ప్రకృతి వినాశనమే విపత్తుల హేతువు
ప్రకృతికి నష్టం వాటిల్లే తప్పిదాలతోనే వాతావరణంలో వస్తున్న మార్పులు మానవాళికి హాని కల్గిస్తున్నాయని జాతీయ భూగర్భ జల వనరుల డెల్టా పరిశోధన విభాగం డైరెక్టర్ డాక్టర్ సత్యాజీరావు విశ్లేషించారు.
వాతావరణ మార్పులు- ప్రభావం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న శాస్త్రవేత్తలు, అధికారులు
ఉద్యాన పరిశోధన కేంద్రం (అంబాజీపేట), న్యూస్టుడే: ప్రకృతికి నష్టం వాటిల్లే తప్పిదాలతోనే వాతావరణంలో వస్తున్న మార్పులు మానవాళికి హాని కల్గిస్తున్నాయని జాతీయ భూగర్భ జల వనరుల డెల్టా పరిశోధన విభాగం డైరెక్టర్ డాక్టర్ సత్యాజీరావు విశ్లేషించారు. ప్రకృతికి విఘాతం కలిగే పంటల సాగుతో ఇప్పటికే భూగర్భజలాలు కలుషితమయ్యాయన్నారు. రక్షిత వ్యవసాయ విధానాలపై నాబార్డు అనుబంధ రంగాల వారికి అంబాజీపేట ఉద్యాన పరిశోధన కేంద్రం సమావేశ మందిరంలో శుక్రవారం వర్క్షాపు (జ్ఞాన అంగడి)ను నిర్వహించారు. నాబార్డు డీడీఎం డాక్టర్ వై.ఎస్.నాయుడు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సత్యాజీరావు మాట్లాడారు. తీర ప్రాంతాల్లో రొయ్యల సాగు, అడవుల నరికివేత, కార్భన్ వ్యర్థాల పెరుగుదల తదితర కారణాలతో సముద్ర జలాల్లో లవణీయత పెరిగిపోతోందని ఆయన తెలిపారు. ప్రధానంగా డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలాల్లో ఎక్కువగా రొయ్యల సాగు వల్ల సముద్ర జలాలు కలుషితమవుతున్నాయన్నారు. కోనసీమ జిల్లాలోని 32 వేల హెక్టార్లలో ఉండే మడ అడవులు ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుతుండేవన్నారు. వాతావరణ మార్పులు-ప్రభావం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ బి.శ్రీనివాసులు, ప్రిన్సిపల్ శాస్త్రవేత్త చలపతిరావు, శాస్త్రవేత్తలు గోవర్ధనరావు, కిరిటీ, నీరజ, మత్స్య, గ్రామీణాభివృద్ధి, సహకార బ్యాంకు ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా కూటమిని గెలిపించాలి
[ 17-04-2024]
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెదేపా కూటమిని గెలిపించాలని సీనియర్ నాయకుడు పెండ్యాల అచ్చిబాబు కోరారు. -
ఎన్నికల వేళ వైకాపాలో కుదుపు
[ 17-04-2024]
రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో 1996 డిసెంబర్ 29న దళితులకు శిరోముండనం చేసిన ఘటన రాష్ట్రమంతా నాడు కుదిపేసింది. కుంగిపోయిన బాధితులు ఇళ్లలోనే ప్రాణభయంతో మగ్గిపోయారు. -
ఏడు రోజులన్నారు.. ఏడిపిస్తున్నారు
[ 17-04-2024]
సీపీఎస్.. ఈ విధానం రద్దుకు రాష్ట్రంలో ఉద్యోగులు తెలపని నిరసన లేదు.. చేయని ఆందోళన లేదు. -
ఉదయం నుంచి ఉత్కంఠ
[ 17-04-2024]
వెెంకటాయపాలెం శిరోముండనం కేసు తీర్పు మంగళవారం వచ్చిన నేపథ్యంలో ఆ గ్రామంలో ఉదయం నుంచే ఉత్కంఠ నెలకొంది. తీర్పు ఏవిధంగా ఉంటుందన్న అంశంపై వారం రోజులుగా ఇక్కడ చర్చ నడుస్తోంది. -
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 17-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 18 నుంచి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
ప్రజల చేతుల్లోనే రామరాజ్యం
[ 17-04-2024]
ఓటు అనే వజ్రా యుధంతోనే రామ రాజ్యం సాధ్యమవుతుంది. అయిదేళ్ల భవితకు పట్టం కడుతుంది. పాలకులు సంక్షేమ సారథులు కావాలంటే ఎన్నికల వేళ ఓటర్లంతా రామబాణం సంధించాలి. -
అడ్డగోలు ప్రచారం.. ట్యాబ్లే నిదర్శనం
[ 17-04-2024]
ఎన్నికలు ముంచుకొస్తున్నా వైకాపా అడ్డదారి ప్రచారానికి మాత్రం అడ్డుకట్ట పడడంలేదు. విద్యార్థులనూ ఈ వ్యవహారంలో వినియోగించుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నా.. విద్యాశాఖ, ఎన్నికల సంఘం పరిస్థితిని చక్కదిద్దే చొరవ చూపడంలేదు. -
నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు వీరే..
[ 17-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఒక లోక్సభ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
మరో 28,853 మందికి ఓటు హక్కు
[ 17-04-2024]
జిల్లాలోని కాకినాడ పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలకు ఈ నెల 18 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. -
ఏళ్లు గడిచినా సమస్యలు పట్టవా..?
[ 17-04-2024]
కొవ్వూరు పట్టణ పరిధిలో క్రిస్టియన్పేటగా పిలిచే 3, 4 వార్డులను పలు సమస్యలు వేధిస్తున్నాయి. మురుగు వ్యవస్థ ఇబ్బందికరంగా మారుతోంది. -
కూటమి ఐక్యత అన్ని నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉండాలి: నాగబాబు
[ 17-04-2024]
పిఠాపురంలో జనసేన, తెదేపా, భాజపా కూటమి శ్రేణుల ఐక్యత ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు అన్నారు. -
ఏళ్లు గడుస్తున్నా.. పరిహారం అందలేదు
[ 17-04-2024]
పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు తమ భూములు తీసుకొని ఏళ్లు గడుస్తున్న నేటికి పరిహారం అందించలేదని తమకు న్యాయం జరిగేలా చూడాలని గిరిజనేతర రైతులు కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. -
‘పార్టీ పదవి కంటే ఐకమత్యమే ముఖ్యం’
[ 17-04-2024]
వైకాపా నాయకుడు తోట రామకృష్ణపై అదే పార్టీ నాయకులు ఇటీవల దాడి చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కాపుసంఘం అధ్యక్షుడు చిలిమలి వెంకటరాయుడు తెలిపారు. -
ముఖ్యమంత్రి సభకు బస్సులు... ప్రయాణికుల పడిగాపులు
[ 17-04-2024]
సమయానుకూలంగా బస్సులు రాక.. కొన్ని మార్గాల్లో పూర్తిస్థాయిలో సర్వీసులు అందుబాటులో లేక.. సకాలంలో గమ్యస్థానాలకు చేరలేక ఆర్టీసీ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్