logo

చంద్రబాబు మూడురోజుల పర్యటన ఖరారు

జగన్‌ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు.

Updated : 04 Feb 2023 05:44 IST

అనపర్తిలో సభాస్థలి గురించి చర్చిస్తున్న చినరాజప్ప, రామకృష్ణారెడ్డి

అనపర్తి, న్యూస్‌టుడే : జగన్‌ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. ఈనెల 16న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో అనపర్తిలో జరిగే బహిరంగ సభ ప్రదేశాలను శుక్రవారం చిన రాజప్ప, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో రాజప్ప మాట్లాడుతూ ఈనెల 14న జగ్గంపేట, 15న పెద్దాపురం, 16న అనపర్తిలోను చంద్రబాబునాయుడు పర్యటన ఉంటుందన్నారు. అనపర్తి పంచాయతీ ఆవరణలో బహిరంగ సభకు ఏర్పాట్లు పరిశీలించినట్లు తెలిపారు. కేసులను తప్పుదోవ పట్టించేందుకే జీవో నంబర్‌ 1, మూడు రాజధానుల అంశాలను తెరపై తీసుకువచ్చారన్నారు. జగన్‌ ఎన్ని అడ్డంకులు సృష్టించినా లోకేష్‌, చంద్రబాబు పర్యటనలను అడ్డుకోలేరన్నారు. రాష్ట్రంలో అప్పులు పెరుగుతున్నాయి గానీ అభివృద్ధి లేదని, చంద్రబాబుతోనే రాష్ట్రం, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు ఘన స్వాగతం పలికి మూడు రోజులు పర్యటనను నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విజయవంతం చేస్తామన్నారు. తెదేపా నాయకులు నాగేశ్వరరావు, దత్తుడు శ్రీను, సుధాకర్‌రెడ్డి, వెంకట రామారెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని