అమ్మను చూడకనే.. అనంత లోకాలకు
చిన్నకారొకటి.. చోదకుడి నిర్లక్ష్యం.. రెప్పపాటులో రెండు నిండు ప్రాణాలను బలిగొంది. దీక్ష తీసుకుని నలుగురొక బృందంగా విజయవాడ అమ్మ దర్శనానికి చేస్తున్న పాదయాత్రను ఈ దుర్ఘటన విషాదాంతం చేసింది.
భవానీలను సమీపిస్తున్న కారు... ఢీ కొట్టిందిలా.. చెల్లాచెదురుగా భక్తులు
తుని పట్టణం, న్యూస్టుడే: చిన్నకారొకటి.. చోదకుడి నిర్లక్ష్యం.. రెప్పపాటులో రెండు నిండు ప్రాణాలను బలిగొంది. దీక్ష తీసుకుని నలుగురొక బృందంగా విజయవాడ అమ్మ దర్శనానికి చేస్తున్న పాదయాత్రను ఈ దుర్ఘటన విషాదాంతం చేసింది. కాకినాడ జిల్లా తుని పట్టణంలోని జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఇద్దరు భవానీ భక్తుల దుర్మరణం
నుజ్జయిన కారు ముందు భాగం
శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం పెనసాం గ్రామానికి చెందిన భవానీలు రావి సంతోష్ (28), నల్ల ఈశ్వరరావు (38), మహేష్, జి.గిరి స్వగ్రామం నుంచి విజయవాడకు కాలినడకన గత నెల 26న మధ్యాహ్నం బయల్దేరారు. వారు శుక్రవారం రాత్రి తుని జాతీయ రహదారి సమీపాన పాయకరావుపేట వద్ద అమ్మవారి ఆలయంలో బస చేశారు. శనివారం ఉదయం 6 గంటలకు పూజ చేసుకుని యాత్రను కొనసాగించారు. డీమార్ట్ దాటాక ఒక డాబా వద్దకు చేరుకునే సరికి సుమారు 6.30 గంటల సమయంలో మృత్యువులా చిన్నకారు వెనుక నుంచి దూసుకువచ్చింది. ముందు ఇద్దరు.. వెనుక ఇద్దరు రోడ్డుకు బాగా పక్కగా వారు నడచి వెళుతుండగా, విశాఖపట్నం నుంచి అనపర్తి మండలం కొమరిపాలెం వెళ్తున్న కారు అతి వేగంగా వీరిపైకి దూసుకొచ్చింది. కుడివైపు టాటామ్యాజిక్ వాహనం వెళ్తుండగా దాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో అతివేగంగా వచ్చి అదుపుతప్పి సంతోష్, ఈశ్వరరావులను ఢీకొట్టింది. వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మిగతా ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. తమతో నడుచుకుంటూ వచ్చిన వారిలో ఇద్దరు ఎక్కడపడ్డారో.. ఏం జరిగిందో అర్థంకాక ఈ ఇద్దరూ బోరున విలపించారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. కారు డ్రైవర్ సూర్యతేజను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్ఛార్జి సీఐ సన్యాసిరావు తెలిపారు.
పెనసాంలో విషాద ఛాయలు
శ్రీకాకుళంలో బయలుదేరిన సంతోష్, ఈశ్వరరావు (పాతచిత్రం)
జి.సిగడాం: జి.సిగడాం మండలం పెనసాం గ్రామానికి చెందిన ఇద్దరు భవానీ భక్తులు దుర్మరణం పాలవ్వడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రావి సంతోష్ 2019లో సంధ్య అనే యువతిని వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం లేదు. తల్లిదండ్రులు, సోదరుడి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. వ్యవసాయమే ఆధారం.
* నల్ల ఈశ్వరరావుకు భార్య నీలవేణి, తల్లిదండ్రులు, అన్నయ్య కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఈశ్వరరావుకు ఇద్దరు కుమారులు. ఒక కుమార్తె ఉన్నారు. విద్యుత్ పనులు చేస్తూ తమను పోషిస్తున్నాడని, ఇప్పుడు ఎవరు దిక్కు అని ఈ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు