సభకు రైట్ రైట్.. ప్రయాణికులకు హోల్డాన్!
ఆర్టీసీ బస్సుల కోసం బుధవారం గంటల తరబడి ప్రయాణికులు బస్టాండ్లలో నిరీక్షించక తప్పలేదు. కొన్ని రూట్లలో సర్వీసుల కుదింపుతో రాకపోకలకు అవస్థలు పడ్డారు.
రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రయాణికుల నిరీక్షణ
న్యూస్టుడే, వి.ఎల్.పురం(రాజమహేంద్రవరం): ఆర్టీసీ బస్సుల కోసం బుధవారం గంటల తరబడి ప్రయాణికులు బస్టాండ్లలో నిరీక్షించక తప్పలేదు. కొన్ని రూట్లలో సర్వీసుల కుదింపుతో రాకపోకలకు అవస్థలు పడ్డారు. విజయవాడలో బుధవారం జరిగిన వైకాపా జయహో బీసీ మహా సభకు జిల్లాలోని నాలుగు డిపోల నుంచి 34 బస్సులు పంపడంతో కొన్ని రూట్లలో షెడ్యూల్ సర్వీసులను కుదించి ఉన్నవి సర్దుబాటు చేసి నడిపారు. దీంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
నాన్స్టాప్ కౌంటర్ వద్ద క్యూలో ప్రయాణికులు
కాకినాడ, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి ఈ జిల్లాకు వచ్చే సర్వీసులు కూడా తగ్గడంతో సకాలంలో గమ్యస్థానాలకు చేరలేని పరిస్థితి నెల్కొనడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. షెడ్యూల్ సర్వీసులు కుదింపుతో రాజోలు, అమలాపురం, రామచంద్రపురం, తుని, కాకినాడ నుంచి ద్వారపూడి మీదుగా రాజమహేంద్రవరం వచ్చే బస్సుల కోసం రాజమహేంద్రవరం కాంప్లెక్స్లో ప్రయాణికులు ఎక్కువ సమయం పడిగాపులు పడాల్సి వచ్చింది. ఆర్టీసీ అధికారులు మాత్రం షెడ్యూల్ సర్వీసులు తగ్గించలేదని, అదనంగా ఉన్న బస్సులనే విజయవాడకు పంపించామని చెప్పడం విశేషం.
గంటపాటు ఎదురుచూసినా...
-ఆనందరావు
తాడేపల్లిగూడెం నుంచి రాజమహేంద్రవరం బస్సులో వచ్చా. ఇక్కడ బస్సు మారి తుని వెళ్లాలి. గంటపాటు ఎదురుచూశా. తాడేపల్లిగూడెంలోనూ వెంటనే బస్సు దొరకలేదు. ఇప్పుడు ఇక్కడా అదే పరిస్థితి.
ఇబ్బంది పెట్టడం సరికాదు...
- కృష్ణ
సామాన్య ప్రజల రాకపోకలకు ఆర్టీసీ బస్సులే ఆధారం. ఆర్టీసీ బస్సులను పార్టీ సభలకు పంపించి ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం సరికాదు. సకాలంలో బస్సులు అందుబాటులో లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నేను ఇక్కడి నుంచి కాకినాడ వెళ్లేందుకు గంటకు పైగా నిరీక్షించా. ఇంజిన్ సమస్యతో బస్సు ఆగిపోవడంతో ఇంకొక బస్సు సర్వీసు వరకు వేచిఉండాల్సి వచ్చింది.
చాలాసేపు క్యూలోనే...
- రాజు
రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వెళ్లడానికి నాన్స్టాప్ కౌంటర్లో టికెట్ తీసుకునేందుకు క్యూలైనులో చాలాసేపు నిరీక్షించా. కొన్ని బస్సులు తగ్గిపోవడంతో ఏ నంబరు సర్వీసు బస్సు వస్తుందో తెలియక అది వచ్చే వరకు టికెట్లు ఇవ్వని పరిస్థితి. దీంతో కౌంటర్ వద్ద నిరీక్షించాల్సి వచ్చింది. ఆర్టీసీ బస్సులను ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తే రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వస్తుందన్న విషయం తెెలుసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ యాత్రన.. జనం యాతన
[ 19-04-2024]
విద్యుత్తు కట్.. అంతర్జాలం బంద్.. దుకాణాల మూత.. సామాన్యుల వాహనాలకు తోడు అంబులెన్సులు సైతం నిలిపివేత.. గంటలపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. -
ఎన్నికల వేళ యువతా.. అప్రమత్తం
[ 19-04-2024]
ఎన్నికల వేళ యవత మరిన్ని జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలిచారని బైక్ ర్యాలీల్లో పాల్గొనడం, ప్రత్యర్థులతో ఘర్షణకు దిగడం వంటివి ఎంతమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. -
అసలేం జరుగుతోంది..?
[ 19-04-2024]
ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్ పెట్టి తెప్పించేస్తారు. -
జిల్లాకు రానున్న ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారు. వీరికి అనుసంధానంగా లైజనింగ్, ఇతర సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
తొలిరోజు ఏడు నామినేషన్ల దాఖలు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకాగా తొలిరోజు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. -
పాదయాత్ర అబద్ధాలతో దండయాత్ర
[ 19-04-2024]
పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను. -
తొలిరోజు నామినేషన్ల సందడి
[ 19-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు. -
పేపరుమిల్లు కార్మికుల ఆందోళన
[ 19-04-2024]
సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్ గురువారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్మిల్లుకు చేరుకున్న సమయంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 రోజులుగా వేతన ఒప్పందం కోరుతూ సమ్మె చేస్తున్నా పేపర్మిల్లు యాజమాన్యం స్పందించడం లేదని నినాదాలు చేశారు. -
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది సమస్యాత్మక కేంద్రాలే. పోలింగ్ ముగిసే వరకు అధికారుల దృష్టంతా వాటిపైనే ఉంటుంది. -
అద్దె చెల్లించక అగచాట్లు
[ 19-04-2024]
వైకాపా పాలనలోని గత అయిదేళ్లలో అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు కేవలం నోటి మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు
[ 19-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన నుంచి గండేపల్లి మండలంలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆ పార్టీ నాయకుల అండదండలతో కొన్ని లే ఔట్లను ఏర్పాటు చేసి అక్రమంగా మెరక చేశారు. -
‘ఆత్మ’సాక్షి లేదా.. అన్నదాతంటే పడదా..!
[ 19-04-2024]
సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్