logo

వాలంటీర్లపై ఎమ్మెల్యే ఆగ్రహం

ముమ్మిడివరంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వాలంటీర్లు సకాలంలో హాజరుకాకపోవడంపై ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 03 Feb 2023 06:04 IST

ముమ్మిడివరం: ముమ్మిడివరంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వాలంటీర్లు సకాలంలో హాజరుకాకపోవడంపై ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పంచాయతీ రాయుడువారిపాలెం సచివాలయం పరిధిలోని 16 వార్డు బొక్కావారిపాలెం నుంచి గురువారం మధ్యాహ్నం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించేందుకు షెడ్యూలు ప్రకటించారు. ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ హాజరుకాగా.. సమయానికి వాలంటీర్లు, పలువురు సచివాలయ సిబ్బంది రాకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం విషయంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిసింది. కార్యక్రమాన్ని వాయిదా వేసి శుక్రవారం నిర్వహించాలని నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని