సందేశమివ్వు..సందేహం తీరు!
కొబ్బరిసాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఏపీ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని అంబాజీపేట ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ బి.శ్రీనివాసులు పేర్కొన్నారు
న్యూస్టుడే, అంబాజీపేట
కొబ్బరిసాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఏపీ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని అంబాజీపేట ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ బి.శ్రీనివాసులు పేర్కొన్నారు. కొబ్బరిపంటకు వ్యాపించే తెగుళ్లు, పురుగులు, కొబ్బరినూతన వంగడాలు, సాగుపద్ధతులు ఇలా పలు అంశాలపై ఆయన ‘న్యూస్టుడే’తో ముచ్చటించారు. కర్షకులు తమ సందేహాలను 73826 33653 ఈ నంబర్కు వాట్సాప్లో పంపితే సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.
* అంబాజీపేట ఉద్యాన పరిశోధన కేంద్రంలో అన్నదాతలకు అందిస్తున్న సేవలేవీ ?.
డాక్టర్ బి.శ్రీనివాసులు: రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేస్తున్నాం. కొబ్బరి, కొబ్బరితోటల్లో అంతరపంటల సాగు విధానాలపై జీవనియంత్రణ పద్ధతులు, నర్సరీ పెంపకం, కొబ్బరిలో సంకరీకరణపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.వాట్సాప్ ద్వారా ప్రత్యేక సలహాలు, సూచనలు ఇస్తున్నాం.
* కొబ్బరిపంటను ఆశించి నష్టం చేకూర్చుతున్న తెల్లదోమ నివారణకు ఏం చర్యలు తీసుకున్నారు.?
కొబ్బరిలో తెల్లదోమ నివారణకు సమగ్ర కీటక యాజమాన్య పద్ధతులను అభివృద్ధి చేశాం. దీనిలో భాగంగా బదనికలను రైతులకు తక్కువ ధరకు అందజేస్తున్నాం. ఈ తెల్లదోమ నివారణకు జీవనియంత్రణ ద్వారా విస్తృతమైన పరిశోధనలు కూడా జరుపుతున్నాం.తెల్లదోమ నివారణకు ఉపయోగించే బదనికల అభివృధ్ధికి వివిధ సంస్థలకు ఎంవోయూ ద్వారా సాంకేతికతను పెంపొందిస్తున్నాం.
* కొబ్బరిసాగు విస్తీర్ణం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు.?
కొబ్బరిలో అయిదు రకాలతో పాటు నాలుగు హైబ్రీడు రకాలను విడుదల చేశాం. నాణ్యమైన కొబ్బరిమొక్కల తయారీ చేసి సరఫరా చేస్తున్నాం. కొబ్బరిసాగును ప్రోత్సహించేందుకు అవగాహన సదస్సులు, సమావేశాలు, సంకరీకరణపై శిక్షణలు నిర్వహిస్తున్నాం.
ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికలో కొబ్బరిరైతులకు చేకూరుతున్న ప్రయోజనం.?
ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికలో భాగంగా ఎంపిక చేసిన రైతులకు జీవశిలీంధ్రాలైన ట్త్రెకోడెర్మా, సూడోమోనాస్, బదనికలైన అపెర్టోక్రైసా ఆస్టర్ వంటివి రైతులకు అందజేస్తున్నాం. బ్యాటరీ పిచికారీ యంత్రాలను ఎస్సీ రైతులకు అందజేశాం.
* ఉచితంగా అందిస్తున్న సేవలు.?.
రైతుల క్షేత్రసందర్శన, శిక్షణ కార్యక్రమాలు, రైతులతో - ఉద్యాన శాస్త్రవేత్తముఖాముఖి, విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన, సంకరీకరణ, నర్సరీ యాజమాన్యంపై ప్రత్యేక కార్యక్రమాలు, పురుగులు, తెగుళ్లు అరికట్టే విధానాలపై అవగాహన కల్పిస్తున్నాం.
* తెగుళ్లు, పురుగుల నివారణకు వినియోగించే బదనికల సరఫరా ఏఏ జిల్లాలు, రాష్ట్రాలకు చేస్తున్నారు..?
కొబ్బరిపంటను ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణకు ఉత్పత్తి చేస్తున్న అనేక జీవశిలీంధ్రాలు, బదనికలు అంతర పంటలపై కూడా ప్రభావం చూపుతున్నాయి.వీటిని ఏపీలోని అన్ని ప్రాంతాలతో పాటు ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు అందజేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ యాత్రన.. జనం యాతన
[ 19-04-2024]
విద్యుత్తు కట్.. అంతర్జాలం బంద్.. దుకాణాల మూత.. సామాన్యుల వాహనాలకు తోడు అంబులెన్సులు సైతం నిలిపివేత.. గంటలపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. -
ఎన్నికల వేళ యువతా.. అప్రమత్తం
[ 19-04-2024]
ఎన్నికల వేళ యవత మరిన్ని జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలిచారని బైక్ ర్యాలీల్లో పాల్గొనడం, ప్రత్యర్థులతో ఘర్షణకు దిగడం వంటివి ఎంతమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. -
అసలేం జరుగుతోంది..?
[ 19-04-2024]
ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్ పెట్టి తెప్పించేస్తారు. -
జిల్లాకు రానున్న ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారు. వీరికి అనుసంధానంగా లైజనింగ్, ఇతర సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
తొలిరోజు ఏడు నామినేషన్ల దాఖలు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకాగా తొలిరోజు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. -
పాదయాత్ర అబద్ధాలతో దండయాత్ర
[ 19-04-2024]
పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను. -
తొలిరోజు నామినేషన్ల సందడి
[ 19-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు. -
పేపరుమిల్లు కార్మికుల ఆందోళన
[ 19-04-2024]
సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్ గురువారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్మిల్లుకు చేరుకున్న సమయంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 రోజులుగా వేతన ఒప్పందం కోరుతూ సమ్మె చేస్తున్నా పేపర్మిల్లు యాజమాన్యం స్పందించడం లేదని నినాదాలు చేశారు. -
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది సమస్యాత్మక కేంద్రాలే. పోలింగ్ ముగిసే వరకు అధికారుల దృష్టంతా వాటిపైనే ఉంటుంది. -
అద్దె చెల్లించక అగచాట్లు
[ 19-04-2024]
వైకాపా పాలనలోని గత అయిదేళ్లలో అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు కేవలం నోటి మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు
[ 19-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన నుంచి గండేపల్లి మండలంలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆ పార్టీ నాయకుల అండదండలతో కొన్ని లే ఔట్లను ఏర్పాటు చేసి అక్రమంగా మెరక చేశారు. -
‘ఆత్మ’సాక్షి లేదా.. అన్నదాతంటే పడదా..!
[ 19-04-2024]
సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు