దశ తిరగాలంటే.. దిశ మార్చుకోవాలి
విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ చాలా కీలకం. ఆ తరువాత ఏం చదవాలనుకుంటున్నామో.. ఏ కోర్సు ఎంపిక చేసుకుంటున్నామో మరింత ముఖ్యం.
‘ఈనాడు-కేఎల్ యూనివర్సిటీ’ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు అవగాహన సదస్సు
న్యూస్టుడే, కంబాలచెరువు(రాజమహేంద్రవరం)
అవగాహన సదస్సుకు హాజరైన విద్యార్థులు
విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ చాలా కీలకం. ఆ తరువాత ఏం చదవాలనుకుంటున్నామో.. ఏ కోర్సు ఎంపిక చేసుకుంటున్నామో మరింత ముఖ్యం. అదే మన భవితను నిర్దేశిస్తుంది. అందుకే విద్యార్థులు ఇంటర్ చదివేటప్పుడే ఆపై ఉన్నత చదువులు ఎక్కడ చదవాలి? ఏ కోర్సు చేయాలి.. దానికి ఉండే ఉపాధి అవకాశాలు ఏంటి? అని ఆలోచిస్తారు. ఇలాంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేయడానికి ‘ఈనాడు-కేల్ యూనివర్సిటీ’ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఇంటర్మీడియట్ విద్యార్థులకు ‘దశ-దిశ’ పేరిట అవగాహన సదస్సు నిర్వహించారు. రాజమహేంద్రవరం గ్రామీణంలోని కాతేరు తిరుమల విద్యాసంస్థల ప్రాంగణంలో జరిగిన సదస్సుకు విశేష స్పందన లభించింది. ఇంటర్ తరువాత ఇంజినీరింగ్లో విద్యార్థులు ఎలాంటి కోర్సులను ఎంచుకోవాలి.. ఒక నైపుణ్యంతో కూడిన ఇంజినీర్గా ఎలా ఎదగాలి.. రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలపైనే వార్షిక వేతనాలు పొందేలా ఎలా సన్నద్ధమవ్వాలి.. దానికి సంబంధించి కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తుందనే విషయాలను కేఎల్యూ అడ్మిషన్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ బొబ్బిలి సత్యనారాయణమూర్తి వివరించారు. ఇంజినీరింగ్ మొదటి ఏడాది తరువాత బ్రాంచి మార్పు, మళ్లీ కోర్సులు చేయడం, ఇంజినీరింగ్ కోర్సులో కొంతకాలం విదేశీ వర్సిటీలో ఇంటర్న్షిప్ వంటి అవకాశాలను క్షుణ్నంగా వివరించారు. సదస్సుకు హాజరైన విద్యార్థులకు కేఎల్యూ కిట్లు, కూపన్లు అందజేశారు. అనంతరం లక్కీడ్రా తీసి ఎంపికైన నలుగురు
విద్యార్థులకు తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్ నున్న తిరుమలరావు, కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ జె.శ్రీనివాసరావు, ‘ఈనాడు’ యూనిట్ ఇన్ఛార్జి చంద్రశేఖర్ప్రసాద్ చేతులమీదుగా బహుమతులు అందజేశారు.
తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్ తిరుమలరావును సత్కరించి జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో తిరుమల విద్యాసంస్థల ప్రిన్సిపల్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
నాలుగేళ్లలో 40 సంవత్సరాల భవిత
ఇంటర్ తరువాత నాలుగేళ్లు చదివే కోర్సు విద్యార్థుల 40 ఏళ్ల భవితను నిర్దేశిస్తుంది. మనకు నచ్చిన కోర్సును సరైన విద్యాసంస్థలో చదవడమే ముఖ్యం. అప్పుడే నైపుణ్యం పెరిగి అవకాశాలు రెట్టింపవుతాయి. ఏటా సుమారు పది లక్షల మంది జేఈఈ రాస్తుండగా ప్రభుత్వ వర్సిటీల్లో కేవలం 50 వేల మందికి మాత్రమే సీట్లు వస్తున్నాయి. దేశంలో మొత్తం ఉన్న మూడు వేల వర్సిటీల్లో కేంద్ర ప్రభుత్వం టాప్-100 విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్లు ఇస్తుంది. మిగిలిన వారు ఈ విద్యాసంస్థలను ఎంపిక చేసుకోవాలి. కేఎల్ వర్సిటీలో ఎంపిక చేసుకున్న కోర్సు నుంచి ఏడాది తరువాత మారే అవకాశం కల్పిస్తున్నాం. ఇంటర్ మార్కులు, కేఎల్ వర్సిటీ పరీక్షలో ప్రతిభ, జేఈఈ స్కోర్ ఆధారంగా మెరుగ్గా రాణించే విద్యార్థులకు వంద శాతం ఉపకార వేతనాలు అందజేస్తున్నాం. ఇంజినీరింగ్ కోర్సు చేస్తుండగానే మరో మైనర్ డిగ్రీ చేసేందుకు ప్రస్తుతం వీలుంది. ఈ విధంగా ప్రయత్నిస్తే త్వరితగతిన ఎక్కువ వేతనంతో ఉపాధి అవకాశాలుంటాయి. నచ్చిన ఉపాధ్యాయుడు నచ్చిన సమయంలో క్లాస్ వినేలా ఛాయిస్ బేస్డ్ వ్యవస్థ ఉన్న మల్టీ కోర్సుల కళాశాలనే విద్యార్థులు ఎంపిక చేసుకోవాలి. విదేశాల్లో చదివేందుకు వీలుగా పలు విదేశీ వర్సిటీలతో ఒప్పందం ఉన్న సంస్థల్లోనే చేరాలి.
జె.శ్రీనివాసరావు, అడ్మిషన్స్ డైరెక్టర్, కేఎల్ యూనివర్సిటీ
మల్టీ కోర్సులతో ఉపాధి అవకాశాలు
ప్రస్తుతం కొత్త విద్యావిధానం ద్వారా అందుబాటులోకి వచ్చిన మల్టీ కోర్సులతో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇంజినీరింగ్ చదువుతూనే మరొక కోర్సు మైనర్ డిగ్రీలా చేస్తే ప్రముఖ సంస్థల్లో అధిక వేతనంతో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. లెర్నింగ్లోనే ఎర్నింగ్ ఉండేలా ముందు నుంచే సన్నద్ధమవ్వాలి. సామాజిక మాధ్యమాల్లో సమయం వృథా చేయకుండా ఎంచుకున్న కోర్సులో నైపుణ్యం సాధించగలిగితే మీకు మీరే సాటి. ఇంటర్ తరువాత చదివే విద్యాసంస్థలో నాలుగేళ్లపాటు తీసుకునే శిక్షణ, ఆ స్ఫూర్తి, చేసిన వర్క్, ఆ కల్చర్ ఎంతో కీలకం. దాని ద్వారానే మన భవిష్యత్తు నిర్దేశితమవుతుంది. భవిష్యత్తులో ఇన్పర్సన్ కమ్యూనికేషన్ తగ్గిపోతుంది. దీని కోసం చాలా వర్సిటీల్లో సాఫ్ట్ స్కిల్స్ నేర్పుతున్నారు. చదువు, క్రమశిక్షణ, నాలెడ్జ్ వల్ల తిరుమల విద్యార్థులు ఎక్కడున్నా తెలిసిపోతుంది. మా విద్యార్థులను ఇంత తీర్చిదిద్దాక మంచి వర్సిటీకే వెళ్లాలని చెబుతాం.
నున్న తిరుమలరావు, తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ యాత్రన.. జనం యాతన
[ 19-04-2024]
విద్యుత్తు కట్.. అంతర్జాలం బంద్.. దుకాణాల మూత.. సామాన్యుల వాహనాలకు తోడు అంబులెన్సులు సైతం నిలిపివేత.. గంటలపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. -
ఎన్నికల వేళ యువతా.. అప్రమత్తం
[ 19-04-2024]
ఎన్నికల వేళ యవత మరిన్ని జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలిచారని బైక్ ర్యాలీల్లో పాల్గొనడం, ప్రత్యర్థులతో ఘర్షణకు దిగడం వంటివి ఎంతమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. -
అసలేం జరుగుతోంది..?
[ 19-04-2024]
ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్ పెట్టి తెప్పించేస్తారు. -
జిల్లాకు రానున్న ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారు. వీరికి అనుసంధానంగా లైజనింగ్, ఇతర సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
తొలిరోజు ఏడు నామినేషన్ల దాఖలు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకాగా తొలిరోజు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. -
పాదయాత్ర అబద్ధాలతో దండయాత్ర
[ 19-04-2024]
పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను. -
తొలిరోజు నామినేషన్ల సందడి
[ 19-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు. -
పేపరుమిల్లు కార్మికుల ఆందోళన
[ 19-04-2024]
సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్ గురువారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్మిల్లుకు చేరుకున్న సమయంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 రోజులుగా వేతన ఒప్పందం కోరుతూ సమ్మె చేస్తున్నా పేపర్మిల్లు యాజమాన్యం స్పందించడం లేదని నినాదాలు చేశారు. -
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది సమస్యాత్మక కేంద్రాలే. పోలింగ్ ముగిసే వరకు అధికారుల దృష్టంతా వాటిపైనే ఉంటుంది. -
అద్దె చెల్లించక అగచాట్లు
[ 19-04-2024]
వైకాపా పాలనలోని గత అయిదేళ్లలో అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు కేవలం నోటి మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు
[ 19-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన నుంచి గండేపల్లి మండలంలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆ పార్టీ నాయకుల అండదండలతో కొన్ని లే ఔట్లను ఏర్పాటు చేసి అక్రమంగా మెరక చేశారు. -
‘ఆత్మ’సాక్షి లేదా.. అన్నదాతంటే పడదా..!
[ 19-04-2024]
సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వలకు చిక్కిన 30 కిలోల చేప