ప్రోత్సాహం.. అందుకుంటే ప్రయోజనం
ఉద్యాన రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకుని పెట్టుబడి వ్యయం తగ్గించుకోవడం ద్వారా లాభాలు పెంచుకోవచ్చు.
తుంపర సేద్య పరికరం
కాకినాడ నగరం, సర్పవరం జంక్షన్, న్యూస్టుడే: ఉద్యాన రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకుని పెట్టుబడి వ్యయం తగ్గించుకోవడం ద్వారా లాభాలు పెంచుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) ద్వారా వ్యవసాయ, ఉద్యాన, పట్టు సాగు చేసే రైతులకు రాయితీ ద్వారా సూక్ష్మ సేద్య నీటి పరికరాలను అందజేస్తోంది. తక్కువ పెట్టుబడి, నీటి ఆదా ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధించాలనే ఉద్దేశంతో రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. జిల్లాలో రైతులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసినా.. వాటిని పొందేందుకు చెల్లించాల్సిన వాటా మొత్తం చెల్లించకపోవడంతో పథకాల లబ్ధి ఎవరికీ అందని పరిస్థితి నెలకొంది.
రైతు వాటాచెల్లించడంలో వెనుకంజ
కినాడ జిల్లాకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ నీటి సాగు పథకం కింద 2 వేల హెక్టార్ల (5 వేల ఎకరాలు) మేర సాగుకు అవసరమైన పరికరాలను రాయితీపై అందించేందుకు నిర్ణయించారు. అయితే 1,865 హెక్టార్ల (4,665 ఎకరాలు)కు సంబంధించి రైతులు నమోదు పూర్తి చేసినా 800 ఎకరాలకు మాత్రమే తమ వాటా ధనాన్ని (డీడీలు) చెల్లించారు. ఇంకా సుమారు 4 వేల ఎకరాల రైతులు డీడీలు చెల్లించాల్సి ఉంది. మరో 300 ఎకరాల మేర రైతుల నుంచి ఇంకా దరఖాస్తులు రావాలి. వీటికి సంబంధించిన దరఖాస్తులను గ్రామస్థాయిలో ఆర్బీకేల్లో స్వీకరిస్తున్నారు. ఈ పథకం గురించి రైతులకు అవగాహన కల్పించి, ముందుకు తీసుకురావడంలో ఆ శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించకపోవడం వల్లే ఈ సమస్య నెలకొంది. కౌలు రైతులు దరఖాస్తు చేసేందుకు వారి వద్ద అవసరమైన డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల దరఖాస్తు చేసేందుకు అవకాశం లేకుండా పోతుంది. కౌలు రైతులు సీసీఆర్సీ కార్డుతోపాటు, ఏడేళ్ల లీజు ఒప్పందం ధ్రువీకరణపత్రం ఉంటేనే నమోదు అవుతుంది.
రాయితీపై బిందు, తుంపర సేద్య పరికరాలు
డ్రిప్ ఇరిగేషన్ పథకం కింద మెట్ట ప్రాంతానికి చెందిన చిన్న, సన్నకారు రైతులకు 2 హెక్టార్లకు మించకుండా 90 శాతం వరకు (రూ.2.13 లక్షలు మించకుండా..) రాయితీపై పరికరాలు అందజేస్తారు. ఇతర ప్రాంత రైతులకు 2 నుంచి 5 హెక్టార్లలోపు 50 శాతం రాయితీపై రూ.3.20 లక్షలు మించకుండా పరికరాలు ఇస్తారు.
* తుంపర సేద్యానికి చిన్న, సన్నకారు రైతులకు 2 హెక్టార్లు మించకుండా 55 శాతం రాయితీపై, ఇతర రైతులకు 2 నుంచి 5 హెక్టార్లకు మించకుండా 45 శాతం రాయితీపై పరికరాలు అందజేస్తారు.
సద్వినియోగం చేసుకోండి..
రాయితీపై ఇచ్చే బిందు, తుంపర సేద్య పరికరాలను సద్వినియోగం చేసుకోవాలి. దరఖాస్తు చేసిన రైతులందరూ తమ వాటా ధనాన్ని డీడీల రూపంలో చెల్లించాలి. ఆసక్తి ఉన్నవారు ఆర్బీకేల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. డీడీల చెల్లింపుల్లో కాకినాడ జిల్లా వెనకంజలో ఉన్న మాట వాస్తవమే. క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించే చర్యలు చేపడుతున్నా.
స్వాతి, జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారిణి, కాకినాడ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షేమ పథకాలకు బీజం వేసిన ఘనత తెదేపాదే
[ 29-03-2024]
పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత తెదేపాకే దక్కుతుందని తెదేపా మండల అధ్యక్షుడు నామన పరమేశ్వరరావు తెలిపారు. -
నిగ్గదీయొద్దు.. నోరు మెదపొద్దు: వైకాపా నేతను కాపాడేందుకు ఎన్ని ఆపసోపాలో!
[ 29-03-2024]
తిడితే పడాలి... కొడితే భరించాలి.. అధికార పక్ష నాయకుల అరాచకాలపై నోరు మెదిపితే ఇబ్బందే. -
పనిచేయని ఏసీలు, ఫ్యాన్లు.. సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
[ 29-03-2024]
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
[ 29-03-2024]
అనపర్తి నియోజకవర్గంలో తెదేపా ఉనికి లేకుండా చేయాలనే దురుద్దేశంతో వైకాపా కుట్రకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. -
అనకొండలు.. అధికారం అండదండలు
[ 29-03-2024]
కక్ష కట్టారో.. తప్పు జరగకపోయినా.. ఎలాంటి ఫిర్యాదులు అందకపోయినా కార్యాలయాల మీదకు వచ్చి పడతారు.. బాధితులతో బలవంతంగా ఫిర్యాదులు రాయించి మరీ వెంటాడి వేధిస్తారు.. -
పవన్.. వారాహి విజయభేరి
[ 29-03-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. -
తొలి అడుగు ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం
[ 29-03-2024]
ఇంటర్మీడియట్.. విద్యార్థి భవితకు తొలి అడుగు. కెరియర్ను ఏవిధంగా తీర్చిదిద్దుకోవాలి.. ఏ కోర్సులను ఎంచుకోవాలి.. ఎలా ముందడుగు వేయాలి.. అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలి.. ఇలా ఎన్నో సందేహాలు విద్యార్థులు.. తల్లిదండ్రులకు తలెత్తుతుంటాయి. -
ఆదుకుంటున్న సీలేరు జలాలు
[ 29-03-2024]
గోదావరిలో కొన్ని రోజులుగా నీటిమట్టం క్రమంగా పడిపోతోంది. -
ప్రదర్శన దర్పం.. ప్రయోజనం దూరం
[ 29-03-2024]
వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రూపొందించిన సృజనాత్మక పరికరాల ప్రదర్శన వేదికన్నారు.. రెండు వందలకు పైగానే నమూనాలను ప్రదర్శించినట్లు ఆర్భాటంగా ప్రకటించారు. -
సంద్రంలో సమర భేరి
[ 29-03-2024]
కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట సముద్రంలో ఇండో-అమెరికన్ సంయుక్త నావికా దళాల రహస్య సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. -
ప్రచారం.. కావాలి పర్యావరణ హితం
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నా.. అది దస్త్రాలకే పరిమితమవుతోంది. -
త్రివేణి సంగమంలా కూటమి పార్టీలు పనిచేస్తాయి
[ 29-03-2024]
రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు భాజపా అభ్యర్థులను కేంద్ర నాయకత్వం నిర్ణయించిందని, అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, భాజపా ఏపీ ఎన్నికల సహబాధ్యుడు సిద్ధార్థ్నాథ్ సింగ్ శ్రేణులను కోరారు. -
పక్కాగా ఎన్నికల నియమావళి అమలు
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా అధికార యంత్రాంగంతో పోలీసు వ్యవస్థ మమేకమై పనిచేస్తుందని ఏలూరు రేంజి ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. -
ప్రాణం తీసిన సహజీవనం
[ 29-03-2024]
ఓ మహిళతో సహజీవనం కోసం మద్యం మత్తులో ఉన్న స్నేహితుడిపైనే కత్తిదూసి హత్యచేశాడో వ్యక్తి.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్