Sasikala: శశి‘కల’ చెదిరి..
విశాఖపట్నం పరిధిలోని దువ్వాడ రైల్వే స్టేషన్లో బోగీ - ప్లాట్ఫామ్కు మధ్య చిక్కుకుపోయి తీవ్ర గాయాలపాలైన అన్నవరం యువతి ఎం.శశికళ (22) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం తీవ్ర విషాదం నింపింది.
ఒక్కగానొక్క బిడ్డ..
ఆ పలుకే అపురూపం
ఆటపాటల్లో చురుకు..
అక్షర పథంలో మెరుపు..
మేటిగా చదవాలనే కాంక్ష..
దీటుగా ఎదగాలనే తపన..
వెళ్లి రమ్మని వెన్ను తట్టారు..
మేమున్నామని వెంటే నిలిచారు..
తడబడిన అడుగు...
తనువంతా కుదుపు...
ఘడియఘడియకూ వేదన..
గంటన్నర నరక యాతన..
బతకాలనే ఆరాటం...
బతికించాలనే పోరాటం
కర్కశ విధి.. కరుణించని క్షణమిది
అయినోళ్ల రోదన.. ఆప్తులకు వేదన
శశి‘కల’ చెదిరింది..
చదువులమ్మ కుమిలింది..
అన్నవరం, న్యూస్టుడే: విశాఖపట్నం పరిధిలోని దువ్వాడ రైల్వే స్టేషన్లో బోగీ - ప్లాట్ఫామ్కు మధ్య చిక్కుకుపోయి తీవ్ర గాయాలపాలైన అన్నవరం యువతి ఎం.శశికళ (22) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం తీవ్ర విషాదం నింపింది. దువ్వాడలో ఎంసీఏ చదువుతున్న ఆమె అన్నవరం నుంచి గుంటూరు - రాయగడ రైల్లో బుధవారం ఉదయం బయల్దేరి దువ్వాడ రైల్వే స్టేషన్లో దిగే క్రమంలో ప్రమాదం జరిగింది. రైల్వే రెస్క్యూ బృందం ప్లాట్ఫామ్పై దిమ్మలు తొలగించి.. ఆమెను బయటకు తీసి.. వెనువెంటనే ఆసుపత్రికి తరలించింది.
సమాచారం అందుకున్న తండ్రి కుటుంబసభ్యులతో కలిసి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. తన కుమార్తె పరిస్థితి చూసి గుండెలవిసేలా రోదించారు. తన కుమార్తె త్వరగా కోలుకోవాలనీ... క్షేమంగా ఇంటికి రావాలనీ... చలాకీగా ఉన్నత చదువుకు వెళ్లాలని తల్లిదండ్రులే కాదు.. కుటుంబసభ్యులు.. స్నేహితులు.. గ్రామస్థులు.. దుర్ఘటనను టీవీల్లో.. సామాజిక మాధ్యమాల్లో చూసిన వారంతా భగవంతుడిని వేడుకున్నారు. విధి చిన్న చూపు చూసింది.. ఆమెను మృత్యుఒడికి చేర్చింది.
నిన్నటి వరకు తమతోనే.. చలాకీగా ఉన్న స్నేహితురాలు శశికళ ఇక లేదని తెలిసి సహచర విద్యార్థినులు కన్నీటి పర్యంతం అయ్యారు. శశికళ 30 గంటలు మృత్యువుతో పోరాడి ఓడిపోవడంతో స్నేహితులు భోరున విలపించారు. గురువారం ఉదయం విశాఖలోని ఆసుపత్రి వద్దకు చేరుకుని శశికళతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని తల్లడిల్లారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.
హాస్టల్లో చేరేలోపే...
విశాఖలో ఆసుపత్రి వద్ద విషాదంలో కుటుంబసభ్యులు
మెరపల బాబూరావు, వెంకటలక్ష్మి ఒక్కగానొక్క కుమార్తె శశికళ. బిడ్డంటే వారికి అపురూపం. దువ్వాడలోని కళాశాలకు గత నెల 20 నుంచి తరగతులకు వెళ్తూ ప్రతి రోజు ఉదయం అన్నవరం స్టేషన్ నుంచి గుంటూరు - రాయగడ ఎక్స్ప్రెస్ ద్వారా రాకపోకలు సాగిస్తోంది. దువ్వాడలో హాస్టల్లో ఉండి చదువుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. 2020-21లో తునిలోని ఆదిత్యలో శశికళ బీసీఏ చదివింది. ఎంతో చలాకీగా ఉంటుందనీ.. బాగా చదువుతుందని కళాశాల ప్రిన్సిపల్ ‘న్యూస్టుడే’కు తెలిపారు. తమ పూర్వవిద్యార్థిని మృతితో కళాశాలలో కాసేపు మౌనం పాటించి నివాళి అర్పించారు. గ్రామంలోనూ విషాదఛాయలు అలముకున్నాయి. శశికళ మృతదేహాన్ని శుక్రవారం అన్నవరం తేనున్నారు. కడసారి చూపు కోసం కుటుంబసభ్యులు, గ్రామస్థులు, స్నేహితులు వేచి చూస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని దువ్వాడ జీఆర్పీ ఎస్సై కె.శాంతారామ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిగ్గదీయొద్దు.. నోరు మెదపొద్దు: వైకాపా నేతను కాపాడేందుకు ఎన్ని ఆపసోపాలో!
[ 29-03-2024]
తిడితే పడాలి... కొడితే భరించాలి.. అధికార పక్ష నాయకుల అరాచకాలపై నోరు మెదిపితే ఇబ్బందే. -
పనిచేయని ఏసీలు, ఫ్యాన్లు.. సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
[ 29-03-2024]
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
[ 29-03-2024]
అనపర్తి నియోజకవర్గంలో తెదేపా ఉనికి లేకుండా చేయాలనే దురుద్దేశంతో వైకాపా కుట్రకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. -
అనకొండలు.. అధికారం అండదండలు
[ 29-03-2024]
కక్ష కట్టారో.. తప్పు జరగకపోయినా.. ఎలాంటి ఫిర్యాదులు అందకపోయినా కార్యాలయాల మీదకు వచ్చి పడతారు.. బాధితులతో బలవంతంగా ఫిర్యాదులు రాయించి మరీ వెంటాడి వేధిస్తారు.. -
పవన్.. వారాహి విజయభేరి
[ 29-03-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. -
తొలి అడుగు ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం
[ 29-03-2024]
ఇంటర్మీడియట్.. విద్యార్థి భవితకు తొలి అడుగు. కెరియర్ను ఏవిధంగా తీర్చిదిద్దుకోవాలి.. ఏ కోర్సులను ఎంచుకోవాలి.. ఎలా ముందడుగు వేయాలి.. అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలి.. ఇలా ఎన్నో సందేహాలు విద్యార్థులు.. తల్లిదండ్రులకు తలెత్తుతుంటాయి. -
ఆదుకుంటున్న సీలేరు జలాలు
[ 29-03-2024]
గోదావరిలో కొన్ని రోజులుగా నీటిమట్టం క్రమంగా పడిపోతోంది. -
ప్రదర్శన దర్పం.. ప్రయోజనం దూరం
[ 29-03-2024]
వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రూపొందించిన సృజనాత్మక పరికరాల ప్రదర్శన వేదికన్నారు.. రెండు వందలకు పైగానే నమూనాలను ప్రదర్శించినట్లు ఆర్భాటంగా ప్రకటించారు. -
సంద్రంలో సమర భేరి
[ 29-03-2024]
కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట సముద్రంలో ఇండో-అమెరికన్ సంయుక్త నావికా దళాల రహస్య సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. -
ప్రచారం.. కావాలి పర్యావరణ హితం
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నా.. అది దస్త్రాలకే పరిమితమవుతోంది. -
త్రివేణి సంగమంలా కూటమి పార్టీలు పనిచేస్తాయి
[ 29-03-2024]
రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు భాజపా అభ్యర్థులను కేంద్ర నాయకత్వం నిర్ణయించిందని, అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, భాజపా ఏపీ ఎన్నికల సహబాధ్యుడు సిద్ధార్థ్నాథ్ సింగ్ శ్రేణులను కోరారు. -
పక్కాగా ఎన్నికల నియమావళి అమలు
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా అధికార యంత్రాంగంతో పోలీసు వ్యవస్థ మమేకమై పనిచేస్తుందని ఏలూరు రేంజి ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. -
ప్రాణం తీసిన సహజీవనం
[ 29-03-2024]
ఓ మహిళతో సహజీవనం కోసం మద్యం మత్తులో ఉన్న స్నేహితుడిపైనే కత్తిదూసి హత్యచేశాడో వ్యక్తి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు