నాడు పేదల ఆకలి తీర్చి.. నేడు సచివాలయంగా మార్చి
గత ప్రభుత్వ హయాంలో తుని పట్టణంలో రోజూ వేల మంది ఆకలి తీర్చిన ‘అన్న క్యాంటీన్’ భవనం ఇకపై వార్డు సచివాలయంగా మారనుంది.
న్యూస్టుడే - తుని: గత ప్రభుత్వ హయాంలో తుని పట్టణంలో రోజూ వేల మంది ఆకలి తీర్చిన ‘అన్న క్యాంటీన్’ భవనం ఇకపై వార్డు సచివాలయంగా మారనుంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు కారణాలతో అన్న క్యాంటీన్లను మూసివేసిన సంగతి విదితమే. ఆ తర్వాత ఈ భవనంపై రాళ్లదాడి జరగ్గా అద్దాలు ధ్వంసమయ్యాయి. సామగ్రి సైతం చోరీకి గురైంది. నిరుపయోగంగా వదిలేసిన ఈ భవనానికి సుమారు రూ.4.60 లక్షలు వెచ్చించి పాలనా కార్యాలయంగా మార్చారు. త్వరలో 14వ వార్డు సచివాలయంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇటీవలే పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో తీర్మానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్