శ్రీవారికి సిరులు.. భక్తులకు వసతులు
కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని దర్శించుకున్నా..స్వామికి సేవ చేసినా వారి జీవితాలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతాయని భక్తుల విశ్వాసం. అందుకే స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది.
న్యూస్టుడే, ఆత్రేయపురం
వాడపల్లి దేవాలయం
కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని దర్శించుకున్నా..స్వామికి సేవ చేసినా వారి జీవితాలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతాయని భక్తుల విశ్వాసం. అందుకే స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. భక్తుల అవసరాలు తీర్చేలా అనేక మంది దాతలు ముందుకొచ్చి దేవస్థానం అభివృద్ధికి సహకరిస్తున్నారు. ఆలయంలో కల్యాణ మండపం, గ్రానైట్ నిర్మాణ పనుల దగ్గర్నుంచి, బంగారు వస్తువులు చేయించడం, నిత్యాన్నదానానికి భారీగా విరాళాలు అందుతున్నాయి.
నిత్యాన్నదాన పథకానికి వచ్చిన విరాళాల సొమ్ము రూ.6.67 కోట్లు బ్యాంకుల్లో ఉంది. దీనిపై వచ్చే వడ్డీతోనే 2004 నుంచి అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. రూ.లక్ష పైబడి ఇచ్చే దాతలను మహారాజ పోషకులుగా, రూ.50 వేల నుంచి రూ.లక్షలోపు ఇచ్చేవారిని రాజ పోషకులుగా గుర్తిస్తారు. ఒక్క శనివారం రోజునే 15 నుంచి 20వేల మందికి అన్నసంతర్పణ చేస్తున్నారు.
భూరి దాతల్లో కొందరు..
* రథం ఏర్పాటుకు వంక నరేంద్రబాబు (మండపేట) రూ.5.40 కోట్లు విరాళం
* అన్నప్రసాద నిర్వహణకు శ్రీవేంకటేశ్వర జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ (రాజమహేంద్రవరం) వారు 21 సెంట్ల భూమి (అప్పట్లో రూ.3.25 లక్షలు విలువ)
* రూ.70 లక్షలతో బంగారు కిరీటం- సత్తి బాంగార్రెడ్డి (గోపాలపురం)
* కొత్తపేటకు చెందిన బొరుసు భాస్కరరావు బంగారు పాదాలు అందించారు.
* రూ.50 లక్షలతో కల్యాణ మండపం
- గుత్తేదారుల సంఘం
తక్షణ అవసరాలివీ..
* ఏడు వారాల భక్తుల ప్రదక్షిణాలు చేసేందుకు అనువుగా మాడ వీధులను అభివృధ్ది చేయాలి
* దూర ప్రాంతాల భక్తులకు విశ్రాంతి గదులు, డార్మిటరీ సదుపాయం
* నిత్యాన్నదాన కేంద్రంలో రద్దీ సమయాల్లో భక్తులకు విశాలంగా కూర్చుని తినేలా సదుపాయం
* భక్తుల మౌలిక వసతులు తాగునీరు, మరుగుదొడ్లు
* ఎల్లవేళలా పటిష్ఠ నిఘా నేత్రాల నడుమ భక్తులకు భద్రత.
దాతలు నిర్మించిన కల్యాణ మండపం
అంచెలంచెలుగా అభివృద్ధి పథాన..
పదేళ్లుగా దేవస్థానం ఆదాయం అంచెలంచెలుగా పెరుగుతూ వస్తోంది. ఆలయం ఈవో స్థాయి నుంచి డిప్యూటీ కమిషనర్ స్థాయికి పెరిగింది. 2017లో ఈవో బాధ్యతలుగా చేపట్టిన తరువాత 8 ఎకరాలు భూమికి రూ.56 లక్షలతో 40 అడుగుల రహదారి మార్గం కోసం భూమి కొనుగోలు చేసి ఆలయానికి బయట వ్యక్తుల జోక్యం లేకుండా చేశాం. అలాగే అదే పొలంలో రూ.కోటి వ్యయంతో పార్కింగ్ మెరక చేసి తీర్చిదిద్దాం. అనంతరం రూ.4 కోట్లతో ప్రాకార మండపం నిర్మించాం. 92-93లో దేవస్థానానికి కేవలం రూ.1.85 లక్షలు ఉండే ఆదాయం నేడు ఏడాదికి రూ.9కోట్లకు చేరిందన్నారు. ఆలయ అభివృద్ధికి దేవస్థానం పాలకమండలి అందిస్తున్న చేయూత మరువలేనిది.
ఎం.సత్యనారాయణరాజు, ఈవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ యాత్రన.. జనం యాతన
[ 19-04-2024]
విద్యుత్తు కట్.. అంతర్జాలం బంద్.. దుకాణాల మూత.. సామాన్యుల వాహనాలకు తోడు అంబులెన్సులు సైతం నిలిపివేత.. గంటలపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. -
ఎన్నికల వేళ యువతా.. అప్రమత్తం
[ 19-04-2024]
ఎన్నికల వేళ యవత మరిన్ని జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలిచారని బైక్ ర్యాలీల్లో పాల్గొనడం, ప్రత్యర్థులతో ఘర్షణకు దిగడం వంటివి ఎంతమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. -
అసలేం జరుగుతోంది..?
[ 19-04-2024]
ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్ పెట్టి తెప్పించేస్తారు. -
జిల్లాకు రానున్న ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారు. వీరికి అనుసంధానంగా లైజనింగ్, ఇతర సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
తొలిరోజు ఏడు నామినేషన్ల దాఖలు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకాగా తొలిరోజు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. -
పాదయాత్ర అబద్ధాలతో దండయాత్ర
[ 19-04-2024]
పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను. -
తొలిరోజు నామినేషన్ల సందడి
[ 19-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు. -
పేపరుమిల్లు కార్మికుల ఆందోళన
[ 19-04-2024]
సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్ గురువారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్మిల్లుకు చేరుకున్న సమయంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 రోజులుగా వేతన ఒప్పందం కోరుతూ సమ్మె చేస్తున్నా పేపర్మిల్లు యాజమాన్యం స్పందించడం లేదని నినాదాలు చేశారు. -
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది సమస్యాత్మక కేంద్రాలే. పోలింగ్ ముగిసే వరకు అధికారుల దృష్టంతా వాటిపైనే ఉంటుంది. -
అద్దె చెల్లించక అగచాట్లు
[ 19-04-2024]
వైకాపా పాలనలోని గత అయిదేళ్లలో అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు కేవలం నోటి మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు
[ 19-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన నుంచి గండేపల్లి మండలంలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆ పార్టీ నాయకుల అండదండలతో కొన్ని లే ఔట్లను ఏర్పాటు చేసి అక్రమంగా మెరక చేశారు. -
‘ఆత్మ’సాక్షి లేదా.. అన్నదాతంటే పడదా..!
[ 19-04-2024]
సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత