నేర వార్తలు
కొవ్వూరు పురపాలక సాధారణ, బడ్జెట్ సమావేశాలు ఛైర్పర్సన్ భావన రత్నకుమారి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు.
‘పలు విభాగాల్లో అవినీతి జరుగుతోంది’
కొవ్వూరు పట్టణం, న్యూస్టుడే: కొవ్వూరు పురపాలక సాధారణ, బడ్జెట్ సమావేశాలు ఛైర్పర్సన్ భావన రత్నకుమారి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఎక్స్అఫీషియో సభ్యురాలిగా హోంమంత్రి తానేటి వనిత హాజరయ్యారు. ఇందులో 22వ వార్డు (వైకాపా) కౌన్సిలర్ కంఠమణి రమేష్ మాట్లాడుతూ బాక్సు టెండర్ల నిర్వహణ తీరుపై గత కౌన్సిల్లో ప్రశ్నించామని, 0.001 శాతానికి టెండరు వేసి పనులు ఎలా చేస్తారని అడగ్గా ఈసారి 24 శాతం లెస్కు వేశారన్నారు. రూ.లక్షకు రూ.76 వేలతో పనులు జరుగుతాయా అన్నారు. నోటీస్ బోర్డులో ఉంచడం, బయటి కాంట్రాక్టర్లు, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖలకు తెలియజేయాలన్నారు. ఈ అంశంపై అదే పార్టీకి చెందిన పదో వార్డు కౌన్సిలర్ బత్తి నాగరాజు మాట్లాడుతూ కార్యాలయ ఉద్యోగులే బాక్సు టెండర్లు వేస్తున్నారని, దీనిపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. పలు విభాగాల్లో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. కమిషనర్ బి.శ్రీకాంత్ అంశాల వారీగా సమాధానమిచ్చారు.
అవినీతిపై సహించను: వీరు చేసిన ఆరోపణలపై మంత్రి మాట్లాడుతూ పౌరసేవల్లో అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. టెండర్లు, సేవల విషయంలో ఆధారాలు ఉంటే తనకు ఇవ్వాలన్నారు.
యాప్ అప్డేట్ పేరిట ఆన్లైన్ మోసం
రాజమహేంద్రవరం నేరవార్తలు: బ్యాంకు లావాదేవీలకు వినియోగిస్తున్న యాప్ను వెంటనే అప్డేట్ చేయకుంటే మీ ఖాతా బ్లాక్ అవుతుందని వచ్చిన ఫోన్కు స్పందించి రూ.లక్షకు పైగా పోగొట్టుకున్న ఘటన రాజమహేంద్రవరం బొమ్మూరు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ ఆర్.విజయ్కుమార్ వివరాల మేరకు.. వీఎల్పురం ప్రాంతానికి చెందిన షేక్ మదీనా మన్వర్ అనే వృద్ధుడు ప్రైవేటు సంస్థలో పనిచేసి ఇటీవలే ఉద్యోగ విరమణ చేశాడు. తన బ్యాంకు నగదు లావాదేవీలన్నీ ఫోన్లోని యాప్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఆయనకు గత ఏడాది నవంబరు 23న ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. మీరు వినియోగిస్తున్న యాప్ అప్డేట్ చేయాలని, లేకుంటే బ్యాంకు ఖాతా బ్లాక్ అవుతుందని చెప్పాడు. సదరు వ్యక్తి మాయ మాటలు నమ్మిన మన్వర్ బ్యాంకు వివరాలతోపాటు పాన్ కార్డు, తన ఫోన్కి వచ్చిన ఓటీపీ సందేశాలను ఆ వ్యక్తికి చెప్పారు. అనంతరం గంటల వ్యవధిలో మన్వర్ ఖాతాలోని రూ.1.24 లక్షల నగదు పలు దఫాలుగా చోరీకి గురయింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితుడు శుక్రవారం పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
అయిదు ఆలయాల్లో చోరీ
ఉండ్రాజవరం, న్యూస్టుడే: మండలంలోని సూర్యారావుపాలెంలో అయిదు ఆలయాల్లో గుర్తుతెలియని వ్యక్తులు గురువారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. సాయిబాబా, కనకదుర్గమ్మ, పుంతముసలమ్మ, వినాయకుడు తదితర ఆలయాల్లో హుండీలు బద్దలగొట్టి సొమ్ము కాజేశారు. ఆయా ఆలయాల నిర్వాహకులు శుక్రవారం ఉదయం విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దమ్మెన్ను, వేలివెన్ను పరిధిలో కొండాలమ్మ ఆలయంలో చోటు చేసుకున్న చోరీకి సంబంధించి సీసీ కెమెరా వీడియోలను పరిశీలించారు. దొంగ ముసుగు వేసుకుని లోపలకు ప్రవేశించినట్లు గుర్తించారు. ఎంత మొత్తం చోరీకి గురైందో తెలియలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ యాత్రన.. జనం యాతన
[ 19-04-2024]
విద్యుత్తు కట్.. అంతర్జాలం బంద్.. దుకాణాల మూత.. సామాన్యుల వాహనాలకు తోడు అంబులెన్సులు సైతం నిలిపివేత.. గంటలపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. -
ఎన్నికల వేళ యువతా.. అప్రమత్తం
[ 19-04-2024]
ఎన్నికల వేళ యవత మరిన్ని జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలిచారని బైక్ ర్యాలీల్లో పాల్గొనడం, ప్రత్యర్థులతో ఘర్షణకు దిగడం వంటివి ఎంతమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. -
అసలేం జరుగుతోంది..?
[ 19-04-2024]
ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్ పెట్టి తెప్పించేస్తారు. -
జిల్లాకు రానున్న ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారు. వీరికి అనుసంధానంగా లైజనింగ్, ఇతర సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
తొలిరోజు ఏడు నామినేషన్ల దాఖలు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకాగా తొలిరోజు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. -
పాదయాత్ర అబద్ధాలతో దండయాత్ర
[ 19-04-2024]
పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను. -
తొలిరోజు నామినేషన్ల సందడి
[ 19-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు. -
పేపరుమిల్లు కార్మికుల ఆందోళన
[ 19-04-2024]
సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్ గురువారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్మిల్లుకు చేరుకున్న సమయంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 రోజులుగా వేతన ఒప్పందం కోరుతూ సమ్మె చేస్తున్నా పేపర్మిల్లు యాజమాన్యం స్పందించడం లేదని నినాదాలు చేశారు. -
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది సమస్యాత్మక కేంద్రాలే. పోలింగ్ ముగిసే వరకు అధికారుల దృష్టంతా వాటిపైనే ఉంటుంది. -
అద్దె చెల్లించక అగచాట్లు
[ 19-04-2024]
వైకాపా పాలనలోని గత అయిదేళ్లలో అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు కేవలం నోటి మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు
[ 19-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన నుంచి గండేపల్లి మండలంలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆ పార్టీ నాయకుల అండదండలతో కొన్ని లే ఔట్లను ఏర్పాటు చేసి అక్రమంగా మెరక చేశారు. -
‘ఆత్మ’సాక్షి లేదా.. అన్నదాతంటే పడదా..!
[ 19-04-2024]
సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్