మనసు రాదా.. మహాశయా?
కాకినాడ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి(సీఎండీఎఫ్) కింద చేపట్టాల్సిన పనులకు అడుగు పడటం లేదు.
కరప: పాతర్లగడ్డలో నిధుల లేమితో అసంపూర్తిగా మిగిలిన వంతెన
కాకినాడ కలెక్టరేట్, న్యూస్టుడే: కాకినాడ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి(సీఎండీఎఫ్) కింద చేపట్టాల్సిన పనులకు అడుగు పడటం లేదు. ఒక్కో నియోజకవర్గానికి రూ.రెండు కోట్లు చొప్పున సీఎండీఎఫ్ కింద 2022-23కు నిధులు మంజూరు చేశారు. దీనికి సంబంధించి జులై 18న మార్గదర్శకాలు జారీ చేస్తూ 18 రకాల పనులకు వీటిని వినియోగించాలని పేర్కొన్నారు. ఒక్కో నియోజకవర్గానికి మంజూరు చేసిన రూ.రెండు కోట్లలో షెడ్యూల్డ్ కులాలకు(ఎస్సీ) 17.08శాతం చొప్పున రూ.34.16 లక్షలు, షెడ్యూల్డ్ తెగలకు(ఎస్టీ) 5.53 శాతం చొప్పున రూ.11.06 లక్షలు ఖర్చు చేయాలని ఉత్తర్వులిచ్చారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల జనాభాకు అనుగుణంగా రూ.రెండు కోట్లను వివిధ పనులకు కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు.
రెండు నియోజకవర్గాల్లో..
జిల్లాలోని తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ నగరం, కాకినాడ గ్రామీణం నియోజకవర్గాలకు ఒక్కోచోట రూ.రెండు కోట్లు చొప్పున రూ.14 కోట్లు మంజూరు చేశారు. నవంబరు 30 నాటికి అయిదు నియోజకవర్గాల పరిధిలో కేవలం రూ.5.91 కోట్లతో చేపట్టే పనులకే ప్రతిపాదనలు రాగా కలెక్టర్ ఆమోదం ఇచ్చారు. ఇంకా రెండు నియోజకవర్గాల నుంచి ప్రతిపాదనలు రాకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి, నాలుగు నెలలైనా ఇప్పటికీ పూర్తిస్థాయిలో పనులకు ప్రతిపాదనలు రాలేదు. ప్రజాప్రతినిధులు స్పందిస్తేనే ప్రజలకు సౌకర్యాలు ఒనగూరే అవకాశం ఉంది. 2023, మార్చి 31లోగా ప్రతిపాదనలు రాకపోయినా, వచ్చిన వాటిని ఆమోదించకపోయినా నిధులు వెనక్కి పోతాయి.
పెద్దాపురంపై పీటముడి
కాకినాడ జిల్లాలో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నచోట కేటాయించిన రూ.రెండు కోట్ల సీఎండీఎఫ్ నిధులకు సంబంధించి ప్రతిపాదనలు ఎవరు పెట్టాలనే దానిపై స్పష్టత రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పేర్కొనలేదు. దీంతో పెద్దాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెదేపా ఎమ్మెల్యే ప్రతిపాదనలు పంపితే, ఆమోదిస్తారా.. లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది.
* కాకినాడ గ్రామీణ నియోజకవర్గానికి సీఎండీఎఫ్ కింద మంజూరు చేసిన రూ.రెండు కోట్ల నిధులకు ఇప్పటికీ ప్రతిపాదనలు కలెక్టర్కు పంపలేదు. పనులను గుర్తించే పనిలోనే ఉన్నారు.
* ప్రస్తుతం పిఠాపురం, కాకినాడ నగరం, తుని, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో రూ.5.91కోట్లతో 45 పనులు చేపట్టేందుకు పరిపాలనామోదం ఇచ్చారు. వీటిలో పెద్ద పనులనే ప్రతిపాదించారు. జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి ఒకే పనిని రూ.1.10కోట్లతో చేపట్టేలా ఎమ్మెల్యే ప్రతిపాదనలు పంపారు. మళ్లీ దీనికి మార్పు చేసేలా, ఒకేపనికి ఇంత మొత్తంలో నిధులు ఇచ్చేస్తే మిగతా పనుల పరిస్థితి ఏంటని భావించి, ప్రస్తుతానికి వీటిని నిలిపివేయాలని కోరారు.
* తుని, కాకినాడ నగర నియోజకవర్గాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన రూ.రెండు కోట్ల నిధులతో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు వచ్చాయి. కాకినాడ నగర నియోజకవర్గంలో ఇప్పటికి రూ.95లక్షల విలువైన మూడు పనులు చేపట్టేందుకు కలెక్టర్ పరిపాలనామోదం ఇచ్చారు. మిగతా రూ.1.05కోట్ల నిధులకు ఎమ్మెల్యే ప్రతిపాదనలు ఇచ్చినా, ఆయా శాఖల నుంచి ఎస్టిమేట్ వివరాలు కలెక్టరేట్కు చేరకపోవడంతో వీటికి ఇంకా పరిపాలనా ఆమోదం ఇవ్వలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ యాత్రన.. జనం యాతన
[ 19-04-2024]
విద్యుత్తు కట్.. అంతర్జాలం బంద్.. దుకాణాల మూత.. సామాన్యుల వాహనాలకు తోడు అంబులెన్సులు సైతం నిలిపివేత.. గంటలపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. -
ఎన్నికల వేళ యువతా.. అప్రమత్తం
[ 19-04-2024]
ఎన్నికల వేళ యవత మరిన్ని జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలిచారని బైక్ ర్యాలీల్లో పాల్గొనడం, ప్రత్యర్థులతో ఘర్షణకు దిగడం వంటివి ఎంతమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. -
అసలేం జరుగుతోంది..?
[ 19-04-2024]
ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్ పెట్టి తెప్పించేస్తారు. -
జిల్లాకు రానున్న ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారు. వీరికి అనుసంధానంగా లైజనింగ్, ఇతర సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
తొలిరోజు ఏడు నామినేషన్ల దాఖలు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకాగా తొలిరోజు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. -
పాదయాత్ర అబద్ధాలతో దండయాత్ర
[ 19-04-2024]
పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను. -
తొలిరోజు నామినేషన్ల సందడి
[ 19-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు. -
పేపరుమిల్లు కార్మికుల ఆందోళన
[ 19-04-2024]
సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్ గురువారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్మిల్లుకు చేరుకున్న సమయంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 రోజులుగా వేతన ఒప్పందం కోరుతూ సమ్మె చేస్తున్నా పేపర్మిల్లు యాజమాన్యం స్పందించడం లేదని నినాదాలు చేశారు. -
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది సమస్యాత్మక కేంద్రాలే. పోలింగ్ ముగిసే వరకు అధికారుల దృష్టంతా వాటిపైనే ఉంటుంది. -
అద్దె చెల్లించక అగచాట్లు
[ 19-04-2024]
వైకాపా పాలనలోని గత అయిదేళ్లలో అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు కేవలం నోటి మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు
[ 19-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన నుంచి గండేపల్లి మండలంలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆ పార్టీ నాయకుల అండదండలతో కొన్ని లే ఔట్లను ఏర్పాటు చేసి అక్రమంగా మెరక చేశారు. -
‘ఆత్మ’సాక్షి లేదా.. అన్నదాతంటే పడదా..!
[ 19-04-2024]
సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి