కోనసీమ ప్రభ.. హస్తినలో శోభ
కోనసీమ సంస్కృతి- సంప్రదాయాలకు ‘ప్రభ’ల నిదర్శనమైన ఉత్సవం ఈ సారి దిల్లీలో దర్శనమిచ్చింది. నారుమడితో ఉన్న వరిచేలు....పిల్లకాలువలు...ఎగువ కౌశికనదీ తీరాలను దాటించి తీసుకొచ్చే కోనసీమలోని సంక్రాంతి కనుమ ప్రభల ఉత్సవం ఇప్పుడు నదులను...నగరాలను దాటి దిల్లీ వీధుల్లో కనిపించడంతో కోనసీమ ప్రజలు పులకిస్తున్నారు.
దిల్లీ పరేడ్లో రాజసంగా సాగుతూ...
అంబాజీపేట: కోనసీమ సంస్కృతి- సంప్రదాయాలకు ‘ప్రభ’ల నిదర్శనమైన ఉత్సవం ఈ సారి దిల్లీలో దర్శనమిచ్చింది. నారుమడితో ఉన్న వరిచేలు....పిల్లకాలువలు...ఎగువ కౌశికనదీ తీరాలను దాటించి తీసుకొచ్చే కోనసీమలోని సంక్రాంతి కనుమ ప్రభల ఉత్సవం ఇప్పుడు నదులను...నగరాలను దాటి దిల్లీ వీధుల్లో కనిపించడంతో కోనసీమ ప్రజలు పులకిస్తున్నారు. నాలుగు శతాబ్దాలపైబడి చరిత్ర, ఆధ్యాత్మిక అనుబంధం ఈ ప్రభల ఉత్సవం ఇక్కడి ప్రజల సొంతం. అందుకే కోనసీమలోని జగ్గన్నతోట ప్రభల ఉత్సవం అంటే జిల్లావాసులతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న తెలుగువారికందరికీ ఇది పెద్దపండుగే. గణతంత్ర దినోత్సవం వేళ దిల్లీలో గురువారం కోనసీమ ప్రభల ఉత్సవ శకటం ప్రదర్శించిన తీరును టీవీలు,చరవాణుల్లో వీక్షించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఏకాదశ రుద్రులు కొలువైన గ్రామాల్లోని ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఆనంద ప్రభ...సంక్రాంతి ప్రభ...ఆధ్యాత్మిక ప్రభ అంటూ ప్రజలు నినదించారు. బాణసంచా కాల్చారు. మిఠాయిలు పంచారు.
పవిత్రంగా భావిస్తాం..
కనుమ రోజున జరిగే ప్రభల ఉత్సవాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తాం..అలాంటి ప్రభల తీర్థానికి సంబంధించిన ప్రభల ఉత్సవం శకటం, కోనసీమ గరగనృత్యాలు దిల్లీలోని గణతంత్రవేడుకల్లో కనువిందు చేయడంతో సంతోషంగా ఉంది. గణతంత్రవేడుకలను టీవీల్లో చూసే సమయం వచ్చే వరకు ఉత్సుకతతో ఎదురుచూశాం.
మట్టపర్తి భారతి?
ఆధ్యాత్మిక భావంతోనే..
చరిత్ర కలిగిన ప్రభల తీర్థం పూర్తిగా ఆధ్యాత్మికభావంతోనే నిర్వహిస్తుంటాం.వందల చరిత్ర కలిగిన ప్రభల ఉత్సవ శకటాన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలో ప్రదర్శించటం సంతోషం కలిగిస్తోంది. ఈ ప్రభల శకటాన్ని టీవీల్లో చూడగానే ఏదో తెలియని అనుభూతి కలిగింది.
శ్రీపాద వెంకటరమణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం వచ్చారని తెచ్చారు.. వెళ్లారని వదిలేశారు
[ 23-04-2024]
ఈ నెల 18న ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జిల్లాలో బస్సు యాత్రం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైకాపా నేతలు, అధికారులు నానా హడావుడి చేశారు. -
అభివృద్ధి మాది.. విధ్వంసం జగన్ది..
[ 23-04-2024]
కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీప కూడలిలో సోమవారం సాయంత్రం ప్రజాగళం బహిరంగ సభలో తెదేపా అధినేత ప్రసంగించారు. -
సత్యదేవుడి సేవల్లోనూ వైకాపా వేలు
[ 23-04-2024]
సంప్రదాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. వైదిక కార్యక్రమాల నిర్వహణలో ఇష్టానుసారం వ్యవహరించారు. వివాదాస్పదమై... -
పదిలో వెనుకబడిపోయాం..
[ 23-04-2024]
వసతుల లేమి, బోధనా సిబ్బంది కొరత, ఇతర అసౌకర్యాల నడుమ విద్యార్థులు అవస్థలు పడుతుండటంతో ఈ ఏడాది పదోతరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా వెనుకబడి పోయింది. -
చంద్రబాబును కలిసిన నల్లమిల్లి
[ 23-04-2024]
ప్రజాగళం బహిరంగ సభకు జగ్గంపేట వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
నామినేషన్ల సందడి
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం సందడిగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
రాజీ పడదగిన కేసులు జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలి
[ 23-04-2024]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజీ పడదగిన కేసుల జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలని తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి పేర్కొన్నారు. -
ఫలితాలను ఏం మాయ చేశావ్
[ 23-04-2024]
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతున్నామన్న వైకాపా సర్కారు మాటలు బూటకమని తేలిపోయింది. సోమవారం వెలువడిన పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అరకొర ఫలితాలే సాధించాయి. -
నిరుద్యోగ సమస్య తీర్చేవారికే మద్దతు
[ 23-04-2024]
రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే: ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు ద్వారా తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. -
కొంత మోదం.. కొంత ఖేదం
[ 23-04-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరానికి 18,786 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 17,262 మంది ఉత్తీర్ణులయ్యారు. -
జిల్లాలో 24 నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో సోమవారం మొత్తం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి నాలుగు, జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. -
కాంగ్రెస్కు సానుకూల పవనాలు: రఘువీరారెడ్డి
[ 23-04-2024]
రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజవర్గం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి