ఆక్వా సంక్షోభం.. ఉపాధికి సంకటం
డాలర్ సేద్యంగా పేరుగాంచిన ఆక్వా రంగం ప్రస్తుతం పెను సవాళ్లు ఎదుర్కొంటోంది. ఓ వైపు నిలిచిన ఎగుమతులు, చుట్టుముడుతున్న వ్యాధులతో ఆక్వా రైతులు సాగుకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి.
కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆందోళన చేస్తున్న ఆక్వా అనుబంధ సంస్థల సిబ్బంది
అమలాపురం కలెక్టరేట్, న్యూస్టుడే: డాలర్ సేద్యంగా పేరుగాంచిన ఆక్వా రంగం ప్రస్తుతం పెను సవాళ్లు ఎదుర్కొంటోంది. ఓ వైపు నిలిచిన ఎగుమతులు, చుట్టుముడుతున్న వ్యాధులతో ఆక్వా రైతులు సాగుకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈ విపత్కర పరిస్థితులు తట్టుకోలేక రైతులు సాగు విరమించుకుంటే వేలాదిమంది ఉపాధికి దూరమవుతారని వాపోతున్నారు.
రైతులకు అందని ప్రోత్సాహం
ఆక్వా సాగులో రైతులకు వెన్నుదన్నుగా నిలిచే డీలర్లుసైతం చేతులెత్తేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో ఆక్వా రైతులకు మేతలు, ఔషధాలు, ఇతర సామగ్రి అరువు ఇవ్వలేమని చెప్పేస్తున్నారు. ఒకవేళ అప్పుచేసి కొన్నా.. పంట ఉత్పత్తులు తీసుకుంటామని హామీ ఇవ్వలేమని వ్యాపారులు చెబుతుండటంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు.
భవిష్యత్తు.. డోలాయమానం
చిన్న, సన్నకారు రైతులు చెరువు తవ్వుకుని రొయ్య పిల్లల్ని చెరువుల్లో వదిలిన తరువాత మేత, మందులు తదితరాలన్నిటికీ అరువు ఇచ్చే డీలర్లపై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం విదేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో డీలర్లు ఆక్వా సాగుకు ముందస్తు పెట్టుబడికి వెనుకంజ వేయడం.. ఆక్వా సాగు భవిష్యత్తును డోలాయమానంలో పడేస్తోంది.
వేలాదిమందికి ఆసరాగా..
ఆక్వా రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి బతుకునిస్తోంది. ఒకప్పుడు జిల్లాలో వ్యవసాయ రంగం అతిపెద్ద ఉపాధి రంగంగా ఉండేది. కొన్నేళ్లుగా ఆ స్థానాన్ని ఆక్వా ఆక్రమించించి. ఈ రంగంలో వివిధ విభాగాల్లో యువత నుంచి పెద్ద వయసు వారి వరకు అనేక మంది ఉపాధి పొందుతున్నారు.
యువతలో ఆందోళన..
అనేక మంది ఉన్నత చదువులు చదివినవారు ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాల్లేక ప్రైవేటు రంగంలోకి వస్తున్నారు. ఆక్వా రంగం ఎందరో యువతకు మేతల కంపెనీల ప్రమోటర్లుగా, వ్యాధి నిర్ధారణ నిపుణులుగా, రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాల్లో టెక్నీషియన్లుగా, ఔషధాల కంపెనీల ఎగ్జిక్యూటివ్లుగా.. ఉన్నారు. ఆక్వా రంగం సంక్షోభంలో చిక్కుకోవడంతో ఈ సంస్థలన్నీ తమ కార్యకలాపాలను ఎక్కడికక్కడ నిలిపివేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఆయా విభాగాల్లో పనిచేస్తున్నవారు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళనకు గురవుతున్నారు.
అనుబంధ సంస్థలకూ ఇబ్బందే..
సంక్షోభం తీవ్రమైతే ఆక్వారంగానికి అనుబంధ సంస్థలైన రొయ్యపిల్లల ఉత్పత్తి కేంద్రాలు, వ్యాధి నిర్ధారణ, ల్యాబ్లు, ఐస్ పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఉంది. ఆధారిత కుటుంబాలకు ఇది పెద్ద కుదుపే అవుతుంది. మంగళవారం ఆక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆక్వా పరిశ్రమకు ప్రోత్సాహం కోరుతూ అమాలాపురంలో బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. డీఆర్వో సత్తిబాబుకు వినతిపత్రం ఇచ్చారు.
కారణాలు ఇవే..
మన రాష్ట్రం నుంచి విదేశాలకు అప్పుడప్పుడూ రొయ్యల ఎగుమతులు నిలిచినా వారంపది రోజుల్లో మళ్లీ పుంజుకోవడంతో పెద్దగా సమస్యలు ఉత్పన్నమయ్యేవి కావు. కొన్ని నెలలుగా థాయ్లాండ్, అమెరికా, చైనా వంటి దేశాలకు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో ఈ సంక్షోభ పరిస్థితి నెలకొందని నిపుణులు పేర్కొంటున్నారు.
దేశీయ వినియోగం పెరగాలి
విదేశాలకు మనం ఏటా 3లక్షల టన్నుల రొయ్యలు ఎగుమతి చేస్తున్నాం. దీనిలో 50శాతం స్వదేశీ వినియోగం ఉన్నా.. ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చేదికాదు. రొయ్యలు తినడం వల్ల వ్యాధుల బారినపడతామని ప్రజల్లో అపోహ ఉంది. దానిని నివృత్తి చేసేందుకే మంగళవారం అమలాపురంలో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాం. ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రోత్సాహం అందించాలి.
పి.రత్నరాజు, అమలాపురం ఆక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు
క్షేత్రస్థాయిలో అండగా నిలవాలి..
ప్రస్తుత పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో రైతులకు అండగా నిలిస్తేనే సంక్షోభం నుంచి బయటపడే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు, నాయకులు స్పందించి విదేశాలకు ఎగుమతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలి.
శ్రీహరి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోసపు దీవెన.. సొమ్మురాక వేదన
[ 25-04-2024]
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తామని... దాని కోసం విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. -
ప్రతి గొంతూ జేజేలు
[ 25-04-2024]
నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి. జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి. -
నియమావళికి సెలవిచ్చి.. మంత్రి హామీకి విలువిచ్చి..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు హడావుడిగా జిల్లావ్యాప్తంగా అనేక పనులకు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు శంకుస్థాపనలు చేశారు. వీటిలో కొన్ని పనులు నేటికీ ప్రారంభించనేలేదు. -
జగన్.. మాపై ఎందుకింత కక్ష?
[ 25-04-2024]
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. -
సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
[ 25-04-2024]
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. -
కొవ్వూరు వైకాపాలో రగడ
[ 25-04-2024]
కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. -
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారంతో ముగియనుంది. పోటీచేసే అభ్యర్థుల నుంచి చివరిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్
[ 25-04-2024]
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం
[ 25-04-2024]
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్ వాపోయారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
[ 25-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ ఓ పౌరుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో జై భారత్ -
నన్నయలో ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కమిటీ సభ్యుల పర్యటన
[ 25-04-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా పథకానికి సంబంధించిన పనులను కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. -
భీమేశ్వరుని గర్భాలయం మూసివేత
[ 25-04-2024]
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్