పోషక.. సౌకర్యం
అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న గర్భిణులు, బాలింతలు మధ్యాహ్న భోజన పథకంలో పోషకాహారాన్ని 100 శాతం మంది తినేలా చూడాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు.
న్యూస్టుడే, అమలాపురం కలెక్టరేట్
బోడసకుర్రు అంగన్వాడీ కేంద్రంలో ఇంటికి పోషకాహారం తీసుకెళుతున్న లబ్ధిదారుల కుటుంబ సభ్యులు
అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న గర్భిణులు, బాలింతలు మధ్యాహ్న భోజన పథకంలో పోషకాహారాన్ని 100 శాతం మంది తినేలా చూడాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇందుకోసం అధికారులు నిబంధనలు సడలించారు. అంగన్వాడీ కేంద్రాలకు రాలేని 9, 10 నెలల గర్భిణులు, నెలల బాలింతలకు వండిన ఆహార పదార్థాలను వారిళ్లకే పంపించేందుకు అవకాశం కల్పించారు.
వివిధ కారణాలతో అంగన్వాడీ కేంద్రాల్లో భోజనం చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు. అలాంటివారి కుటుంబ సభ్యులకు ఇప్పటివరకు కార్యకర్తలు బాక్సుల్లో ఇంటికి ఇచ్చేవారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంలో భోజనం చేసినవారి వివరాలు యాప్లో నమోదు చేసినపుడు భోజనం చేయనివారి గురించి ఉన్నతాధికారులు ఆరా తీయగా అంగన్వాడీ కేంద్రాలు దూరంగా ఉండటం, 9, 10 నెలల గర్భిణులు, బాలింతలు నడిచి కేంద్రాలకు రావడానికి ఇబ్బందిపడుతున్నట్లు సిబ్బంది తెలిపారు. దాంతో కేంద్రాలకు వచ్చినవారికి వడ్డించాలని, రాలేనివారికి ఇళ్లకు పంపాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి ఆదేశాలు వచ్చాయి.
కేంద్రాలకు వచ్చేందుకు అనాసక్తి..
అంగన్వాడీ కేంద్రాల్లోని గర్భిణులు, బాలింతలకు రెండేళ్లుగా కరోనా కారణంగా పోషకాహార సరకులు ఇంటికే ఇచ్చేవారు. కరోనా తగ్గుముఖంతో లబ్ధిదారులకు కేంద్రాల్లోనే మధ్యాహ్న భోజనం వేడివేడిగా వండి పెట్టాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు. దాంతో ఈ ఏడాది జులై ఒకటో తేదీనుంచి గర్భిణులు బాలింతలకు కేంద్రాల్లోనే వండి పెడుతున్నారు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదైనా.. ఆశించిన ఫలితాలు రాలేదు. కేంద్రాలకు వచ్చేందుకు లబ్ధిదారులు సుముఖత చూపకపోవడంతో పోషకాహార లోపంతో బాధపడేవారి సంఖ్య పెరిగింది. దాంతో ఉన్నతాధికారులు నూతన నిర్ణయం తీసుకున్నారు.
కారణాలివీ..
* రెండేళ్లుగా ఇంటికే రేషన్ ఇచ్చి, ఒక్కసారిగా కేంద్రాలకు వచ్చి తినాలంటే కష్టంగా ఉంటోందని చాలామంది చెబుతున్నారు.
* కేంద్రం ఇళ్లకు దూరంగా ఉన్నవారు రావడానికి ఇష్టపడటం లేదు. సమీపంలో ఉన్నవారు మాత్రమే వస్తున్నారు.
* కేంద్రానికి రావాలంటే.. బాలింతలు బిడ్డల్ని ఇంటివద్దే వదిలిరావాల్సివస్తుండడం.
* ప్రసవ సమయం దగ్గిరపడినవారు దూరం నడవలేకపోవడం.
పోషకాహారం అందించడమే లక్ష్యం
అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న గర్భిణులు, బాలింతలకు 100శాతం పోషకాహారం అందించడమే లక్ష్యంగా పని చేయాలని సిబ్బందిని ఆదేశించాం. కేంద్రాలకు రాలేని లబ్ధిదారుల కుటుంబసభ్యులు వస్తే బాక్సుల్లో పోషకాహారం పెట్టిస్తారు.
-సత్యవేణి, మహిళా శిశుసంక్షేమ శాఖ, జిల్లా అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలన అంతమొందిద్దాం
[ 24-04-2024]
జగన్ పరిపాలనను అంతమొందిద్దాం.. పిడికిలి బిగించి మరీ కూటమిని గెలిపించుకుందామని జనసేన అధినేత పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ప్రసంగించారు. -
జగన్ మాటిస్తే.. నీటి మూటే!
[ 24-04-2024]
సీఎం చెప్పిన మాట ప్రకారం సంక్రాంతి వెళ్లిపోయింది.. ఉగాది దాటేసింది. ఇవేవీ ప్రభుత్వానికి గుర్తులేకపోయినా ఎన్నికల నగారా మోగుతుందనే విషయం జ్ఞప్తికి వచ్చింది. ఖజానాలో కాసులు లేకున్నా రైతులకు తుపాను పరిహారం అంటూ హడావుడిగా మార్చి 6న బటన్ నొక్కారు. -
తలూపినా తలోదారే!
[ 24-04-2024]
రాజమహేంద్రవరం నగరంలో అధికార పార్టీ నేతల్లో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా వీరిమధ్య పొరపొచ్చాలు సమసిపోవడం లేదు. -
రోగుల భద్రత మరిచావా పాలకా!
[ 24-04-2024]
ఒకప్పుడు నిత్యం ప్రయాణికులతో కళకళలాడే గోదావరి రైల్వేస్టేషన్ పలు సమస్యలతో కునారిల్లుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పాలు, కూరగాయలు తీసుకొచ్చే చిరు వ్యాపారులు.. చదువుల నిమిత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు.. ఉద్యోగులు ఇక్కడి నుంచే పాసింజర్లలో రాకపోకలు సాగించేవారు. -
అనపర్తి.. వీడిన అనిశ్చితి
[ 24-04-2024]
అనపర్తి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి స్థానంపై కొన్నిరోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడింది. కూటమి పెద్దల నిర్ణయంతో సుమారు 27 రోజుల తర్వాత అనిశ్చితికి తెరపడింది. -
మామ బడాయి మాటలు..
[ 24-04-2024]
నాడు-నేడు మొదటి విడత పనుల్లో మండలంలోని వాదాలకుంట మొదటి విడత పనులే ఇంకా..ఉన్నత పాఠø‹లలో ఆరు అదనపు గదులు మంజూరయ్యాయి. నిధులు కొరత కారణంగా వాటిని తగ్గించి నాలుగుకు తగ్గించారు -
బటన్ నొక్కి జగన్ ఎంత డబ్బు వెనకేశారు?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాటు బటన్ నొక్కి పేదలకు డబ్బులు పంపిణీ చేశానని చెబుతున్నారని, అదే బటన్ నొక్కి ఆయన ఇంకెంత వెనకేసుకున్నారని వంగవీటి రాధా ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు -
రూ.2.58 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం
[ 24-04-2024]
ఎన్నికల తనిఖీల్లో భాగంగా కడియం పోలీసులు రూ.2.58 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
హోంమంత్రి ర్యాలీలో గాయపడిన దళితుడు ఇకలేరు
[ 24-04-2024]
హోంమంత్రి తానేటి వనిత నామినేషన్ ర్యాలీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ పడిపోయి గాయపడిన దళితుడు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన పల్లపు అబ్బులు (73) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. -
మే 26 వరకు కాకినాడ- విశాఖ రైలు రద్దు
[ 24-04-2024]
కాకినాడ పోర్టు- విశాఖపట్నం(17267), విశాఖపట్నం-కాకినాడ పోర్టు(17267) రైళ్లను ఈ నెల 29 నుంచి మే 26 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
వైకాపా గొప్పలు.. రైతుకు తిప్పలు
[ 24-04-2024]
మాది రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొంటున్న వైకాపా పాలనలో కర్షకులు అనుభవిస్తున్న అవస్థలకు ఈ చిత్రమే నిదర్శనం. కట్టిస్తామన్న గోదాములు నిర్మించక, కనీసం కళ్లాలకూ స్థలాలు చూపకపోవడంతో రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. -
జగన్ను కుర్చీ దింపాలి
[ 24-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా అర్బన్ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ఆభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!