ముగ్గురి సజీవ దహనం
జాతీయ రహదారిపై ప్రత్తిపాడు మండలం ధర్మవరం సమీపంలో గురువారం అర్ధరాత్రి రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనమయ్యారు.
రెండు లారీలు ఢీకొని చెలరేగిన మంటలు
ఎగసిపడుతున్న అగ్నికీలలు
ప్రత్తిపాడు, న్యూస్టుడే: జాతీయ రహదారిపై ప్రత్తిపాడు మండలం ధర్మవరం సమీపంలో గురువారం అర్ధరాత్రి రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కంటైనరును కత్తిపూడి వైపు నుంచి వస్తున్న ఖాళీ ఇసుక లారీ డివైడర్ మీద నుంచి దూసుకొచ్చి బలంగా ఢీకొట్టిందే తడవుగా మంటలు వ్యాపించాయి. ఎస్సై, పోలీసులు, ప్రత్తిపాడు అగ్నిమాపక అధికారి సూర్యనారాయణ, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. రెండు లారీలు ఒకదానిలో మరొకటి ఇరుక్కున్నంతగా ఢీకొన్నాయి. ఇంకా ఎవరైనా ఉన్నారా? అనేది మంటలు అదుపులోకి వస్తే తప్ప తెలియదని చెప్పారు. మంటలు అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా