కొందరికే చేదోడు..!
కాకినాడ జిల్లాలో జగనన్న చేదోడు పథకం అమలుతీరు గందరగోళంగా మారింది. 2022-23కు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అయోమయానికి గురి చేసింది. ఈ దఫా నిబంధనలు సడలించినా లబ్ధిదారులకు ప్రయోజనం అందని పరిస్థితి నెలకొంది.
కాకినాడ కలెక్టరేట్, న్యూస్టుడే: కాకినాడ జిల్లాలో జగనన్న చేదోడు పథకం అమలుతీరు గందరగోళంగా మారింది. 2022-23కు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అయోమయానికి గురి చేసింది. ఈ దఫా నిబంధనలు సడలించినా లబ్ధిదారులకు ప్రయోజనం అందని పరిస్థితి నెలకొంది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే దరఖాస్తులకు అవకాశం ఇవ్వడంతో వేల సంఖ్యలో అర్హులు నష్టపోయే పరిస్థితి దాపురించింది. కుల, ఆదాయ, కార్మిక శాఖ ధ్రువీకరణ పత్రాలు సకాలంలో జారీ అవ్వక, దరఖాస్తు చేసేందుకు గడువు లేక లబ్ధిదారులను ఉసూరుమన్నారు. ఈ పథకం ద్వారా రజక, నాయీబ్రహ్మణ, టైలరింగ్ వృత్తి చేసే 21 నుంచి 60 ఏళ్ల పేదలకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. దీనికిగాను ఈ నెల 24న సాయంత్రం నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ (ఎన్బీఎం) పోర్టల్ను తెరిచి 26 అర్ధరాత్రి 12లోపు అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని ఉత్తర్వులిచ్చారు. కేవలం మూడు రోజులే గడువు ఇవ్వడంతో కుల,ఆదాయ, కార్మిక శాఖ ధ్రువపత్రాల కోసం అర్హులు కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. వేల సంఖ్యలో దరఖాస్తులు తహసీల్దారు, కార్మిక శాఖ కార్యాలయాల్లో మూలుగుతున్నాయి.
గతంలో ఇలా..
2020-21, 2021-22లో దరఖాస్తుకు నెల రోజుల గడువు ఇచ్చేవారు. అవసరమైన ధ్రువపత్రాలను గ్రామ/వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్స్కు ఇస్తే ఎన్బీఎం పోర్టల్లో నమోదు చేసి, ధ్రువీకరించే వారు. అనంతరం ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్, బీసీ కార్పొరేషన్ ఈడీ, కలెక్టర్ ధ్రువీకరణతో అర్హుల జాబితాను రూపొందించే వారు. ఈ దఫా అందుకు భిన్నంగా వ్యవహరించారని, దీని వల్ల ఎక్కువ మందికి లబ్ధి అందదనే ఆందోళన వ్యక్తమవుతోంది. గడువు పెంచి, అర్హులకు ఆర్థిక సాయం అందించాలని పేదలు కోరుతున్నారు.
వెల్ఫేర్ అసిస్టెంట్ల వద్దే దరఖాస్తులు..
గడువులోగా కొందరు ధ్రువపత్రాలు అందజేసినా, సమయంలేక వెల్ఫేర్ అసిస్టెంట్లు ఎన్బీఎం పోర్టల్లో నమోదు చేయలేకపోయారు. జిల్లాలోని 620 గ్రామ/వార్డు సచివాలయాలు ఉండగా, ఒక్కోచోట ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ ఉన్నారు. వీరి ద్వారా సంక్షేమ పథకాలకు అర్హులను నిర్ణయిస్తారు. ఈ నెల 26లోగా వీరికి అందిన దరఖాస్తులను 27 సాయంత్రంలోగా ఆన్లైన్లో పొందుపర్చాలని ఆదేశించారు. దీంతో వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని ఎన్బీఎం పోర్టల్లో పొందుపర్చి, ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్, బీసీ కార్పొరేషన్ ఈడీ, కలెక్టర్ ఆమోదం తీసుకోవాలని సూచించారు. దీనికి ఫిబ్రవరి 4 వరకు అవకాశం కల్పించారు. అయితే ఈ నెల 27 వరకు ఆమోదం పొందిన జాబితాకే సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి చేదోడు ఆర్థిక సాయాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. దీని ప్రకారం జిల్లాలో 13,314 మంది లబ్ధిదారులకు రూ.13.31 కోట్ల ఆర్థిక సాయం అందనుంది. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 4 వరకు అప్లోడ్ చేసే దరఖాస్తులకు మాత్రం ఇప్పుడు ఆర్థిక సాయం అందించే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. వీరిలో అర్హులుంటే ఎప్పుడు ఈ సాయం అందిస్తారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది.
అర్హత ఉన్నా..
* కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 41వ డివిజన్, పోలీసు క్లబ్ వీధిలో ఇంటి వద్ద లాండ్రీ చేసే తూరంగి బేబీకి ఈ పథకాన్ని వర్తింప చేయలేదు. గత రెండు పర్యాయాలు ఈమె చేదోడు లబ్ధి పొందారు. నిబంధనల ప్రకారం ఈమెకు అర్హత ఉన్నా, వెల్ఫేర్ అసిస్టెంట్ నిరాకరించారు. దీంతో గాంధీనగర్ సచివాలయం-బీ చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు.
* కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 49వ డివిజన్ అశోక్నగర్లో స్వామి సెలూన్ నిర్వహిస్తున్నారు. ఇతను కుల ధ్రువీకరణపత్రానికి దరఖాస్తు చేసినా 26లోపు జారీ కాకపోవడంతో సకాలంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఆదివారం ఇతనికి ఆన్లైన్లో కుల ధ్రువీకరణపత్రం జారీ అయింది. సోమవారం దీన్ని సంబంధిత సచివాలయంలో సమర్పించాల్సి ఉంది. ఇతనికి జగనన్న చేదోడు వర్తిస్తుందా... లేదా? అనేది ప్రశ్నార్థకమే..
13,314 మందికే లబ్ధి
ఎస్వీఎస సుబ్బలక్ష్మి, ఈడీ, బీసీ కార్పొరేషన్, కాకినాడ జిల్లా
జగనన్న చేదోడు పథకంలో ఈ నెల 27 వరకు ఆమోదించిన జాబితాకు సోమవారం ఆర్థిక సాయం విడుదల చేస్తారు. జిల్లాలో 13,314 మందికి లబ్ధి అందనుంది. ఇంకా వెల్ఫేర్ అసిస్టెంట్ వద్ద ఉన్న దరఖాస్తులను ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్లకు పంపి, బీసీ కార్పొరేషన్కు సమర్పించాలని ఆదేశించాం. ఫిబ్రవరి 4 లోగా జాబితాల సమర్పణకు అవకాశం కల్పించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు చేదోడు వర్తింపజేస్తారు. వీరికి ప్రభుత్వ ఆదేశాల మేరకు తరువాత ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలన అంతమొందిద్దాం
[ 24-04-2024]
జగన్ పరిపాలనను అంతమొందిద్దాం.. పిడికిలి బిగించి మరీ కూటమిని గెలిపించుకుందామని జనసేన అధినేత పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ప్రసంగించారు. -
జగన్ మాటిస్తే.. నీటి మూటే!
[ 24-04-2024]
సీఎం చెప్పిన మాట ప్రకారం సంక్రాంతి వెళ్లిపోయింది.. ఉగాది దాటేసింది. ఇవేవీ ప్రభుత్వానికి గుర్తులేకపోయినా ఎన్నికల నగారా మోగుతుందనే విషయం జ్ఞప్తికి వచ్చింది. ఖజానాలో కాసులు లేకున్నా రైతులకు తుపాను పరిహారం అంటూ హడావుడిగా మార్చి 6న బటన్ నొక్కారు. -
తలూపినా తలోదారే!
[ 24-04-2024]
రాజమహేంద్రవరం నగరంలో అధికార పార్టీ నేతల్లో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా వీరిమధ్య పొరపొచ్చాలు సమసిపోవడం లేదు. -
రోగుల భద్రత మరిచావా పాలకా!
[ 24-04-2024]
ఒకప్పుడు నిత్యం ప్రయాణికులతో కళకళలాడే గోదావరి రైల్వేస్టేషన్ పలు సమస్యలతో కునారిల్లుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పాలు, కూరగాయలు తీసుకొచ్చే చిరు వ్యాపారులు.. చదువుల నిమిత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు.. ఉద్యోగులు ఇక్కడి నుంచే పాసింజర్లలో రాకపోకలు సాగించేవారు. -
అనపర్తి.. వీడిన అనిశ్చితి
[ 24-04-2024]
అనపర్తి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి స్థానంపై కొన్నిరోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడింది. కూటమి పెద్దల నిర్ణయంతో సుమారు 27 రోజుల తర్వాత అనిశ్చితికి తెరపడింది. -
మామ బడాయి మాటలు..
[ 24-04-2024]
నాడు-నేడు మొదటి విడత పనుల్లో మండలంలోని వాదాలకుంట మొదటి విడత పనులే ఇంకా..ఉన్నత పాఠø‹లలో ఆరు అదనపు గదులు మంజూరయ్యాయి. నిధులు కొరత కారణంగా వాటిని తగ్గించి నాలుగుకు తగ్గించారు -
బటన్ నొక్కి జగన్ ఎంత డబ్బు వెనకేశారు?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాటు బటన్ నొక్కి పేదలకు డబ్బులు పంపిణీ చేశానని చెబుతున్నారని, అదే బటన్ నొక్కి ఆయన ఇంకెంత వెనకేసుకున్నారని వంగవీటి రాధా ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు -
రూ.2.58 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం
[ 24-04-2024]
ఎన్నికల తనిఖీల్లో భాగంగా కడియం పోలీసులు రూ.2.58 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
హోంమంత్రి ర్యాలీలో గాయపడిన దళితుడు ఇకలేరు
[ 24-04-2024]
హోంమంత్రి తానేటి వనిత నామినేషన్ ర్యాలీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ పడిపోయి గాయపడిన దళితుడు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన పల్లపు అబ్బులు (73) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. -
మే 26 వరకు కాకినాడ- విశాఖ రైలు రద్దు
[ 24-04-2024]
కాకినాడ పోర్టు- విశాఖపట్నం(17267), విశాఖపట్నం-కాకినాడ పోర్టు(17267) రైళ్లను ఈ నెల 29 నుంచి మే 26 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
వైకాపా గొప్పలు.. రైతుకు తిప్పలు
[ 24-04-2024]
మాది రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొంటున్న వైకాపా పాలనలో కర్షకులు అనుభవిస్తున్న అవస్థలకు ఈ చిత్రమే నిదర్శనం. కట్టిస్తామన్న గోదాములు నిర్మించక, కనీసం కళ్లాలకూ స్థలాలు చూపకపోవడంతో రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. -
జగన్ను కుర్చీ దింపాలి
[ 24-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా అర్బన్ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ఆభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM