logo

జనసేన నాయకుడు అనుమానాస్పద మృతి

జనసేన నాయకుడు, బిల్డర్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది.

Published : 02 Dec 2022 05:16 IST

స్వామినాయుడు (పాత చిత్రం)

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జనసేన నాయకుడు, బిల్డర్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. ప్రకాశంనగర్‌ పోలీసులు వివరాల ప్రకారం.. నగరంలోని జేఎన్‌ రోడ్డులో నివాసం ఉంటున్న స్వామినాయుడు(43) అపార్టుమెంట్లు నిర్మించి విక్రయిస్తుంటారు. బుధవారం రాత్రి ఇంట్లో విగతజీవిగా పడిఉండడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలో ఈయన రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. ప్రస్తుతం జనసేన పార్టీ నగర కమిటీలో ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా బయటి నుంచి విషపు ఇంజెక్షన్‌(పాయిజన్‌) తెప్పించుకుని దానిని చేయించుకోవడం ద్వారా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, సహజ మరణమా లేక ఆత్మహత్యా అనేది పోస్టుమార్టం నివేదికలో తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మృతుడి సోదరుడు గణేష్‌ ఫిర్యాదు మేరకు గురువారం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని