బిల్లు రాకుంది... ఇల్లు కాకుంది...
గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పక్కా గృహాలకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపు అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతూనేఉంది.
న్యూస్టుడే, అమలాపురం కలెక్టరేట్, మండపేట
అల్లవరం: గోపాయిలంకలో అసంపూర్తిగానే గృహ నిర్మాణం
గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పక్కా గృహాలకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపు అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతూనేఉంది. నాలుగేళ్ల కిందటే గృహ రుణాలు మంజూరైనవాటిలో చాలా వరకు అప్పట్లోనే నిర్మాణాలు పూర్తి కాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. 2019 ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, ప్రభుత్వం మారడంతో నిర్మాణాలు మందగించాయి. 2019 మార్చి నెలాఖరు వరకు బిల్లులు మంజూరు కాగా, ఆ తర్వాత నుంచి చెల్లింపులు నిలిపేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పెండింగ్ బకాయిలు విడుదల చేసేందుకు వీలుగా గ్రామ వాలంటీర్ల ద్వారా క్షేత్రస్థాయి సర్వే జరిపి అర్హులైన వారందరికీ బిల్లులు చెల్లించేలా రంగం సిద్ధం చేస్తున్నట్లు అధికార పార్టీ నాయకులు ప్రచారం చేసినా.. ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు.
ఎదురుచూపులే మిగిలాయి..
తెదేపా ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు బిల్లులకోసం నాలుగేళ్లుగా ఎదురుచూపులే మిగిలాయి. 2016-17 అర్థిక సంవత్సరం నుంచి 2018-19 వరకు ఎన్టీఆర్ గ్రామీణ, పట్టణ గృహ పథకం ద్వారా గత ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఇళ్లు కేటాయించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలోనూ పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. 2019 ఆర్థిక సంవత్సరం తర్వాత నిర్మాణ పనులు ప్రారంభించని వాటిని రద్దు చేయాలని వైకాపా ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ కావడంతో నిర్మాణ పనులు ప్రారంభించని వారికి రుణాలు రద్దు చేశారు.
ఎక్కడివి అక్కడే..
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 2020 డిసెంబరు నుంచి ఇళ్లస్థలాలు, పక్కా గృహాల మంజూరు ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా లేఔట్లు వేసి ఒక్కొక్కరికి సెంటున్నర స్థలం కేటాయించారు. జిల్లావ్యాప్తంగా 24,616 ఇళ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం కేవలం కొత్తవాటికి మాత్రమే ప్రాధాన్యమిస్తూ, పాత బకాయిల చెల్లింపు విషయం పూర్తిగా పక్కన పెట్టేసింది. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు గృహ నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్ బిల్లుల ప్రక్రియ ప్రారంభం అవుతుందని ప్రచారం నిర్వహించినా.. మూడున్నరేళ్లుగా ఒక్క రూపాయి కూడా రాలేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
జిల్లావ్యాప్తంగా రూ.68.56 కోట్ల బకాయిలు
ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 20,996 మంది లబ్ధిదారులకుగాను రూ.68,56,45,446 మేర బకాయిలు చెల్లింపులు నిలిచిపోయాయి. లబ్ధిదారులు వివిధ దశల్లో నిర్మాణాలు పూర్తి చేసినా, ఎన్నికల కోడ్ నేపథ్యంలో 2019 నుంచి బిల్లుల చెల్లింపులు నిలిపివేశారు. దాంతో ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఈ పథకంలో నిర్మాణం ప్రారంభించిన ఇళ్లు అసంపూర్తిగానే దర్శనం ఇస్తున్నాయి.
ఇప్పటివరకు రూ.19 వేలే వచ్చింది
మాది మండపేట మండలం మారేడుబాక. 2019లో ఇంటి రుణానికి దరఖాస్తు చేసుకుంటే.. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం ద్వారా రూ.1.50 లక్షలు మంజూరైంది. దాంతో ఇంటి నిర్మాణం చేపట్టాం. ఎన్నికలకు మూడు నెలల ముందు రూ.19వేలు బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఆ తరువాత ఒక్క రూపాయి కూడా జమకాలేదు. బంధువుల వద్ద అప్పులుచేసి ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నాం. ఇప్పటికైనా అధికారులు బిల్లులు మంజూరుచేస్తే కొంత మేర ఉపశమనం పొందుతాం.
-బుంగ భవానీ
బిల్లు అవ్వలేదు.. నిర్మాణం నిలిచింది
మాది అల్లవరం మండలం గోపాయిలంక. మాకు 2017లో ఎన్టీఆర్ గ్రామీణ గృహపథకంలో రుణం మంజూరైంది. పునాది దశ వరకు బిల్లు వచ్చింది. ఆ తర్వాత నుంచి రాలేదు. అప్పటినుంచి ఇంటి నిర్మాణం పూర్తి చేయలేకపోయాం. ఇల్లు మంజూరైందని పాత ఇంటిని కూల్చి నిర్మాణం చేపట్టాం. రెండూ లేకుండాపోయాయి. డబ్బులు సమకూరినప్పుడల్లా కొంతవరకు పనులు చేపడుతున్నాం. ఇప్పటికైనా పూర్తిస్థాయి బిల్లు మంజూరుచేస్తే నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసుకుంటాం.
- వంగా సూరిబాబు
ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం..
ఎన్టీఆర్ పట్టణ, గ్రామీణ పథకంలో నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి బిల్లు బకాయిల గురించి నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందజేశాం. ప్రభుత్వం నిధులు మంజూరుచేయగానే లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తాం.
- వై.శ్రీనివాస్, గృహనిర్మాణశాఖ, పర్యవేక్షక ఇంజినీర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ యాత్రన.. జనం యాతన
[ 19-04-2024]
విద్యుత్తు కట్.. అంతర్జాలం బంద్.. దుకాణాల మూత.. సామాన్యుల వాహనాలకు తోడు అంబులెన్సులు సైతం నిలిపివేత.. గంటలపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. -
ఎన్నికల వేళ యువతా.. అప్రమత్తం
[ 19-04-2024]
ఎన్నికల వేళ యవత మరిన్ని జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలిచారని బైక్ ర్యాలీల్లో పాల్గొనడం, ప్రత్యర్థులతో ఘర్షణకు దిగడం వంటివి ఎంతమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. -
అసలేం జరుగుతోంది..?
[ 19-04-2024]
ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్ పెట్టి తెప్పించేస్తారు. -
జిల్లాకు రానున్న ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారు. వీరికి అనుసంధానంగా లైజనింగ్, ఇతర సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
తొలిరోజు ఏడు నామినేషన్ల దాఖలు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకాగా తొలిరోజు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. -
పాదయాత్ర అబద్ధాలతో దండయాత్ర
[ 19-04-2024]
పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను. -
తొలిరోజు నామినేషన్ల సందడి
[ 19-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు. -
పేపరుమిల్లు కార్మికుల ఆందోళన
[ 19-04-2024]
సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్ గురువారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్మిల్లుకు చేరుకున్న సమయంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 రోజులుగా వేతన ఒప్పందం కోరుతూ సమ్మె చేస్తున్నా పేపర్మిల్లు యాజమాన్యం స్పందించడం లేదని నినాదాలు చేశారు. -
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది సమస్యాత్మక కేంద్రాలే. పోలింగ్ ముగిసే వరకు అధికారుల దృష్టంతా వాటిపైనే ఉంటుంది. -
అద్దె చెల్లించక అగచాట్లు
[ 19-04-2024]
వైకాపా పాలనలోని గత అయిదేళ్లలో అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు కేవలం నోటి మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు
[ 19-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన నుంచి గండేపల్లి మండలంలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆ పార్టీ నాయకుల అండదండలతో కొన్ని లే ఔట్లను ఏర్పాటు చేసి అక్రమంగా మెరక చేశారు. -
‘ఆత్మ’సాక్షి లేదా.. అన్నదాతంటే పడదా..!
[ 19-04-2024]
సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు