రాయితీ విత్తనాల ఊసేలేదు
ఎరువులు, పురుగు మందులతోపాటు రాయితీపై విత్తనాలు ఇస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు.
న్యూస్టుడే, సీతానగరం
గోకవరంలో మొక్కజొన్న సాగు
ఎరువులు, పురుగు మందులతోపాటు రాయితీపై విత్తనాలు ఇస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్బీకేలు నామమాత్రంగా మారాయి. ప్రస్తుతం ఖరీఫ్ వరి పంట కోతలు కోసి ధాన్యం ఒబ్బిడి చేస్తూనే రబీ సాగు ప్రారంభించారు. వాస్తవానికి ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం రైతులకు అవసరమైన విత్తనాలు అందించాల్సి ఉంది. రైతు భరోసా కేంద్రాల్లో వరి, మొక్కజొన్న, తెల్లజొన్న, మినుము, పెసర విత్తనాలు అందిస్తామని చెప్పినా అందుబాటులో ఉంచలేదు. దీంతో ప్రైవేటు వ్యాపారుల వద్దనే అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
రబీలోనూ అంతే విస్తీర్ణం..
డివిజన్ పరిధిలోని రాజానగరం, రాజమహేంద్రవరం గ్రామీణం, అనపర్తి నియోజకవర్గాలతోపాటు గోకవరం, కడియం మండలాల్లో ఖరీఫ్లో సాధారణ సాగు విస్తీర్ణం 1.42 లక్షల ఎకరాలుగా ఉంది. రబీలో దాదాపుగా 85 ఎకరాల్లో వరి, మొక్కజొన్న అపరాలు వేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. వ్యవసాయశాఖ నివేదికల ప్రకారం అత్యధికంగా మొక్కజొన్న, వరి, అపరాలు ఉన్నాయి. గతంలో వరితోపాటు మొక్కజొన్న, అపరాలకు రాయితీ ఉండేది. రైతులకు అందుబాటులోకి తెచ్చిన కియోస్కో పరికరాలు, డి.కృషి యాప్లు నిరుపయోగంగా మారాయి. వీటిల్లో నమోదు చేసుకుంటే చాలు రైతులకు విత్తనాలు ఇస్తామనే ప్రచారం నిలిచిపోయింది. రూ.లక్షలు విలువ చేసే పరికరాలు పలు ఆర్బీకేల్లో మూలకు చేరాయి.
నీరు అందుబాటులో ఉంటే..
వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు బీకే మల్లికార్జునరావు
రబీ సాగు సమయంలో ఎత్తిపోతల నుంచి సాగునీటి సరఫరా ఉండదు. భూగర్భ జలం అందుబాటులో ఉండి, వ్యవసాయ బోర్లు, ఆయిల్ ఇంజిన్లు ఉన్న రైతులంతా రబీలో మొక్కజొన్న, తెల్లజొన్న విత్తుతున్నారు. నీరు అందదేమో అని భావించేవారు మినుము, పెసర అపరాలు వేసేలా భూములను సిద్ధం చేసుకున్నారు. కోరుకొండ, సీతానగరం, గోకవరం మండలాల్లో అత్యధికంగా మొక్కజొన్న సాగు చేస్తారు. గతేడాది రబీలో వేసిన మొక్కజొన్నకు క్వింటాకు రూ.2వేలకు పైబడి ధర వచ్చింది. ఈ ఏడాది చాలా మంది రైతులు దాన్నే నమ్ముకున్నారు. 40వేల ఎకరాలకు పైబడి మొక్కజొన్న, తెల్లజొన్న సాగు ఉంటుంది. ప్రభుత్వం నుంచి రాయితీ విత్తనాలు రావడం లేదని తెలిసిన ప్రైవేటు వ్యాపారులు మొక్కజొన్న విత్తనాల ధరలు పెంచి అమ్ముతున్నారు. 4 కేజీల ప్యాకెట్ ధర రూ.1200-1500 మధ్య ఉంది. గతేడాది కంటే రూ.300 పెంచినట్లు రైతులు చెబుతున్నారు. గతంలో మొక్క జొన్న కిలోకు రూ.80 చొప్పున, అపరాలకు 50 శాతం రాయితీ ఉండేది. వరి, మొక్కజొన్న విత్తనాలు రాయితీపై లేవని అపరాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని కోరుకొండ వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు బీకే మల్లికార్జునరావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోసపు దీవెన.. సొమ్మురాక వేదన
[ 25-04-2024]
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తామని... దాని కోసం విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. -
ప్రతి గొంతూ జేజేలు
[ 25-04-2024]
నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి. జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి. -
నియమావళికి సెలవిచ్చి.. మంత్రి హామీకి విలువిచ్చి..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు హడావుడిగా జిల్లావ్యాప్తంగా అనేక పనులకు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు శంకుస్థాపనలు చేశారు. వీటిలో కొన్ని పనులు నేటికీ ప్రారంభించనేలేదు. -
జగన్.. మాపై ఎందుకింత కక్ష?
[ 25-04-2024]
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. -
సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
[ 25-04-2024]
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. -
కొవ్వూరు వైకాపాలో రగడ
[ 25-04-2024]
కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. -
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారంతో ముగియనుంది. పోటీచేసే అభ్యర్థుల నుంచి చివరిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్
[ 25-04-2024]
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం
[ 25-04-2024]
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్ వాపోయారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
[ 25-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ ఓ పౌరుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో జై భారత్ -
నన్నయలో ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కమిటీ సభ్యుల పర్యటన
[ 25-04-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా పథకానికి సంబంధించిన పనులను కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. -
భీమేశ్వరుని గర్భాలయం మూసివేత
[ 25-04-2024]
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం