ఆరోగ్య పరీక్షలకు అశ్రద్ధ వద్దమ్మా..
సాధారణంగా ప్రైవేటు ఆసుపత్రులు, పరీక్ష కేంద్రాల్లో క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్న పని. దాంతో చాలామంది దానిని అశ్రద్ధ చేయడం, ఇబ్బంది వచ్చినప్పుడు చూద్దాంలే అనే ధోరణి కనిపిస్తోంది.
న్యూస్టుడే, రాజమహేంద్రవరం వైద్యం
క్యాన్సర్ పరీక్ష నివేదిక పరిశీలిస్తున్న సాంకేతిక నిపుణురాలు
సాధారణంగా ప్రైవేటు ఆసుపత్రులు, పరీక్ష కేంద్రాల్లో క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్న పని. దాంతో చాలామంది దానిని అశ్రద్ధ చేయడం, ఇబ్బంది వచ్చినప్పుడు చూద్దాంలే అనే ధోరణి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలో మహిళల కోసం కొద్ది నెలల క్రితం ప్రారంభించిన క్యాన్సర్ ఓపీ సేవలు సత్ఫలితాలిస్తున్నాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్(ఎన్సీడీ) గుర్తింపులో భాగంగా ఆసుపత్రిలోని ఏఆర్టీ కేంద్రం ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తున్నారు. రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ లక్షణాలను గుర్తించి మెరుగైన చికిత్స అందించేందుకు వీలుగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.7 లక్షలు వెచ్చించి క్యాన్సర్ లక్షణాలను గుర్తించే పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏఆర్టీ కేంద్రానికి వచ్చే రోగులతోపాటు సాధారణ ఓపీ ద్వారా వచ్చే వారిని సైతం పరీక్షించి సూచనలు చేస్తుండడంతో మహిళలకు ఉపయుక్తంగా ఉంటోంది.
ముందుగా గుర్తిస్తే మెరుగైన చికిత్స..
ప్రభుత్వాసుపత్రుల్లో పరీక్షలు లేకపోవడంతో క్యాన్సర్ స్క్రీనింగ్కు ఇంతవరకు మహిళలు దూరంగా ఉంటున్నారు. పరికరాలు అందుబాటులోకి రావడంతో అవసరమున్న మహిళలు పరీక్షలు చేయించుకోడం వల్ల వ్యాధి ముదరకముందే గుర్తించేందుకు వీలుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముందే గుర్తించడం వల్ల ప్రమాదం లేకుండా బయటపడొచ్చని పేర్కొంటున్నారు.
రోజుకు పదిమందికి పైగా..
రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలో గతేడాది నవంబరులో ఈ సేవలను ప్రారంభించినా కేవలం ఏఆర్టీ కేంద్రం వైద్యులు పంపిన హెచ్ఐవీ రోగుల మాత్రమే సేవలు పొందేవారు. ప్రస్తుతం సాధారణ ఓపీతోపాటు ఆసుపత్రిలోని ఏ వైద్యులు రిఫర్ చేసినా ఇక్కడ రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. వచ్చిన ప్రతిఒక్కరికీ రెండు రకాల స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు. గతంలో ఈ పరీక్షలకు రోజుకు నలుగురు వస్తే గత నెల మొత్తం సగటున 250 మంది క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్నారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఒప్పందం ప్రకారం ఓ సంస్థ ప్రతినిధులు క్యాన్సర్ పరీక్షలకు సంబంధించి సేవలందిస్తున్నారన్నారు. ఈ పరీక్షల్లో ఏ మహిళలకైనా లక్షణాలున్నట్లు నిర్ధారణ అయితే వారిని మెరుగైన చికిత్స అందించడంతోపాటు వ్యాధి ఏ దశలో ఉందో తెలుసుకుని తదుపరి చికిత్సలను వివరిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సినిమా హీరోలంటే జగన్కు కుళ్లు.. చర్చలకు పిలిచి అవమానించారు: పవన్
[ 20-04-2024]
లక్షలాది మంది అభిమానులు ఉన్న సినిమా హీరోలంటే సీఎం జగన్కు కుళ్లు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. -
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
[ 20-04-2024]
కాకినాడ జిల్లా కొత్తపల్లిలో తెదేపా నేతలు, కార్యకర్తలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
సిద్ధమంటూ వచ్చి.. నరకం చూపించి
[ 20-04-2024]
చిన్నారులు మొదలు వృద్ధుల వరకు ఎవరినీ వదలలేదు. పొలోమని బస్సులెక్కించారు.. సిద్ధం సభకు తరలి రావాల్సిందే అంటూ హుకుంలు జారీ చేశారు..తమకు తెలియని ప్రాంతానికి వచ్చి మండుటెండల్లో వారు నరకం చూశారు.. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
[ 20-04-2024]
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం: పురందేశ్వరి
[ 20-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇవ్వలేని పరిసితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. -
వెంకన్న కల్యాణం.. కల్యాణ క్రతువు
[ 20-04-2024]
కోనసీమ తిరుమలగా భాసిల్లుతున్న వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. -
నేడు కోరుకొండలో వారాహి విజయభేరి సభ
[ 20-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్కల్యాణ్ రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో శనివారం నిర్వహించనున్న వారాహి విజయభేరి బహిరంగసభలో పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న ఆయన జిల్లాలోని జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న ప్రాంతాలపైనా ప్రత్యేక దృష్టి సారించారు. -
పడలేదు పునాది.. పారిశ్రామికం సమాధి
[ 20-04-2024]
పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్లో మంచి వాతావరణం ఉంది. గోకవరం మండలంలోని గుమ్మళ్లదొడ్డి ఏపీఐఐసీ పార్కులో రూ.270 కోట్లతో అస్సాగో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు భూముల కేటాయింపు, అన్ని అనుమతులు ఆరు నెలల్లోనే ఇచ్చాం. -
కొనసాగిన నామినేషన్ల సందడి
[ 20-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో రెండో రోజే నామినేషన్ల దాఖలు సందడి కొనసాగింది. -
వైకాపా నాయకుల పథకం.. వాలంటీర్లు ప్రచారం!
[ 20-04-2024]
వైకాపా నాయకుల ఒత్తిళ్లతో కొంతమంది వాలంటీర్లు రాజీనామాలు చేసి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుంటే మరి కొంతమంది రాజీనామాలు చేయకుండానే ప్రచారం చేస్తున్నారు. -
రూ.8.73 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం
[ 20-04-2024]
ఎన్నికల తనిఖీల్లో భాగంగా ధవళేశ్వరం పోలీసులు శుక్రవారం రూ.8.73 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
హోంమంత్రి నామినేషన్ ర్యాలీకి వెళ్లొస్తుండగా ప్రమాదం
[ 20-04-2024]
హోంమంత్రి నామినేషన్ ర్యాలీకి వెళ్లిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై తిరిగొస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. -
జగన్ సిద్ధం.. ప్రయాణాలు నిషిద్ధం
[ 20-04-2024]
ఆర్టీసీ కాంప్లెక్స్లలో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించినా ఒక్క బస్సు వస్తే ఒట్టు.. మరోవైపు సిద్ధం సభకు గ్రామాలకు పెద్దసంఖ్యలో బస్సులు కేటాయించినా కొన్ని ఖాళీగా.. మరికొన్ని ముగ్గురు, నలుగురు ప్రయాణికులతో వెళ్లాయి. -
వైద్యరంగానికి ఇదేనా పెద్దపీట
[ 20-04-2024]
వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. అరుదైన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగుల పట్ల కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. -
జిల్లాలో రెండోరోజు 12 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో రెండోరోజు శుక్రవారం 12 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఇళ్లకు వెళ్లడం ఎలా?
[ 20-04-2024]
సిద్ధం సభకు పలు జిల్లాల నుంచి వెయ్యికిపైగా బస్సులు ఏర్పాటుచేశారు. జనాన్ని తీసుకొచ్చినప్పుడు చూపిన శ్రద్ధ తిరుగు ప్రయాణంలో చూపకపోవడంతో సభ సాయంత్రం 6.30 గంటలకు ముగిసినా.. బస్సుల కోసం రాత్రి 10 గంటల వరకు నిరీక్షించాల్సి వచ్చింది. -
సమగ్ర వ్యయ పర్యవేక్షణకు చర్యలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చులపై సమగ్ర పర్యవేక్షణకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
9 ఇనుప మేకులు మింగిన ఖైదీ.. ప్రాణాలు కాపాడిన వైద్యులు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..