logo

జీవో నంబరు 1 రద్దు చేసేవరకు పోరాటం

జీవో నంబరు ఒకటిని రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని అప్రజాస్వామిక జీవో నంబరు.1 రద్దు పోరాట ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ముప్పాళ్ల సుబ్బారావు ప్రతిజ్ఞ చేశారు.

Published : 27 Jan 2023 05:31 IST

అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ముప్పాళ్ల సుబ్బారావు, తెదేపా, వామపక్షాల నాయకులు

దానవాయిపేట(రాజమహేంద్రవరం): జీవో నంబరు ఒకటిని రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని అప్రజాస్వామిక జీవో నంబరు.1 రద్దు పోరాట ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ముప్పాళ్ల సుబ్బారావు ప్రతిజ్ఞ చేశారు. ముప్పాళ్ల ఆధ్వర్యంలో గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలోని గోకవరం బస్టాండు వద్ద ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నల్ల జీవో రద్దు కోరుతూ అఖిలపక్షం నాయకులతో కలసి ధర్నా నిర్వహించారు. వామపక్షాలు, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాస్వామ్య, రాజ్యంగ వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడం, ప్రశ్నించే గొంతులను నులిమేయడంతోపాటు ప్రతిపక్షాల గొంతును నొక్కేవిధంగా ఉందని వెంటనే నల్ల జీవోను రద్దు చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తెదేపా నగర అధ్యక్షుడు రెడ్డి మణి, వామపక్షాల నాయకులు నల్లా రామారావు, విద్యార్థి సంఘం నాయకులు పవన్‌, ఎడ్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని