ఏలేరు జలం... కావాలి సద్వినియోగం
మెట్ట రైతుల బాంధవి ఏలేరు జలాశయం. ఏలేశ్వరంలోని ఈ రిజర్వాయరు ఇటు సాగుకు, అటు విశాఖ పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు నీటిని అందిస్తోంది.
న్యూస్టుడే, ఏలేశ్వరం
ఏలేశ్వరంలోని జలాశయం
మెట్ట రైతుల బాంధవి ఏలేరు జలాశయం. ఏలేశ్వరంలోని ఈ రిజర్వాయరు ఇటు సాగుకు, అటు విశాఖ పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు నీటిని అందిస్తోంది. దీని పూర్తిస్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు (24.11 టీఎంసీలు). రిజర్వాయర్ నుంచి రెండు పంటలకు 12 టీఎంసీలు, విశాఖ అవసరాలకు ఆరు టీఎంసీల జలాలను అందజేస్తారు. మరో ఆరు టీఎంసీలను డెడ్ స్టోరేజీగా ప్రాజెక్టులోనే ఉంచేస్తారు. పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలోని 60 వేల ఎకరాలకు ఈ జలాశయం నుంచి సాగునీరు సరఫరా అవుతోంది. ఖరీఫ్లో పూర్తిస్థాయిలో పంటలకు నీటిని అందజేసిన అధికారులు గత నెల పదో తేదీ నుంచి రబీకి జలాల విడుదల ప్రారంభించారు. రెండో పంటకు నీటి సరఫరా ప్రారంభించిన సమయంలో రిజర్వాయర్లో 85.03 మీటర్ల స్థాయిలో 21.06 టీఎంసీల జలాలు ఉన్నాయి. కాలువలు సరిగా లేనందున నీరు శివారు పొలాలకు వెళ్లడంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించాల్సి ఉంది.
కాలువల పరిస్థితి ఇలా..
ఏలేరు ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతాలకు నీటిని అందించే ప్రధాన కాలువ యర్రవరం వద్ద అస్తవ్యస్తంగా ఉంది. ఎవరూ దీని ఆధునికీకరణ ఊసే ఎత్తకపోవడంతో సాగునీరు సక్రమంగా ప్రవహించడం లేదు. నిర్ధారిత ఆయకట్టుకి సరాసరి వెళ్లాల్సిన నీరు గోతుల్లో ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. పెద్దాపురంలోని వైఏ డివిజన్ నుంచి వచ్చే విజ్ఞప్తుల మేరకు సాగుకు నీటిని ఏలేశ్వరం నుంచి సరఫరా చేస్తారు. ప్రాజెక్టు డీసీఆర్ స్లూయిస్ నుంచి ప్రస్తుతం 600 క్యూసెక్కులు, స్పిల్వే గేటు నుంచి మరో 250 క్యూసెక్కుల నీరు సాగుకి వెళుతోంది. కాలువలపై అధికారులు పూర్తిస్థాయి పర్యవేక్షణ చేయాలి. నీటి చౌర్యం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి. రిజర్వాయర్ నుంచి వదిలిపెట్టే ప్రతి నీటిబొట్టూ ఆధారిత ఆయకట్టుకి చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
యర్రవరం వద్ద ప్రధాన కాలువ
జాగ్రత్తలు తీసుకుంటున్నాం
ఏలేరు ప్రాజెక్టు నుంచి సాగుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తున్నాం. వైఏ డివిజన్ నుంచి వచ్చే నివేదిక మేరకు ఎప్పటికప్పుడు ఎంత పరిమాణంలో నీటిని సరఫరా చేయాలో నిర్ణయిస్తాం. వంతుల వారీ విధానంలో సరఫరా చేసే జలాలపై పూర్తిస్థాయి పర్యవేక్షణ చేస్తున్నాం. రైతులకు, విశాఖ అవసరాలకు ఇబ్బందులు లేకుండా నీటి విడుదలకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
ఎం.భాస్కరరావు, కార్యనిర్వాహక ఇంజినీర్, ఏలేరు కార్యాలయం, ఏలేశ్వరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాలో పలువురి చేరిక
[ 18-04-2024]
మండలంలోని ఏ.మల్లవరం గ్రామానికి చెందిన పలువురు.. నాయకుడు లెక్కల రాము ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. -
సీఎం వస్తున్నారు.. మరి జనమో!
[ 18-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సిద్ధం యాత్ర గురువారం కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది. సీఎం రోడ్డుషోకు జనాలను తరలించేందుకు వైకాపా నాయకులు ఆపసోపాలు పడుతున్నారు. -
మైక్రోసాఫ్ట్ ఉద్యోగం వదిలి.. ప్రజాసేవకు కదిలి..
[ 18-04-2024]
కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువు.. నాలుగో ఏడాదిలోనే ప్రాంగణ ఎంపికల్లో సాఫ్ట్వేర్ కొలువు.. రూ.లక్షల జీతం.. అంతటితో ఆగలేదు ఆమె. -
చెప్పారంటే.. చేయరంతే!
[ 18-04-2024]
ముఖ్యమంత్రే స్వయానా హామీ ఇచ్చారు.. ఇంకేం అభివృద్ధికి అడుగులు పడినట్టే అని తూర్పుగోదావరి జిల్లా వాసులు భావించారు. అధికారులూ నిజమేననుకుని అంతే వేగంగా రూ.కోట్లతో పలు పనులకు ప్రతిపాదనలు చేసి పంపారు. ఇప్పటికి ఒక్క పని జరిగితే ఒట్టు. సమావేశాలు, -
అడ్డగోలుగా తవ్వేయ్.. అడ్డదారిలో అమ్మేయ్..
[ 18-04-2024]
అధికార పార్టీ నాయకులకు మట్టి.. బంగారంతో సమానం. ఎక్కడో ఓ చోట అని కాకుండా దొరికిన చోటల్లా దోచుకుంటూ, రూ.కోట్లు సొమ్ము చేసుకున్నారు. -
వైకాపాలో ఎవరి కుంపటి వారిదే!
[ 18-04-2024]
ఒకపక్క సార్వత్రిక ఎన్నికల ముహూర్తం దగ్గరపడుతున్నా జిల్లా వైకాపా నేతల్లో కలహాల కుంపట్లు రాజుకుంటునే ఉన్నాయి. -
సార్వత్రిక ఎన్నికల ప్రకటన నేడే
[ 18-04-2024]
జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. -
తుంచేసిన కల.. కూత వినబడేదెలా
[ 18-04-2024]
దిగువ చిత్రాన్ని చూశారా.. కోటిపల్లి- నరసాపురం రైల్వే లైను పనుల దుస్థితి ఇదండి. కోనసీమ ప్రజల చిరకాల కల కోటిపల్లి- నర్సాపురం రైలు మార్గం. -
హామీల గారడి.. కోనసీమకు బురిడీ
[ 18-04-2024]
ప్రతిపక్ష నేతగా కోనసీమలో పర్యటించిన సమయంలో హామీలు గుప్పించారు. ముఖ్యమంత్రి హోదాలో సరేసరి. అవన్నీ నీటి మూటలయ్యాయి. -
దళితులపై దాడులు చేసేవారికి జగన్ పదోన్నతులు
[ 18-04-2024]
దళితులపై దాడులు చేసేవారికే ముఖ్యమంత్రి జగన్ పదోన్నతులు ఇస్తున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఆరోపించారు. -
పేపరుమిల్లు యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలి
[ 18-04-2024]
రాజమహేంద్రవరం పేపరుమిల్లు యాజమాన్యం మొండివైఖరి విడనాడి వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్ డిమాండ్ చేశారు. -
అన్నొచ్చాడని నరికేశారు.. చిగురించిన తీరు.. సిగ్గుపడేలా సర్కారు
[ 18-04-2024]
సాధారణంగా ముఖ్యమంత్రి, ఆ స్థాయి వ్యక్తి క్షేత్రస్థాయి పర్యటనకు వస్తున్నప్పుడు రహదారులను బాగు చేస్తారు. ఆయా మార్గాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి బ్లీచింగ్ చల్లిస్తారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు శాపం
[ 18-04-2024]
మండలంలోని మగటపల్లి శివారులో సుమారు 40 ఎకరాల దాళ్వా వరి పంట చేలకు నెల రోజులుగా నీరు అందక పూర్తిగా నెర్రెలు తీయడంతో రైతులు బుధవారం ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు పశువులకు వదిలేశారు. -
పవన్ గెలుపు.. పిఠాపురం అభివృద్ధికి మలుపు
[ 18-04-2024]
పవన్ కల్యాణ్ను గెలిపించడం ద్వారా పిఠాపురం అభివృద్ధికి బాటలు వేయాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కోరారు. ఈ సార్వత్రిక ఎన్నికల బరిలో పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పవన్ కల్యాణ్, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారని..
తాజా వార్తలు (Latest News)
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్