పరీక్షల నాటికి సిద్ధమయ్యేనా ?
కళాశాలలో మొత్తం నాలుగు ప్రయోగశాలలున్నాయి. కొన్ని పరికరాలను కొద్ది రోజులుగా వినియోగించక మూలన పడి ఉన్నాయి. పలు రకాల పరికరాల కొరత ఉంది. స్క్రూగేజ్, వెర్నియర్ క్యాలిపర్స్ తదితర పరికరాలు తుప్పుపట్టి కనిపించాయి.
కొన్ని ఇంటర్ ప్రయోగశాలల తీరిది
ఏలూరు జూనియర్ కళాశాలలో ఇలా..
కళాశాలలో మొత్తం నాలుగు ప్రయోగశాలలున్నాయి. కొన్ని పరికరాలను కొద్ది రోజులుగా వినియోగించక మూలన పడి ఉన్నాయి. పలు రకాల పరికరాల కొరత ఉంది. స్క్రూగేజ్, వెర్నియర్ క్యాలిపర్స్ తదితర పరికరాలు తుప్పుపట్టి కనిపించాయి. అవసరమైన కొత్త పరికరాల్ని ఇటీవలే కొనుగోలు చేశామని, ప్రయోగ పరీక్షల ప్రారంభం నాటికి వాటిని సంసిద్ధం చేస్తామని ప్రధానాచార్యుడు తెలిపారు* రసాయన శాస్త్ర పరికరాలన్నీ పూర్తిగా దుమ్ము పట్టి ఉన్నాయి* వృక్ష, జంతు శాస్త్ర ప్రయోగశాలల్లో పరికరాలన్నీ దాదాపు బీరువాలకే పరిమితం. విద్యార్థుల సంఖ్యకు సరిపడా తరగతి గదులు లేనందున ప్రయోగశాలల్లోనే థియరీ తరగతులు నిర్వహిస్తున్నారు.
శూన్యంలో ప్రయోగం
తాడేపల్లిగూడెం అర్బన్, వన్టౌన్ న్యూస్టుడే: తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనం లేక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఇరుకు గదుల మధ్య నిర్వహిస్తున్నారు. సుమారు 400 మంది విద్యార్థులున్నా.. ఆ మేరకు గదులు లేవు. తరగతి గదిలోనే ఒక మూల ప్రయోగశాలను నిర్వహించుకోవాల్సిన దుస్థితి.
ఏలూరు విద్యా విభాగం, న్యూస్టుడే: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు... వృత్తివిద్య విద్యార్థులకు ఈ నెల 20 నుంచి, జనరల్ వారికి 26 నుంచి ప్రారంభమవుతాయి. వీటి నిర్వహణకు కొద్ది రోజుల వ్యవధే ఉంది. ఈ నేపథ్యంలో సంసిద్ధతపై ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రయోగశాలలను ‘న్యూస్టుడే’ బృందం పరిశీలించింది.
పరికరాలు లేవు ఎలా...
కైకలూరు, న్యూస్టుడే: కైకలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒకేషనల్ విభాగంలో సీఈటి గ్రూపు విద్యార్థులు పరికరాల లేమితో ప్రయోగాలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. కొన్నేళ్లుగా పరికరాలు మూలకు చేరడంతో ఉపాధ్యాయులు చరవాణి ఆధారంగానే విద్యార్థులకు ప్రయోగాలపై తర్ఫీదు అందిస్తున్నారు. సర్వే నిర్వహించేందుకు కావాల్సిన డంపిలెవెల్, డంపిండ్ స్టాండ్లు, డ్రాయింగ్ బోర్డులు, సిమెంటు, కంకర మిశ్రమాలను సరిచూసే నమూనా యంత్రం, బరువు యంత్రం వంటి పరికరాలు పూర్తిగా పాడైపోయాయి. వీటి స్థానంలో కొత్త వాటి కోసం ప్రతిపాదనలు పంపినా మంజూరు కాలేదు.
తరగతి గదిలోనే
యలమంచిలి, న్యూస్టుడే: యలమంచిలి మండల కేంద్రంలో ఉన్న జూనియర్ కళాశాలకు సొంత భవనం లేక ఉన్నత పాఠశాల పై భాగంలో ఉన్న గదులను కేటాయించారు. ఈ కళాశాలలో తరగతి గదిలోనే ఒక మూలన ప్రయోగశాల నిర్వహిస్తున్నారు. ఉన్న 19 మంది విద్యార్థులకు ఇది సరిపోతుందని అధ్యాపకులు చెబుతున్నారు.
ఓ పక్కన .. పనులు
జంగారెడ్డిగూడెం, న్యూస్టుడే : జంగారెడ్డిగూడెం ఎస్డీఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రయోగశాలల గదుల్లో నాడు నేడు పనులు చేపట్టారు. నాలుగు ప్రయోగశాలల్లో ఫ్లోరింగ్ నిర్మిస్తున్నారు. దీంతో పరికరాలను ఇతర గదుల్లోకి మార్చారు. మరో పక్క ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రయోగ పరీక్షలు జరిగే నాటికి సిద్ధం చేస్తామని ప్రిన్సిపల్ తెలిపారు.
వారే సిద్ధం చేసుకోవాలి
ఇంటర్ ప్రయోగ పరీక్షలు నిర్వహించే కేంద్రాలకు (జూనియర్ కళాశాలలు) సంబంధించిన వారే ప్రయోగ పరికరాలను సిద్ధం చేసుకోవాలి. పరీక్షల ప్రారంభానికి కొద్ది రోజుల ముందుగా ఎగ్జామినర్లు సంబంధిత కేంద్రాలకు వెళ్లి ప్రయోగశాలలను పరిశీలిస్తారు. వాటిలోని స్థితిగతులను పరిశీలించి అన్నీ సవ్యంగా ఉంటేనే తగిన ధ్రువపత్రం ఇస్తారు. ప్రయోగ పరీక్షలకు కేటాయించిన కేంద్రాల్లో అన్నిరకాల వసతులు కల్పించేలా ఇప్పటికే ఆయా కళాశాలల ప్రధానాచార్యులకు ఆదేశాలు ఇచ్చాం.
కె.చంద్రశేఖర్బాబు, ఆర్ఐవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్ధమంటూ వచ్చి.. నరకం చూపించి
[ 20-04-2024]
చిన్నారులు మొదలు వృద్ధుల వరకు ఎవరినీ వదలలేదు. పొలోమని బస్సులెక్కించారు.. సిద్ధం సభకు తరలి రావాల్సిందే అంటూ హుకుంలు జారీ చేశారు..తమకు తెలియని ప్రాంతానికి వచ్చి మండుటెండల్లో వారు నరకం చూశారు.. -
జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం: పురందేశ్వరి
[ 20-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇవ్వలేని పరిసితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. -
వెంకన్న కల్యాణం.. కల్యాణ క్రతువు
[ 20-04-2024]
కోనసీమ తిరుమలగా భాసిల్లుతున్న వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. -
నేడు కోరుకొండలో వారాహి విజయభేరి సభ
[ 20-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్కల్యాణ్ రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో శనివారం నిర్వహించనున్న వారాహి విజయభేరి బహిరంగసభలో పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న ఆయన జిల్లాలోని జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న ప్రాంతాలపైనా ప్రత్యేక దృష్టి సారించారు. -
పడలేదు పునాది.. పారిశ్రామికం సమాధి
[ 20-04-2024]
పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్లో మంచి వాతావరణం ఉంది. గోకవరం మండలంలోని గుమ్మళ్లదొడ్డి ఏపీఐఐసీ పార్కులో రూ.270 కోట్లతో అస్సాగో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు భూముల కేటాయింపు, అన్ని అనుమతులు ఆరు నెలల్లోనే ఇచ్చాం. -
కొనసాగిన నామినేషన్ల సందడి
[ 20-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో రెండో రోజే నామినేషన్ల దాఖలు సందడి కొనసాగింది. -
వైకాపా నాయకుల పథకం.. వాలంటీర్లు ప్రచారం!
[ 20-04-2024]
వైకాపా నాయకుల ఒత్తిళ్లతో కొంతమంది వాలంటీర్లు రాజీనామాలు చేసి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుంటే మరి కొంతమంది రాజీనామాలు చేయకుండానే ప్రచారం చేస్తున్నారు. -
రూ.8.73 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం
[ 20-04-2024]
ఎన్నికల తనిఖీల్లో భాగంగా ధవళేశ్వరం పోలీసులు శుక్రవారం రూ.8.73 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
హోంమంత్రి నామినేషన్ ర్యాలీకి వెళ్లొస్తుండగా ప్రమాదం
[ 20-04-2024]
హోంమంత్రి నామినేషన్ ర్యాలీకి వెళ్లిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై తిరిగొస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. -
జగన్ సిద్ధం.. ప్రయాణాలు నిషిద్ధం
[ 20-04-2024]
ఆర్టీసీ కాంప్లెక్స్లలో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించినా ఒక్క బస్సు వస్తే ఒట్టు.. మరోవైపు సిద్ధం సభకు గ్రామాలకు పెద్దసంఖ్యలో బస్సులు కేటాయించినా కొన్ని ఖాళీగా.. మరికొన్ని ముగ్గురు, నలుగురు ప్రయాణికులతో వెళ్లాయి. -
వైద్యరంగానికి ఇదేనా పెద్దపీట
[ 20-04-2024]
వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. అరుదైన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగుల పట్ల కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
[ 20-04-2024]
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
జిల్లాలో రెండోరోజు 12 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో రెండోరోజు శుక్రవారం 12 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఇళ్లకు వెళ్లడం ఎలా?
[ 20-04-2024]
సిద్ధం సభకు పలు జిల్లాల నుంచి వెయ్యికిపైగా బస్సులు ఏర్పాటుచేశారు. జనాన్ని తీసుకొచ్చినప్పుడు చూపిన శ్రద్ధ తిరుగు ప్రయాణంలో చూపకపోవడంతో సభ సాయంత్రం 6.30 గంటలకు ముగిసినా.. బస్సుల కోసం రాత్రి 10 గంటల వరకు నిరీక్షించాల్సి వచ్చింది. -
సమగ్ర వ్యయ పర్యవేక్షణకు చర్యలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చులపై సమగ్ర పర్యవేక్షణకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?