logo

250 అడుగుల జెండాతో నడక

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం మెళ్లూరు మీదుగా 250 అడుగుల జాతీయ జెండాతో యువకులు ముందుకు సాగారు.

Updated : 27 Jan 2023 06:23 IST

జాతీయ జెండాతో విద్యార్థులు

బిక్కవోలు, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం మెళ్లూరు మీదుగా 250 అడుగుల జాతీయ జెండాతో యువకులు ముందుకు సాగారు. దీన్ని చూసేందుకు మెళ్లూరు గ్రామస్థులు రోడ్డుపైకి వచ్చారు. రామచంద్రపురం పట్టణానికి చెందిన మోడరన్‌ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. మూడు జిల్లాలు, మూడు రంగుల జెండా అంటూ కోనసీమ జిల్లా నరసాపురపుపేట నుంచి త్రివర్ణ పతాకంతో నడక ప్రారంభించారు. అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లా మెళ్లూరు మీదుగా కాకినాడ జిల్లా వేండ్ర ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ముగించారు. దాదాపు 5 కి.మీ. దూరాన్ని 90 నిమిషాల్లో ముగించారు. విద్యాసంస్థల అధినేత జి.వి.రావు, అకాడమిక్‌ సలహాదారు చల్లా శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని