చేశావ్
[ 23-04-2024]
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతున్నామన్న వైకాపా సర్కారు మాటలు బూటకమని తేలిపోయింది. సోమవారం వెలువడిన పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అరకొర ఫలితాలే సాధించాయి. -
నిరుద్యోగ సమస్య తీర్చేవారికే మద్దతు
[ 23-04-2024]
రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే: ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు ద్వారా తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. -
కొంత మోదం.. కొంత ఖేదం
[ 23-04-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరానికి 18,786 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 17,262 మంది ఉత్తీర్ణులయ్యారు. -
జిల్లాలో 24 నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో సోమవారం మొత్తం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి నాలుగు, జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. -
కాంగ్రెస్కు సానుకూల పవనాలు: రఘువీరారెడ్డి
[ 23-04-2024]
రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజవర్గం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి