logo

మహోన్నత నేతకు మహా నివాళి

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్‌ వర్ధంతిని జిల్లావ్యాప్తంగా బుధవారం నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహాల వద్ద నివాళి అర్పించి, సేవా కార్యక్రమాలు, అన్నదానాలు చేశారు.

Published : 19 Jan 2023 06:27 IST

ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళి అర్పించిన గోరంట్ల, తెదేపా నాయకులు

టి.నగర్‌(రాజమహేంద్రవరం): తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్‌ వర్ధంతిని జిల్లావ్యాప్తంగా బుధవారం నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహాల వద్ద నివాళి అర్పించి, సేవా కార్యక్రమాలు, అన్నదానాలు చేశారు. రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్‌ వద్ద విగ్రహానికి తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాళి అర్పించారు. రాజకీయాల్లో ఎన్టీఆర్‌ తనదైన ముద్ర వేశారన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో పార్టీ శ్రేణులు రక్తదానం చేశాయి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని