logo

సైకో పాలన పోవాలి.. సైకిల్‌ సర్కారు రావాలి

‘‘మీ పిల్లల భవిత బాగుపడాలంటే చంద్రన్న రావాలని అంతా కోరుకుంటూ అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. మీ ఉత్సాహం ఎంతో ఆనందాన్నిస్తోంది’’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Published : 02 Dec 2022 05:21 IST

ఈనాడు - రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, కొవ్వూరు పట్టణం, తాళ్లపూడి, చాగల్లు, గోపాలపురం, టి.నగర్‌

అధినేతకు అభిమానంతో...

‘‘మీ పిల్లల భవిత బాగుపడాలంటే చంద్రన్న రావాలని అంతా కోరుకుంటూ అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. మీ ఉత్సాహం ఎంతో ఆనందాన్నిస్తోంది’’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తాళ్లపూడి, కొవ్వూరు మండలాల్లో ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’.. కార్యక్రమంలో చంద్రబాబు గురువారం పాల్గొన్నారు. తాడిపూడి, ప్రక్కిలంక, వేగేశ్వరపురం, చిడిపి, కుమారదేవం, ఆరికరేవుల మీదుగా కొవ్వూరు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించారు.  ‘‘సైకో పాలన పోవాలి.. సైకిల్‌ పాలన రావాలి..  ఏపీని కాపాడుకోవాలి- జగన్‌ పోవాలి’’ అని జనంతో నినాదాలు చేయించారు. వేలాదిగా తరలివచ్చిన జనం పూల జల్లుల నడుమ అభిమానం చాటారు. గ్రామాల కూడళ్లలో బాబు రాకకోసం నిరీక్షించి ఘన స్వాగతాలు పలికారు. ప్రజల ఉత్సాహం చూసిన బాబు అభివాదం చేస్తూ.. పిడికిలి బిగించి పోరాడదామని సంకేతమిస్తూ ఉత్సాహ పరిచారు.

కొవ్వూరు సభకు తరలివచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న చంద్రబాబు

దొండపూడిలో అపూర్వ స్వాగతం


కొవ్వూరులో బాబు ప్రసంగానికి జేజేలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని