ప్రాణాలు కాపాడే యాప్లు..
ప్రమాదాల్లో తీవ్ర గాయాలైనపుడు, గర్భిణులకు ప్రసవ సమయంలో, శస్త్రచికిత్సలు జరిగేటపుడు రక్తం ఎంతో అవసరం. పలు సందర్భాల్లో అత్యవసర సమయాల్లో రక్తం అందక పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి.
న్యూస్టుడే, చాగల్లు
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల యాప్లు
ప్రమాదాల్లో తీవ్ర గాయాలైనపుడు, గర్భిణులకు ప్రసవ సమయంలో, శస్త్రచికిత్సలు జరిగేటపుడు రక్తం ఎంతో అవసరం. పలు సందర్భాల్లో అత్యవసర సమయాల్లో రక్తం అందక పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. చాలామంది రక్తం ఎక్కడ దొరుకుతుంది, ఎవర్ని అడగాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. మధ్యవర్తులను ఆశ్రయించి అధికంగా ఖర్చు చేస్తారు. ప్రైవేటు కేంద్రాల్లో వారు ఎంత చెబితే అంత ఇవ్వాల్సిందే. ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రక్తనిధులకు సంబంధించి రెండు యాప్లను రూపొందించాయి. వీటిలో రక్త నిల్వలకు సంబంధించి పూర్తి సమాచారం ఉంటుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో..
రక్తం కోసం ఎవరూ ఇబ్బంది పడకుండా, అరచేతిలో సమాచారం లభించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో రెండు యాప్లు రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో ‘ఏపీ బ్లడ్ సెల్’, కేంద్రం ఆధ్వర్యంలో ‘ఈ రక్త్ కోశ్’ అనే వాటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్ల్లో రక్తనిధి కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి, మనకు అవసరమైన రక్తం ఎక్కడ దొరుకుతుంది, ఎంత దూరం వెళ్లాలి, బ్లడ్ బ్యాంకు ఫోన్ నంబర్ తదితర వివరాలన్నీ ఉంటాయి.
డౌన్లోడ్ ఇలా..
గూగుల్ ప్లే స్టోరులోకి వెళ్లి ఆయా పేర్లతో టైప్ చేస్తే యాప్లు కనిపిస్తాయి. వాటిని డౌన్లోడ్ చేసుకుని, వారు అడిగిన వివరాలు పొందుపరిచి అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. అందులో మీకు కావాల్సిన రక్తం గ్రూపు వివరాలతో సెర్చ్ చేస్తే సంబంధిత వివరాలు వస్తాయి. వీటితో పాటు ఆ రక్తనిధి కేంద్రం ప్రభుత్వం, ప్రైవేటు లేదా స్వచ్ఛంద సంస్థల్లో దేని ఆధ్వర్యంలో నడుస్తుందో తెలుసుకోవచ్చు.
ఎంతో ఉపయోగం..
నాగమణి, డ్రగ్స్ ఏడీఈ, రాజమహేంద్రవరం
అత్యవసర సమయాల్లో రక్తం ఎవరిని అడగాలో తెలియక చాలామంది ఆందోళనకు గురవుతుంటారు. అటువంటి వారికి ఈ యాప్లు ఎంతో ఉపయోగపడతాయి. ఏయే కేంద్రాల్లో ఏఏ గ్రూపులు ఉన్నాయి, ఎంత మొత్తం ఉంది తదితర వివరాలన్నీ ఇందులో ఉంటాయి. అవసరమైన వారు వీటిని సద్వినియోగం చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోసపు దీవెన.. సొమ్మురాక వేదన
[ 25-04-2024]
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తామని... దాని కోసం విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. -
ప్రతి గొంతూ జేజేలు
[ 25-04-2024]
నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి. జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి. -
నియమావళికి సెలవిచ్చి.. మంత్రి హామీకి విలువిచ్చి..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు హడావుడిగా జిల్లావ్యాప్తంగా అనేక పనులకు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు శంకుస్థాపనలు చేశారు. వీటిలో కొన్ని పనులు నేటికీ ప్రారంభించనేలేదు. -
జగన్.. మాపై ఎందుకింత కక్ష?
[ 25-04-2024]
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. -
సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
[ 25-04-2024]
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. -
కొవ్వూరు వైకాపాలో రగడ
[ 25-04-2024]
కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. -
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారంతో ముగియనుంది. పోటీచేసే అభ్యర్థుల నుంచి చివరిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్
[ 25-04-2024]
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం
[ 25-04-2024]
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్ వాపోయారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
[ 25-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ ఓ పౌరుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో జై భారత్ -
నన్నయలో ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కమిటీ సభ్యుల పర్యటన
[ 25-04-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా పథకానికి సంబంధించిన పనులను కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. -
భీమేశ్వరుని గర్భాలయం మూసివేత
[ 25-04-2024]
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?