ఆగుతూ.. సాగుతూ..
జాతీయ రహదారి-216 పనులు నత్తనడకన సాగుతున్నాయి. కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు విస్తరించిన ఈ రహదారి విస్తరణ అభివృద్ధి పనుల్లో భాగంగా పాశర్లపూడి నుంచి దిండి వరకు తాటిపాక, రాజోలు, శివకోటి మీదుగా రెండు వరుసల రహదారిగా చేపట్టారు.
దిండిలో వశిష్ఠ వారధి వద్ద నిర్మాణంలో జాతీయ రహదారి
మలికిపురం, రాజోలు, న్యూస్టుడే: జాతీయ రహదారి-216 పనులు నత్తనడకన సాగుతున్నాయి. కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు విస్తరించిన ఈ రహదారి విస్తరణ అభివృద్ధి పనుల్లో భాగంగా పాశర్లపూడి నుంచి దిండి వరకు తాటిపాక, రాజోలు, శివకోటి మీదుగా రెండు వరుసల రహదారిగా చేపట్టారు. నాలుగో ప్యాకేజీగా రూ.132 కోట్ల అంచనా వ్యయంతో 20.800 కిలోమీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో 2017లో అగ్రిమెంట్ జరిగి నెమ్మదిగా పనులు ప్రారంభమయ్యాయి. మంజూరైన విధంగా పనులు చేపడితే తాటిపాక, రాజోలు, శివకోటి ప్రాంతాల్లో ఇళ్లకు, దుకాణాలకు భారీగా నష్టం జరుగుతుందని, బైపాస్ రహదారిగా దారి మళ్లించి తమకు నష్ట తీవ్రతను తగ్గించాలని ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ఎట్టకేలకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల మొర విని పాశర్లపూడి నుంచి శివకోటి వరకు బైపాస్ రహదారిగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించారు. జాతీయ రహదారి-216 దాదాపు తీర ప్రాంతం నుంచి విస్తరించడంతో రవాణాకు ఇది ముఖ్య రహదారిగా ఉపయోగపడుతుంది. ఓ పక్క బైపాస్ రహదారి పనులు పూర్తికాక, ప్రస్తుతం ఉన్న రహదారి పరిస్థితి బాగలేక ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భూసేకరణకు ఆటంకం
మామిడికుదురు, రాజోలు, మలికిపురం మండలాల్లో రహదారి విస్తరణకు అవసరమైన భూమిని రైతుల నుంచి సేకరించినా ఇప్పటికీ భూసేకరణ సమస్యలు పనులకు ఆటంకంగా మారాయి. శివకోటిలో భూ సేకరణకు రైతులు సహకరించకపోవడంతో 3 కిలోమీటర్ల పైబడి పనులకు అడ్డంకి ఏర్పడింది. దీనిపై అధికారులు తరచూ రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నా నష్టపరిహారం విషయం కొలిక్కి రాలేదు. బి.సావరంలో నష్టపరిహారం మరింత పెంచాలని రైతులు పట్టుబడుతున్నారు. రహదారి అభివృద్ధికి ఎక్కువ మొత్తంలో మట్టి అవసరం కావడంతో తీవ్ర జాప్యం నెలకొంది.
వంతెనలు, కల్వర్టు నిర్మాణాల్లోనూ జాప్యమే..
పాశర్లపూడి నుంచి దిండి వరకు బైపాస్ రహదారిని అనుసంధానించేందుకు పంట కాలువలు, మురుగు కాలువలపై 16 స్లాబ్, బాక్స్ కల్వర్టులు నిర్మించాల్సి ఉంది. వీటిలో పది నిర్మాణాలు పూర్తవ్వగా ఇంకా 6 వంతెనల పనులు ప్రారంభం కాలేదు. 22 మైనరు కల్వర్టులు నిర్మించాల్సిఉండగా 15 పూర్తయ్యాయి. ఇంకా మరో ఏడు కట్టడాలు ప్రారంభమవ్వలేదు. ఇవి ఎంత కాలానికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి ఉంది.
మే నెలాఖరుకు పూర్తి..
జాతీయ రహదారి 216 నాలుగో ప్యాకేజీలో పాశర్లపూడి-దిండి బైపాస్ రహదారిని రానున్న మే నెలాఖరుకల్లా పూర్తి చేయడానికి కృషి జరుగుతోంది. కొవిడ్ కారణాలతో పనులు నిలిచిపోవడంతో 2023 మే వరకు నిర్మాణ పనుల కాలాన్ని పెంచుతూ అనుమతి ఇచ్చారు. ఇప్పటివరకు సుమారు 40 శాతం వరకు పూర్తయ్యాయి. భూసేకరణ సమస్యలు పరిష్కారమైతే మిగిలిన పనులను వేగంగా పూర్తవుతాయి. దీనికి జేసీ, రెవెన్యూ అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. రైతులకు ఇవ్వాల్సిన నష్ట పరిహారం విషయం పదిహేను రోజుల్లో కొలిక్కి వస్తుంది.
- పురుషోత్తమరాజు, ఏఈ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షేమ పథకాలకు బీజం వేసిన ఘనత తెదేపాదే
[ 29-03-2024]
పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత తెదేపాకే దక్కుతుందని తెదేపా మండల అధ్యక్షుడు నామన పరమేశ్వరరావు తెలిపారు. -
నిగ్గదీయొద్దు.. నోరు మెదపొద్దు: వైకాపా నేతను కాపాడేందుకు ఎన్ని ఆపసోపాలో!
[ 29-03-2024]
తిడితే పడాలి... కొడితే భరించాలి.. అధికార పక్ష నాయకుల అరాచకాలపై నోరు మెదిపితే ఇబ్బందే. -
పనిచేయని ఏసీలు, ఫ్యాన్లు.. సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
[ 29-03-2024]
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
[ 29-03-2024]
అనపర్తి నియోజకవర్గంలో తెదేపా ఉనికి లేకుండా చేయాలనే దురుద్దేశంతో వైకాపా కుట్రకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. -
అనకొండలు.. అధికారం అండదండలు
[ 29-03-2024]
కక్ష కట్టారో.. తప్పు జరగకపోయినా.. ఎలాంటి ఫిర్యాదులు అందకపోయినా కార్యాలయాల మీదకు వచ్చి పడతారు.. బాధితులతో బలవంతంగా ఫిర్యాదులు రాయించి మరీ వెంటాడి వేధిస్తారు.. -
పవన్.. వారాహి విజయభేరి
[ 29-03-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. -
తొలి అడుగు ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం
[ 29-03-2024]
ఇంటర్మీడియట్.. విద్యార్థి భవితకు తొలి అడుగు. కెరియర్ను ఏవిధంగా తీర్చిదిద్దుకోవాలి.. ఏ కోర్సులను ఎంచుకోవాలి.. ఎలా ముందడుగు వేయాలి.. అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలి.. ఇలా ఎన్నో సందేహాలు విద్యార్థులు.. తల్లిదండ్రులకు తలెత్తుతుంటాయి. -
ఆదుకుంటున్న సీలేరు జలాలు
[ 29-03-2024]
గోదావరిలో కొన్ని రోజులుగా నీటిమట్టం క్రమంగా పడిపోతోంది. -
ప్రదర్శన దర్పం.. ప్రయోజనం దూరం
[ 29-03-2024]
వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రూపొందించిన సృజనాత్మక పరికరాల ప్రదర్శన వేదికన్నారు.. రెండు వందలకు పైగానే నమూనాలను ప్రదర్శించినట్లు ఆర్భాటంగా ప్రకటించారు. -
సంద్రంలో సమర భేరి
[ 29-03-2024]
కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట సముద్రంలో ఇండో-అమెరికన్ సంయుక్త నావికా దళాల రహస్య సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. -
ప్రచారం.. కావాలి పర్యావరణ హితం
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నా.. అది దస్త్రాలకే పరిమితమవుతోంది. -
త్రివేణి సంగమంలా కూటమి పార్టీలు పనిచేస్తాయి
[ 29-03-2024]
రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు భాజపా అభ్యర్థులను కేంద్ర నాయకత్వం నిర్ణయించిందని, అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, భాజపా ఏపీ ఎన్నికల సహబాధ్యుడు సిద్ధార్థ్నాథ్ సింగ్ శ్రేణులను కోరారు. -
పక్కాగా ఎన్నికల నియమావళి అమలు
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా అధికార యంత్రాంగంతో పోలీసు వ్యవస్థ మమేకమై పనిచేస్తుందని ఏలూరు రేంజి ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. -
ప్రాణం తీసిన సహజీవనం
[ 29-03-2024]
ఓ మహిళతో సహజీవనం కోసం మద్యం మత్తులో ఉన్న స్నేహితుడిపైనే కత్తిదూసి హత్యచేశాడో వ్యక్తి.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు