యువతా మేలుకో... ఓటు నమోదు చేసుకో..
ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ-2023కు ఇక రెండు రోజులే గడువుంది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత నెల తొమ్మిది నుంచి ఓటు నమోదు, చేర్పులు, మార్పులు, ఓటు తొలగింపు, బదిలీ, తొలగింపునకు దరఖాస్తులు స్వీకరిస్తుండగా దీనికి ఈ నెల 8 వరకు అవకాశం ఉంది.
న్యూస్టుడే, వి.ఎల్.పురం (రాజమహేంద్రవరం), కడియం
ఓటు నమోదుపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఎన్నికల నమోదు అధికారి దినేష్కుమార్(పాత చిత్రం)
ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ-2023కు ఇక రెండు రోజులే గడువుంది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత నెల తొమ్మిది నుంచి ఓటు నమోదు, చేర్పులు, మార్పులు, ఓటు తొలగింపు, బదిలీ, తొలగింపునకు దరఖాస్తులు స్వీకరిస్తుండగా దీనికి ఈ నెల 8 వరకు అవకాశం ఉంది. ఓటరుగా నమోదు చేయించుకునే విషయంలో యువత కొంచెం వెనుకబడి ఉంది.
జిల్లాలో 18-19 మధ్య వయస్సున్న యువత 48 వేల మంది ఉండగా వీరిలో 7,800 మంది మాత్రమే ఓటరుగా నమోదు అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు. యువతకు ఓటు హక్కు కల్పించే ఉద్దేశంతో ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
ఇదీ పరిస్థితి
జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 1,559 పోలింగ్ కేంద్రాల పరిధిలో 15,41,332 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 7,56,380 మంది, మహిళలు 7,84,833 మంది, ఇతరులు 119 మంది ఉన్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ప్రస్తుతం ఇంటింటికీ వెళ్లి బీఎల్వోల ద్వారా వివరాల నమోదు కోసం ప్రత్యేక సర్వే ప్రక్రియ నిర్వహిస్తున్నారు. గత నెల 9 నుంచి ఇప్పటివరకు 17,854 మంది దరఖాస్తులు అందించగా వీటిలో కొత్తగా ఓటు నమోదుకు దరఖాస్తు చేసినవారు 8,984 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 3, 4 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద నిర్వహించిన ప్రత్యేక శిబిరాల్లో ఓటు నమోదు, మార్పులు, చేర్పులు, బదిలీలకు మొత్తం 7,688 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.
ఆన్లైన్లోనూ అవకాశం
కొత్తగా ఓటు నమోదుకు ఈ రెండ్రోజుల్లో దరఖాస్తు చేసుకున్న యువతకు వచ్చే ఏడాది జనవరి 5న ప్రచురించే జిల్లా తుది ఓటర్ల జాబితాలో ఓటుహక్కు కల్పిస్తారు. ఆన్లైన్లోనూ www.nvsp.in వెబ్సైట్ ద్వారా, ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా ఓటు నమోదుకు అవకాశం ఉంది. వచ్చేనెల 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువత ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనిని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ యాత్రన.. జనం యాతన
[ 19-04-2024]
విద్యుత్తు కట్.. అంతర్జాలం బంద్.. దుకాణాల మూత.. సామాన్యుల వాహనాలకు తోడు అంబులెన్సులు సైతం నిలిపివేత.. గంటలపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. -
ఎన్నికల వేళ యువతా.. అప్రమత్తం
[ 19-04-2024]
ఎన్నికల వేళ యవత మరిన్ని జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలిచారని బైక్ ర్యాలీల్లో పాల్గొనడం, ప్రత్యర్థులతో ఘర్షణకు దిగడం వంటివి ఎంతమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. -
అసలేం జరుగుతోంది..?
[ 19-04-2024]
ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్ పెట్టి తెప్పించేస్తారు. -
జిల్లాకు రానున్న ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారు. వీరికి అనుసంధానంగా లైజనింగ్, ఇతర సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
తొలిరోజు ఏడు నామినేషన్ల దాఖలు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకాగా తొలిరోజు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. -
పాదయాత్ర అబద్ధాలతో దండయాత్ర
[ 19-04-2024]
పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను. -
తొలిరోజు నామినేషన్ల సందడి
[ 19-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు. -
పేపరుమిల్లు కార్మికుల ఆందోళన
[ 19-04-2024]
సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్ గురువారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్మిల్లుకు చేరుకున్న సమయంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 రోజులుగా వేతన ఒప్పందం కోరుతూ సమ్మె చేస్తున్నా పేపర్మిల్లు యాజమాన్యం స్పందించడం లేదని నినాదాలు చేశారు. -
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది సమస్యాత్మక కేంద్రాలే. పోలింగ్ ముగిసే వరకు అధికారుల దృష్టంతా వాటిపైనే ఉంటుంది. -
అద్దె చెల్లించక అగచాట్లు
[ 19-04-2024]
వైకాపా పాలనలోని గత అయిదేళ్లలో అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు కేవలం నోటి మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు
[ 19-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన నుంచి గండేపల్లి మండలంలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆ పార్టీ నాయకుల అండదండలతో కొన్ని లే ఔట్లను ఏర్పాటు చేసి అక్రమంగా మెరక చేశారు. -
‘ఆత్మ’సాక్షి లేదా.. అన్నదాతంటే పడదా..!
[ 19-04-2024]
సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి