ఉచిత శిక్షణ.. భవితకు నిచ్చెన
ఉద్యోగం సాధించాలంటే పట్టా ఉంటే సరిపోదు.. అందుకు అవసరమైన నైపుణ్యం కూడా అవసరం. ఏటా బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులు జిల్లా నుంచి సుమారు రెండు లక్షలకుపైగా బయటకు వస్తున్నారు.
శిక్షణలో విద్యార్థులు
కాకినాడ(వెంకట్నగర్), న్యూస్టుడే: ఉద్యోగం సాధించాలంటే పట్టా ఉంటే సరిపోదు.. అందుకు అవసరమైన నైపుణ్యం కూడా అవసరం. ఏటా బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులు జిల్లా నుంచి సుమారు రెండు లక్షలకుపైగా బయటకు వస్తున్నారు. అందులో కేవలం 40శాతం మాత్రమే ఉద్యోగాలు సాధిస్తున్నట్లు ప్లేస్మెంట్ సెల్ అధికారులు చెబుతున్నారు. దీనికి కారణం వ్యక్తిగత, పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలపై వారికి పట్టులేకపోవడమే. దీన్ని గుర్తించిన రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రస్తుతం బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తోంది. కాకినాడ జిల్లాలో జేఎన్టీయూకేలో స్కిల్ కళాశాల ఏర్పాటు చేశారు. ఇందులో సర్టిఫైడ్ ఎంబైడెడ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఆటోమోటివ్, ఆటోమేషన్ రోబోటిక్స్ కోర్సుల్లో తర్ఫీదు ఇస్తున్నారు. కోర్సుపై ఆసక్తితో జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి సైతం విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థలో గానీ, జేఎన్టీయూకేలోని స్కిల్ కళాశాలలో గానీ సంప్రదించాలని డీఎస్డీవో హరిశేషు తెలిపారు.
నేర్పించే అంశాలు ఇవే..
* సర్టిఫైడ్ ఎంబైడెడ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కోర్సులో భాగంగా అయిదు నెలల కాల వ్యవధిలో ఎంబైడెడ్-సి, లైనిక్స్ పోర్టింగ్, రియల్టైం ఆపరేటింగ్ సిస్టమ్ (ఆర్టీఓఎస్), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ప్రొటోకాల్స్ డివైజ్ డ్రైవ్స్, తదితర అంశాల్లో శిక్షణ అందిస్తున్నారు.
* ఆటోమోటివ్, ఆటోమేషన్ రోబోటిక్స్ కోర్సులో భాగంగా ఆరు నెలల కాల వ్యవధిలో ఎన్ఎక్స్-కేడ్, 3డీ ప్రింటింగ్, రోబోటిక్స్, ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్ (పీఎల్సీ) తదితర అంశాల్లో తర్ఫీదిస్తున్నారు. వీటితోపాటు కోర్సు స్పెసిఫికేషన్, సాఫ్ట్ స్కిల్స్, లైఫ్స్కిల్స్, ప్రొఫెషనల్ డవలప్మెంట్, కంప్యూటర్ హ్యాండలింగ్ స్కిల్స్ అంశాలపై శిక్షణ అందిస్తున్నారు.
వ్యక్తిగత నైపుణ్యం పెంచుకునేందుకు
బీటెక్ ఈసీఈ పూర్తి చేశా. నాన్న వెంకటరమణమూర్తి వ్యవసాయం చేస్తుంటారు. ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటున్నా. నైపుణ్యం పెంచుకునేందుకు ఎంబైడెడ్ కోర్సులో శిక్షణ తీసుకుంటున్నా. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనకంటూ ప్రత్యేకత లేకపోతే వెనుకబడిపోతాం. అందుకే దూరమైనా రోజూ తరగతులకు హాజరవుతున్నా. కోర్ సంబంధిత ఉద్యోగంలో స్థిరపడాలనేది నా లక్ష్యం.
నరాల సుప్రసన్న
నూతన ఆవిష్కరణలు చేయాలి
చదువు పూర్తయిన వెంటనే పెళ్లయిపోయింది. పిల్లలు పుట్టడంతో ఉద్యోగం చేయలేదు. భర్త ప్రోత్సాహంతో మళ్లీ కోర్సులో మెలకువలు నేర్చుకునేందుకు శిక్షణకు వస్తున్నా. మారుతున్న నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. అందుకే ఆటోమేషన్, ఆటోమిషన్ రోబోటిక్స్లో శిక్షణ తీసుకుంటున్నా. కొత్త ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు చేయాలంటే చాలా ఇష్టం. ఆ దిశగా అడుగులు వేస్తాను.
తలాటం సత్య
యువత సద్వినియోగం చేసుకోవాలి...
బీటెక్ పూర్తిచేసిన అభ్యర్థులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. 18-35ఏళ్లలోపు ఎవరైనా చేరవచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత ఉపాధి కల్పిస్తాం. కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు ఆర్నెల్ల పాటు ప్రతినెలా రూ.వేయి భత్యంగా చెల్లిస్తారు. శిక్షణ తీసుకుంటున్న వారికి ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తాం. ఎవరికి ఎటువంటి రుసుం చెల్లించనవసరం లేదు. జేఎన్టీయూకేలోని స్కిల్ కళాశాలను జె.లోవబాబు పర్యవేక్షిస్తున్నారు. కోర్సులో చేరేందుకు ఆసక్తి గలవారు 97002 42847 సంప్రదించాలి. పాలిటెక్నిక్ పూర్తిచేసిన వారు సైతం శిక్షణ తీసుకునే అవకాశం ఉంది.
డి.హరిశేషు, డీఎస్డీవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నవరంలో నూతన ధ్వజస్తంభ పనులకు శ్రీకారం
[ 28-03-2024]
అన్నవరం దేవస్థానంలో అనివేటి మండపంలో బంగారు తాపడంతో నూతన ధ్వజస్తంభం ఏర్పాటుకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి గురువారం శ్రీకారం చుట్టారు. -
అనపర్తి బరిలో విశ్రాంత సైనికుడు
[ 28-03-2024]
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అనపర్తి నియోజకవర్గం తెదేపా, భాజపా, జనసేన కూటమి అభ్యర్థిగా విశ్రాంత జవాన్ ములగపూడి శివకృష్ణంరాజు పేరును అధిష్ఠానం బుధవారం రాత్రి ప్రకటించింది. -
ఓరి దేవుడా.. వీళ్లు మారరా..?
[ 28-03-2024]
రెండు చేతులు ఎత్తి భక్తితో మొక్కాల్సిన దేవుడిపైనా ఎందుకో కక్ష.. దైవ సన్నిధిలో భక్తితో మెలగాలన్న కనీస విజ్ఞత మరచి భక్తుల ఎదుటే బూతు పురాణం.. అర్చకులపై దాడి.. గడచిన అయిదేళ్లలో వరస సంఘటనలు ప్రభుత్వ వైఫల్యాన్ని, శాంతిభద్రతల పర్యవేక్షణ -
ఎన్నికలొస్తున్నాయి ఆపేయండి.. రూ.కోట్లు పెట్టాం కుదరదు!
[ 28-03-2024]
ఎన్నికలకు ఇంకా 47 రోజులే సమయం ఉంది. అయిదేళ్లుగా చేపట్టిన ఇసుక తవ్వకాల వల్ల ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాం.. ఇకనైనా తవ్వకాలు నిలిపి.. సహకరించండి.. -
కలెక్టర్ చెప్పినా ఖాతరు లేదు!
[ 28-03-2024]
రూ.వేలకు వేలు పెట్టుబడులు పెట్టాం.. చుక్క నీరు లేదు.. చావే శరణ్యం.. కష్టకాలంలో ఉన్నాం ఆదుకోండి మహా ప్రభో అంటూ కార్యాలయాల చుట్టూ తిరిగాం.. అధికారులకు వేదన వినిపించాం.. -
2,400 ఇళ్ల రద్దు
[ 28-03-2024]
జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో మంజూరు చేసిన గృహాల్లో 2,403 రద్దు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు పునాదులు పడని ఇళ్లను జాబితా నుంచి తొలగించారు. -
సి-విజిల్ ఫిర్యాదులపై సత్వర చర్యలు
[ 28-03-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి సీ-విజల్ యాప్కు వచ్చే ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతికాశుక్లా తెలిపారు. -
‘జగన్ను ఇంటికి పంపడమే కూటమి లక్ష్యం’
[ 28-03-2024]
అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన జగన్ను ఇంటికి పంపడమే తెదేపా, జనసేన, భాజపా కూటమి లక్ష్యమని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. -
కొంటారా.. కొర్రీలు వేస్తారా..?
[ 28-03-2024]
గత రెండేళ్లుగా రబీలో బొండాలు (ఎంటీయూ 3626) రకం ధాన్యం కొనుగోలుపై అయోమయం నెలకొంటోంది. ఈ రకం సాగు చేయొద్దని.. చేస్తే ధాన్యం కొనుగోలు చేయమని రెండేళ్ల కిందట వ్యవసాయ, పౌరసరఫరా శాఖల అధికారులు రైతులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. -
వాత్సల్యం చూపలేదు..!
[ 28-03-2024]
కె.గంగవరం మండలం కుడుపూరుకు చెందిన వీధి జీవన్బాబు తల్లిదండ్రులను కోల్పోయి తాతయ్య మందపల్లి వెంకట్రావు వద్ద పెరుగుతున్నాడు. ప్రస్తుతం దంగేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. -
ఎన్నికల ఏర్పాట్లపై నియోజకవర్గాల వారీగా నివేదికలు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణకు సంబంధించి నియోజకవర్గాల వారీగా నివేదికలు పంపించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. -
జగనన్నకాలనీలో యువకుడిని బలిగొన్న విద్యుత్తు తీగలు
[ 28-03-2024]
జగనన్నకాలనీలో చేతికందే ఎత్తులో ఉన్న అధిక సామర్థ్యపు విద్యుత్తు తీగ తగిలి పెయింటింగ్ పనులు చేసే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. -
నల్లమిల్లికి టికెట్ కేటాయించలేదని నిరసన
[ 28-03-2024]
అనపర్తి నియోజకవర్గానికి బుధవారం రాత్రి భాజపా అభ్యర్థి పేరు ప్రకటించిన వెంటనే తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. -
వైకాపా ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్ బ్యాచ్తో సంబంధం
[ 28-03-2024]
రాజమహేంద్రవరంలో అధికార వైకాపాకి చెందిన ఓ ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్ బ్యాచ్తో కూడా సంబంధాలు ఉన్నాయని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నగర ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. -
‘వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారు’
[ 28-03-2024]
వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారని సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైకాపా సీనియర్ నాయకుడు అల్లు విజయ్ కుమార్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్