జయహో బాలిక... భయమే లేదిక!
అవనిలో సగం ఆమె అయినప్పటికీ అడుగడుగునా అభద్రత. తమ చుట్టూ ఉన్న వారిలో ఎవరు స్నేహితులు.. ఎవరు ఆప్తులు అనేది తెలుసుకోవడంలో తడబాటు.
న్యూస్టుడే, రాజమహేంద్రవరం సాంస్కృతికం
బాలికకు శానిటరీ నాప్కిన్లు అందిస్తున్న జయశ్రీ తదితరులు
అవనిలో సగం ఆమె అయినప్పటికీ అడుగడుగునా అభద్రత. తమ చుట్టూ ఉన్న వారిలో ఎవరు స్నేహితులు.. ఎవరు ఆప్తులు అనేది తెలుసుకోవడంలో తడబాటు. తనను తాకిన చేతి స్పర్శలోని మంచి, చెడుల తారతమ్యం తెలియక తికమక. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు అమ్మాయిలకు విజ్ఞానం కచ్చితంగా అవసరం. లయన్స్ క్లబ్ సేవల్లో భాగంగా ‘జయహో మహిళ’ పేరుతో (ఉమెన్ సింపోజియం) జిల్లా ఛైర్పర్సన్ నేరెళ్ల జయశ్రీ, పలువురు సభ్యులు ఉభయ గోదావరి జిల్లాల్లోని పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థినులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపుతున్నారు.
జయహో మహిళ కార్యక్రమంలో భాగంగా.. అమ్మాయిలు చదువుకునే చోట ఎదురయ్యే సమస్యలు గురించి సంబంధిత రంగాల్లో నిష్ణాతులతో అవగాహన కల్పిస్తారు. గతంలో కొన్ని ప్రాంతాల్లో బంధువులు, స్నేహితులు, ప్రేమ పేరుతో జరిగిన వంచనలను ఉదాహరణగా వివరిస్తారు. విద్యాలయాలకు వెళ్లే దారిలో ఆకతాయిలతో ఇబ్బందులు ఎదురైతే తక్షణం ఎవరిని సంప్రదించాలో చెబుతారు. సమీపంలోని పోలీస్ స్టేషన్, సచివాలయం, గ్రామపెద్దలు, వాలంటీర్లు వంటి ప్రభుత్వ అధికారుల సహకారం ఎలా పొందాలి... భయంతో విషయం దాచకుండా ఇంట్లో తల్లిదండ్రులకు ఎలా చెప్పాలి వంటివి చెబుతారు.
పిల్లలకు అవగాహన కల్పిస్తున్న సీనియర్ న్యాయవాది పద్మావతి
విద్యాలయాలే వేదికగా...
జిల్లాలోని పి.వెంకటాపురంలోని బి.ఆర్.అంబేడ్కర్ గురుకులంలో బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించి వారికి అవసరమైన వస్తువులను పంపిణీ చేశారు. ఏజెన్సీలో గంగవరం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాలలో యుక్తవయసు బాలికలు స్వీయ రక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. మనోవికాసం, న్యాయం, వైద్యం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. బొమ్మూరు అంబేడ్కర్ పాఠశాల, పిడింగొయ్యి పాఠశాల, పండూరు ఆశ్రమ పాఠశాల, జిల్లాలోని పలు వసతి గృహాలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతినెలా రెండుచోట్ల క్లబ్ సభ్యులు ఓ బృందంగా వెళ్లి కార్యక్రమాలు చేపట్టి పిల్లల్లో ధైర్యం నింపుతారు.
విద్యతోనే భవిత..
- బి.పద్మావతి, సీనియర్ న్యాయవాది
అమ్మాయిలు విద్యలో రాణించి చక్కని భవితకు బాటలు వేసుకోవాలి. తల్లిదండ్రుల ఇష్టాలను గౌరవిస్తూ ఇష్టమైన రంగంలో విజయం సాధించేందుకు కృషి చేయాలి. క్రమశిక్షణతో ముందుకు సాగడం ద్వారా అనుకున్న గమ్యం చేరుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సమస్యలు ఎదురైనపుడు ధైర్యంగా వాటిని కన్నవారి సాయంతో అధిగమించాలి.
భద్రత అవసరం తెలుపుతూ..
- నేరెళ్ల జయశ్రీ, జిల్లా లయన్స్ ఉమెన్ సింపోజియం ఛైర్పర్సన్
మోసం చేసేవారు ప్రతి చోటా ఉంటారు. బాలికల నుంచి మహిళల వరకు ప్రతి దశలో భద్రత అవసరత ఉంటుంది. అందుకే చిన్నతనం నుంచి వారిలో ఆత్మస్థైర్యం నింపాలి. ఇంట్లో కన్నవారి నుంచి మొదలైన బాధ్యత విద్యాలయాల్లో గురువుల వరకు తీసుకోవాలి. ఈ ఏడాది మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో న్యాయవాదులు, విజ్ఞానవంతుల ద్వారా సదస్సులు నిర్వహించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నవరంలో నూతన ధ్వజస్తంభ పనులకు శ్రీకారం
[ 28-03-2024]
అన్నవరం దేవస్థానంలో అనివేటి మండపంలో బంగారు తాపడంతో నూతన ధ్వజస్తంభం ఏర్పాటుకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి గురువారం శ్రీకారం చుట్టారు. -
అనపర్తి బరిలో విశ్రాంత సైనికుడు
[ 28-03-2024]
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అనపర్తి నియోజకవర్గం తెదేపా, భాజపా, జనసేన కూటమి అభ్యర్థిగా విశ్రాంత జవాన్ ములగపూడి శివకృష్ణంరాజు పేరును అధిష్ఠానం బుధవారం రాత్రి ప్రకటించింది. -
ఓరి దేవుడా.. వీళ్లు మారరా..?
[ 28-03-2024]
రెండు చేతులు ఎత్తి భక్తితో మొక్కాల్సిన దేవుడిపైనా ఎందుకో కక్ష.. దైవ సన్నిధిలో భక్తితో మెలగాలన్న కనీస విజ్ఞత మరచి భక్తుల ఎదుటే బూతు పురాణం.. అర్చకులపై దాడి.. గడచిన అయిదేళ్లలో వరస సంఘటనలు ప్రభుత్వ వైఫల్యాన్ని, శాంతిభద్రతల పర్యవేక్షణ -
ఎన్నికలొస్తున్నాయి ఆపేయండి.. రూ.కోట్లు పెట్టాం కుదరదు!
[ 28-03-2024]
ఎన్నికలకు ఇంకా 47 రోజులే సమయం ఉంది. అయిదేళ్లుగా చేపట్టిన ఇసుక తవ్వకాల వల్ల ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాం.. ఇకనైనా తవ్వకాలు నిలిపి.. సహకరించండి.. -
కలెక్టర్ చెప్పినా ఖాతరు లేదు!
[ 28-03-2024]
రూ.వేలకు వేలు పెట్టుబడులు పెట్టాం.. చుక్క నీరు లేదు.. చావే శరణ్యం.. కష్టకాలంలో ఉన్నాం ఆదుకోండి మహా ప్రభో అంటూ కార్యాలయాల చుట్టూ తిరిగాం.. అధికారులకు వేదన వినిపించాం.. -
2,400 ఇళ్ల రద్దు
[ 28-03-2024]
జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో మంజూరు చేసిన గృహాల్లో 2,403 రద్దు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు పునాదులు పడని ఇళ్లను జాబితా నుంచి తొలగించారు. -
సి-విజిల్ ఫిర్యాదులపై సత్వర చర్యలు
[ 28-03-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి సీ-విజల్ యాప్కు వచ్చే ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతికాశుక్లా తెలిపారు. -
‘జగన్ను ఇంటికి పంపడమే కూటమి లక్ష్యం’
[ 28-03-2024]
అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన జగన్ను ఇంటికి పంపడమే తెదేపా, జనసేన, భాజపా కూటమి లక్ష్యమని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. -
కొంటారా.. కొర్రీలు వేస్తారా..?
[ 28-03-2024]
గత రెండేళ్లుగా రబీలో బొండాలు (ఎంటీయూ 3626) రకం ధాన్యం కొనుగోలుపై అయోమయం నెలకొంటోంది. ఈ రకం సాగు చేయొద్దని.. చేస్తే ధాన్యం కొనుగోలు చేయమని రెండేళ్ల కిందట వ్యవసాయ, పౌరసరఫరా శాఖల అధికారులు రైతులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. -
వాత్సల్యం చూపలేదు..!
[ 28-03-2024]
కె.గంగవరం మండలం కుడుపూరుకు చెందిన వీధి జీవన్బాబు తల్లిదండ్రులను కోల్పోయి తాతయ్య మందపల్లి వెంకట్రావు వద్ద పెరుగుతున్నాడు. ప్రస్తుతం దంగేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. -
ఎన్నికల ఏర్పాట్లపై నియోజకవర్గాల వారీగా నివేదికలు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణకు సంబంధించి నియోజకవర్గాల వారీగా నివేదికలు పంపించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. -
జగనన్నకాలనీలో యువకుడిని బలిగొన్న విద్యుత్తు తీగలు
[ 28-03-2024]
జగనన్నకాలనీలో చేతికందే ఎత్తులో ఉన్న అధిక సామర్థ్యపు విద్యుత్తు తీగ తగిలి పెయింటింగ్ పనులు చేసే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. -
నల్లమిల్లికి టికెట్ కేటాయించలేదని నిరసన
[ 28-03-2024]
అనపర్తి నియోజకవర్గానికి బుధవారం రాత్రి భాజపా అభ్యర్థి పేరు ప్రకటించిన వెంటనే తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. -
వైకాపా ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్ బ్యాచ్తో సంబంధం
[ 28-03-2024]
రాజమహేంద్రవరంలో అధికార వైకాపాకి చెందిన ఓ ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్ బ్యాచ్తో కూడా సంబంధాలు ఉన్నాయని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నగర ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. -
‘వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారు’
[ 28-03-2024]
వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారని సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైకాపా సీనియర్ నాయకుడు అల్లు విజయ్ కుమార్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..