logo

యువకుడి మృతి.. ఆసుపత్రి ఎదుట కుటుంబసభ్యుల నిరసన

మండలంలోని కోటి కేశవరం గ్రామానికి చెందిన బోలా రాంబాబు అనే యువకుడు ఒక కాంట్రాక్ట్ పనిమీద వెళ్లి మృతి చెందాడు.

Published : 04 Feb 2023 16:23 IST

కోరుకొండ: మండలంలోని కోటి కేశవరం గ్రామానికి చెందిన బోలా రాంబాబు అనే యువకుడు ఒక కాంట్రాక్ట్ పనిమీద వెళ్లి మృతి చెందాడు. పనిలో భాగంగా 12 అడుగుల లోతులో దిగి రాంబాబు పని చేస్తుండగా పైనుంచి పడిన మట్టి నిండా కూరుకుపోవడంతో మృతి చెందాడు. ఈ క్రమంలో విషయం కాంట్రాక్టర్ కి చెప్పడానికి వెళ్లగా  అతడు పరారయ్యాడు. దీంతో బాధితుడి కుటుంబసభ్యులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.  నియోజకవర్గం జనసేన నాయకుడు బలరామకృష్ణ నిరసనకు సంఘీభావం తెలిపారు. మధ్య మండల డీఎస్పీ సంతోష్, మూడో పట్టణ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని